ఉదయ్ శంకర్, మేఘా ఆకాష్ ల కొత్త సినిమా ప్రారంభం

ప్రతిభావంతమైన నటుడిగా  పేరు తెచ్చుకున్న ఉదయ్ శంకర్ హీరోగా కొత్త సినిమా హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ టెంపుల్ లో ప్రారంభం అయింది. మన్మోహన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై డాక్టర్ సౌజన్య ఆర్ అట్లూరి సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. ముహూర్త షాట్ కు ముఖ్య అతిథులుగా వచ్చిన శ్రీరామ్ సార్ క్లాప్ కొట్టగా.. దినేష్ చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.


ఈ సంధర్భంగా నటుడు మధునందన్ మాట్లాడుతూ.. శ్రీరామ్ మూవీస్ ప్రొడక్షన్ లో రెండో సినిమా స్టార్ట్ అయింది. నారాయణరావుగారు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న మన్మోహన్ నా సొంత బ్రదర్. ఈ అవకాశం ఇచ్చిన నారాయణ రావుగారికి థ్యాంక్యూ. ఇదే బ్యానర్ లో మరోసారి ఉదయ్ హీరోగా నటిస్తుండటం హ్యాపీగా ఉంది. ఉదయ్ కి ఈ చిత్రం సూపర్ హిట్ ఇస్తుందని చెప్పగలను. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ మొత్తం నేను చదివాను. అందుకే ఉదయ్ కి మంచి హిట్ ఇవ్వడంతో పాటు అతన్ని నెక్ట్స్ లీగ్ లోకి తీసుకువెళుతుందనుకుంటున్నాను. శ్రీ రామ్ మూవీస్ బ్యానర్ తో పాటు ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్  ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్యూ..’ అన్నారు.


హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ..  హీరోగా నాకు ఇది ఐదో సినిమా. ఈ బ్యానర్ లో రెండో సినిమా. నిర్మాత నారాయణరావుగారితో మరోసారి అసోసియేట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఓ రకంగా ఇది ఫ్యామిలీ ప్రాజెక్ట్ లాంటిదే. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ తర్వాత మధునందన్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ మూవీలో అతనికి చాలా ఇంపార్టెంట్ రోల్. హిలేరియస్ గా సాగే ఎగ్జైటింగ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. మధునందన్ బ్రదర్ తన డెబ్యూ మూవీతో మన్మోహన్ అద్భుతమైన స్క్రిప్ట్ తో వచ్చాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంటుంది. అతి త్వరలోనే రెగ్యులర్ షూట్ కు వెళ్లబోతున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్ట్ మాకు కావాలి.. ’అన్నారు.

దర్శకుడు మన్మోహన్ మాట్లాడుతూ..  శ్రీరామ్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ టూ ముహూర్తం జరిగింది. దర్శకుడుగా ఇది నాకు ఫస్ట్ మూవీ. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నారాయణరావుగారికి, హీరో ఉదయ్ కి థ్యాంక్యూ. నా కెరీర్ మొత్తం నన్ను సపోర్ట్ చేస్తున్న నా బ్రదర్ కూ థ్యాంక్స్. ఈ మూవీ ఏప్రిల్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. ఈ షెడ్యూల్ లో మొత్తం కాస్ట్ క్రూ ఉంటుంది. ఇది ఫ్యామిలీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఒక చిన్న ప్రేమకథ కూడా మిక్స్ అయి ఉంటుంది. మీ అందరికీ ఈ కథ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ మొత్తం జర్నీలో మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను.. ’ అన్నారు.



నిర్మాత నారాయణరావు మాట్లాడుతూ…  శ్రీరామ్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ టూ కూడా ఉదయ్ తోనే మొదలుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా గురువు గారు శ్రీరామ్ సార్ కీ, నా మిత్రుడు దినేష్ చౌదరికీ, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ మూవీ కథ చాలా బావుటుంది. స్క్రిప్ట్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. ఉదయ్ శంకర్ తో పాటు హీరోయిన్ మేఘా ఆకాశ్ పాత్రలు చాలా బావుంటాయి. మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ జాంబిరెడ్డి ఫేమ్ అనిత్ కుమార్ అందిస్తున్నారు. మంచి కాస్ట్ అండ్ క్రూతో వస్తున్న ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు.


ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూట్ కు వెళ్లబోతోన్న ఈ చిత్రంలో నటీ నటులు :
ఉదయ్ శంకర్, మేఘా ఆకాశ్, మధునందన్, వెంకటేష్ కాకమాను, శశి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : అనిత్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : షర్మేల యొలిశెట్టి
కాస్ట్యూమ్ డిజైనర్ : జోష్యుల గాయత్రిదేవి
పిఆర్వో : జిఎస్కే మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : సాయి కృష్ణ, వెంకీ, కిశోర్
నిర్మాత : అట్లూరి నారాయణరావు
రచన, దర్శకత్వం : మన్మోహన్ మేనంపల్లి

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

17 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago