ఈరోజు బింబిసార, విశ్వంభర చిత్ర దర్శకుడు వశిష్ట పుట్టినరోజు
చాలా తక్కువ మందికి మాత్రమే సినిమాలంటే పిచ్చి ఉంటుంది.. అలాంటి వారిలో దర్శకుడు వశిష్ట కూడా ఒకరు. నేడు దర్శకుడు వశిష్ట పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ స్టోరీ.
వశిష్ట అసలు పేరు మల్లిడి వేణు. బన్నీ, భగీరథ, ఢీ వంటి చిత్రాలు నిర్మించిన సత్యనారాయణ రెడ్డి కుమారుడైన వశిష్టకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే హీరోగా ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమా చేశారు. ఆ సినిమా ఆయనకు మంచి అనుభూతులు మిగిల్చింది. అయినా సరే నటుడిగా కొనసాగే ఉద్దేశం లేకపోవడంతో ఆయన తర్వాత దర్శకత్వం వైపు ఆసక్తి కనబరిచారు. నిజానికి మొదటి సినిమా చేసిన తర్వాత ఆయన స్క్రీన్ మీద కనిపించకపోవడంతో సినీ పరిశ్రమకు దూరం అయిపోయారేమో అనుకున్నారు అంతా. కానీ సినీ పరిశ్రమ మీద విపరీతమైన మక్కువ పెంచుకున్న వశిష్ట అందుకు భిన్నంగా దర్శకుడిగా కొంతకాలం రీసర్చ్ చేసి ‘బింబిసార’ అనే కథ సిద్ధం చేసుకున్నారు.
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కి ఆ కథ చెప్పి ఒప్పించడమే కాదు, తనదైన శైలిలో డైరెక్ట్ చేసి చాలాకాలం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. ఒక్కసారిగా ఆ సినిమాతో సినీ పరిశ్రమ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశారు. అయితే ఆ తర్వాత వశిష్ట ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఒక మెగా న్యూస్ చెప్పేశాడు. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోని అప్రోచ్ అవ్వడమే చాలా కష్టం. అలాంటిది ఏకంగా రెండో సినిమాని మెగాస్టార్ తో చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు వశిష్ట. మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ అనే సినిమా మొదలుపెట్టి ఒక సోషియో ఫాంటసీ థ్రిల్లర్గా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు సర్వం సిద్ధం చేశాడు. సంక్రాంతికి రావలసిన ఆ సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడింది. త్వరలోనే విశ్వంభర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వశిష్ట.
బింబిసార సినిమాతోనే టాలీవుడ్ లో తనదైన మార్క్ వేసుకున్న ఆయన రెండో సినిమాతో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం. ఇటీవలె తండ్రిగా ప్రమోషన్ పొందిన వశిష్ట విశ్వంభర తర్వాత మరో స్టార్ హీరోతో ప్రాజెక్టు పట్టాలెక్కించబోతున్నారు. హాపీ బర్త్డే అండ్ ఆల్ ది బెస్ట్ వశిష్ట.
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…