సిటాడెల్: హనీ బన్ని భారతదేశము మరియు ప్రపంచవ్యాప్తంగా 240 పైగా దేశాలు మరియు భూభాగాలలో నవంబరు 7 నాడు ప్రైమ్ వీడియోపై ప్రత్యేక ప్రీమియర్ గా ప్రసారం చేయుటకు అంత సిద్ధం అయ్యింది.
ఈ ట్రెయిలర్ 90’s యొక్క కథనము చుట్టూ సెట్ చేయబడిన ఉల్లాసభరితమైన మరియు ఆకట్టుకునే స్పై థ్రిల్లర్. ఇందులో అసాధారణమైన ప్రదర్శనలు మరియు భారీ విజువల్ స్కేల్ తో విధ్వంసకరమైన యాక్షన్, అత్యధిక శక్తివంతమైన స్టంట్స్ మరియు మిమ్మల్ని కట్టిపడేసే ఉత్కంఠతలు ఉన్నాయి. స్టంట్మాన్ బన్ని (వరుణ్ ధావన్) ఒక సైడ్ గిగ్ కొరకు పోరాడుతున్న నటి హనీ (సమంత) ని నియమిస్తాడు. వాళ్ళు యాక్షన్, గూఢచర్యం మరియు ద్రోహాల ప్రపంచములో ఇరుక్కుపోతారు. కొన్ని సంవత్సరాల తరువాత, వారి ప్రమాదకరమైన గతము ముందుకు వచ్చినప్పుడు, దూరమైన హనీ మరియు బన్ని కలిసి వారి కూతురు నదియాను రక్షించేందుకు పోరాడుతారు.
“టీజర్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో, ఈ షో కొరకు ఆసక్తి మరియు ఎదురుచూపులు ప్రతి రోజు పెరుగుతూ వచ్చాయి, వరుణ్, సమంత మరియు రాజ్ & డికే ఫ్యాన్స్ నవంబరు 7 కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారికి సిటాడెల్: హనీ బన్ని అద్భుత ప్రపంచాన్ని జయించిన ఈ షో యొక్క యాక్షన్-నిండిన ట్రెయిలర్ తో సీరీస్ గురించిన సమాచారాన్ని అందించుటకు ఇది సరైన సమయము అని మాకు అనిపించింది. ఈ అత్యధిక-శక్తివంతమైన స్పై థ్రిల్లర్ కు రాజ్ & డికే వారి చమత్కారాన్ని చేర్చారు. ఇది మా ప్రేక్షకులకు ఒక కొత్త థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తుంది,” అని నిఖిల్ మధోక్, హెడ్ ఆఫ్ ఒరిజినల్స్, ప్రైమ్ వీడియో అన్నారు.
“సిటాడెల్: హనీ బన్ని మాకు ఇదివరకు ఎన్నడు చేయని లేదా ప్రయత్నించని ఒక అపూర్వమైన గూఢచారులు మరియు గూఢచర్యం ప్రపంచములో ఒక భాగం అయ్యే అవకాశం ఇచ్చిన ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. ఇంతవరకు మేము మా ప్రాజెక్ట్స్ అన్నిటిని నిర్మించాము కాని సిటాడెల్: హనీ బన్ని మా మొట్టమొదటి కొలాబొరేషన్. రుస్సో బ్రదర్స్ వంటి సృజనాత్మక శక్తులు మరియు ప్రపంచములోని ప్రతిభగల చిత్రనిర్మాతలు మరియు సృష్టికర్తలు అందరు కలిసి దీనిని ఒక విలువైన సృజనాత్మక అనుభవముగా చేశాయి,” అని రాజ్ & డికే అన్నారు.
“బన్నీ పాత్ర నేను ఇదివరకు ఎప్పుడు నటించనిది. ఒక గూఢచారిగా, అతను ఒక ద్వంద్వ జీవితాన్ని గడపడమే కాకుండా అతని వ్యక్తిత్వములో రెండు భిన్నమైన మనస్తత్వాలు ఉన్నాయి. ఒక నటుడిగా ఇది నాకు చాలా ఆసక్తికరంగా ఉండింది. కథనములో జటిలంగా అల్లబడిన ఆ పాత్ర కొరకు నాకు మిశ్రమ అనుభవాలు మరియు పాత్రలు అవసరమైయ్యాయి, అలాగే మానసికంగా మరియు శారీరికంగా కఠినమైన విన్యాసాలు మరియు యాక్షన్ దృశ్యాల కొరకు సిద్ధం కావలసి వచ్చింది. దీనితో ఇది నాకు సవాలు విసిరిన ప్రదర్శనగా నిలిచింది. బన్నీ పాత్రలో అవకాశం ఇచ్చినందుకు ప్రైమ్ వీడియో, రాజ్ & డికే మరియు AGBO కు నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటాను” అని వరుణ్ ధావన్ అన్నారు.
సమంత ఇలా అన్నారు, “ఆకట్టుకునే కథనము, గొప్ప పాత్ర ఔచిత్యము మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడే తీవ్రమైన పోరాటాలు మరియు స్టంట్స్ ఉన్న యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టెయినర్ లో ఒక భాగం కావటానికి వచ్చిన అవకాశం, అలాగే కనెక్టెడ్ స్పై కథల సంకలనములో ఒక అంతర్గత పాత్రను పోషించుటకు నన్ను ఈ ప్రాజెక్ట్ వైపుకు ఆకర్షించింది. హెనీ పాత్రలో జీవించడానికి అవసరమైన సవాళ్ళు మరియు ప్రయత్నాలు నాపై ఎంతో ప్రభావాన్ని చూపాయి, వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా, మరియు ఇది నా కెరీర్ లోనే చాలా ముఖ్యమైన పాత్రగా నిలిచింది. ప్రైమ్ వీడియో పై ప్రసారం అయ్యే ఈ సీరీస్ ను ప్రేక్షకులు భారతదేశములోనే కాకుండా అనేక దేశాలు మరియు భూభాగాలలో ఈ సీరీస్ ను బాగా ఆనందిస్తారని నేను విశ్వసిస్తున్నాను.”
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…