వి 4 సినీ క్రియేషన్స్ పతాకం పై వికాస్ మరియు శాంతి హీరో హీరోయిన్ గా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం లో డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మించిన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ చిత్రం “దర్శిని”. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.
అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ “రెండున్నర సంవత్సరాల క్రితం ఈ దర్శిని టీం వాళ్ళు ఫిలిం ఛాంబర్ దగ్గర నన్ను కలిశారు. ఉన్నత చదువులు చదివి డాక్టరేట్ పొంది ప్రొఫెస్సర్స్ గా రాణించి ఇప్పుడు దర్శిని అనే ఒక సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ చిత్రం తో చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. నన్ను మొదటి పోస్టర్ ను విడుదల చేయమన్నారు. వైజాగ్ లో ఒక ఈవెంట్ లో దర్శిని చిత్ర మొదటి పోస్టర్ ను విడుదల చేశాను. తర్వాత వీళ్ళ ప్యాషన్ నచ్చి సినిమా చూసాను, కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తక్కువ బడ్జెట్ లో చాలా మంచి సినిమా తీశారు. త్వరలో విడుదల కాబోతుంది, విజయం సాధించాలి” అని కోరుకున్నారు.
నిర్మాత డాక్టర్ ఎల్ వి సూర్యం మాట్లాడుతూ “మాకు ఈ సినిమా ఫీల్డ్ కొత్త, కానీ సినిమా మీద ఉన్న ప్యాషన్ తో దర్శిని చిత్రాన్ని నిర్మించాం. ఈ ప్రయాణంలో మాకు బాగా సపోర్ట్ గా నిలిచిన మొదటి వ్యక్తి కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు. మాకు సపోర్ట్ గా నిలిచిన దామోదర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేసాడు. మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ఈ దర్శిని చిత్రంలో మూడు ముఖ్య పాత్రలు, జీవితం మీద అసంతృప్తిగా ఉన్న ముగ్గురు కి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేదే మా చిత్ర కథ. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. మే నెలలో విడుదల చేస్తాం” అని తెలిపారు.
దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు మాట్లాడుతూ “కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు మా గాడ్ ఫాథర్. మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మా నిర్మాత, మా కో డైరెక్టర్, మా హీరో, హీరోయిన్ మేము అందరం ఇప్పుడు ఒక ఫామిలీ. అందరం సొంత సినిమా గా పని చేసాం. సినిమా చాలా బాగా వచ్చింది, మే నెలలో విడుదల అవుతుంది. అందరికి నచ్చుతుంది” అని కోరుకున్నారు.
హీరో వికాస్ మాట్లాడుతూ “మా చిత్రానికి పునాది మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు. ఈ జర్నీ లో చాలా కష్టాలు చూసాము కానీ సినిమా మీద ప్యాషన్ తో కష్టపడి పని చేసాము. సినిమా చాలా బాగా వచ్చింది, త్వరలో విడుదల అవుతుంది” అని తెలిపారు.
శబరి నిర్మాత మహేంద్ర గారు మాట్లాడుతూ “కాకినాడ జె ఎన్ టి యు యూనివర్సిటీ లో చదువుకున్న ఇద్దరు ప్రొఫెసర్లు సినిమా మీద ప్రేమ తో ఈ దర్శిని చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఘనవిజయం కావాలి” అని కోరుకున్నారు.
కో డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ “ఈ చిత్రం ప్రారంభం కావడానికి కారణం మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు. చాలా కష్టాలు పడి సినిమాను నిర్మించాము, మే నెలలో విడుదల అవుతుంది. సినిమా బాగా వచ్చింది, అందరికి నచ్చుతుంది” అని తెలిపారు.
నటుడు సత్య ప్రసాద్ మాట్లాడుతూ “ఈ సినిమా లో పనిచేసిన అందరం ఒక ఫ్యామిలీ గా ఉన్నాము. మొదట షార్ట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళం కరోనా టైం లో సినిమా చేద్దాం అని ప్లాన్ చేసాం, సినిమా రెడీ అయింది. ఈ నెల మే లో విడుదల అవుతుంది” అమీ తెలిపారు.
జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ “టీజర్ మరియు ట్రైలర్ నాకు బాగా నచ్చింది. యంగ్ టాలెంట్ కి సపోర్ట్ చేయాలి అని ఈ ప్రెస్ మీట్ కి వచ్చాను. మొన్న సుమన్ టీవీ లో ఇంటర్వ్యూ కూడా చేశాను. చాలా టాలెంట్ ఉన్న మనుషులు. డిఫరెంట్ కథ కథనం తో వస్తున్నారు. త్వరలో విడుదల అవుతుంది. సినిమా మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.
బ్యానర్ : వి 4 సినీ క్రియేషన్స్
చిత్రం పేరు : దర్శిని
నటీనటులు : వికాస్, శాంతి, సత్య ప్రసాద్, తదితరులు
కెమెరా మాన్ : రవి మిల్కీ
ఎడిటర్ : ప్రవీణ్ జైరాజ్, చందు చలమల
సంగీతం : నిజాని అంజన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : శివ ప్రసాద్
డి ఐ : బి 2 హెచ్ స్టూడియోస్
కలరిస్ట్ : వెంకట్
డబ్బింగ్ : సిద్ధూ పట్నాన, రాజు గరుడే
సౌండ్ ఇంజనీర్ : దామోదర్ రావు
వి ఎఫ్ ఎక్స్ : ప్రవీణ్ జైరాజ్
డిజైన్స్ : ఎమ్ కె ఎస్ మనోజ్
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ మార్కెటింగ్ : ఎస్ 3 డిజిటల్ మీడియా వర్క్
లైన్ ప్రొడ్యూసర్ మరియు కో డైరెక్టర్ : కె సంతోష్ కుమార్
దర్శకుడు : డాక్టర్ ప్రదీప్ అల్లు
ప్రొడ్యూసర్ : డాక్టర్ ఎల్ వి సూర్యం
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…