ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవవం. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేయనున్నారు. ఈ రోజు మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. గత వైభవం సినిమా గురించి ఆషికా చెబుతూనే ఉంది. తను ఈవెంట్ కి రావాలని అడగడం, నేను వచ్చేయడం వెంటనే జరిగిపోయాయి. నాకు గత జన్మల సినిమాలంటే చాలా ఇష్టం. నాన్నగారి సినిమా మూగమనసులతో నాకు బాగా పరిచయం. నేను అదే ఇష్టంతో జానకి రాముడు సినిమా చేశాను. రెండు సినిమాలు చాలా సూపర్ హిట్ అయ్యాయి.గత జన్మలు అనేది మన కల్చర్ లో ఉండిపోయిన ఒక కథ. మనం చిన్నప్పుడు నుంచి వింటుంటాం. గత వైభవం నాలుగు జనరేషన్ల కథ, ట్రైలర్ చూస్తుంటే ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. దుష్యంత్ స్క్రీన్ మీద ఫెంటాస్టిక్ గా కనిపిస్తున్నాడు. ఆషికా అద్భుతమైన నటి. ఈ సినిమా కోసం ఇద్దరు చాలా కష్టపడ్డారు. ఈ సినిమా బాగా ఆడాలి. హనుమాన్ లాంటి సినిమాను అందించిన చైతన్య గారు ఈ సినిమాని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను.
హీరో దుష్యంత్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. కొంతమందిని దూరం నుంచి చూసినప్పుడు అభిమానం కలుగుతుంది. పర్సనల్ గా మీట్ అయి వాళ్ల గురించి తెలుసుకున్నప్పుడు అభిమానం ఇంకా పెరుగుతుంది. నాగార్జున గారు అలాంటి స్టార్. నాగార్జున గారి ఐకానిక్ సినిమా శివ నవంబర్ 14న రి రిలీజ్ అవుతుంది. మా సినిమా కూడా వస్తుంది. ఈ సమయంలో కూడా ఆయన మా సినిమాకి ప్రమోట్ చేయడానికి రావడం అనేది ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆయన సపోర్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గత వైభవం నాలుగు జన్మలకు సంబంధించిన కథ. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. చాలా బిగ్ కాన్వాస్ సినిమా ఇది. మంచి సినిమాకి తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. మీ అందరి లవ్ అండ్ సపోర్టు మాకు కావాలి.
హీరోయిన్ ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ చాలా ప్రేమతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా ఈవెంట్ కి ఎవరిని పిలవాలి? మాకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఎవరు అందిస్తారు అనుకున్నప్పుడు మేమందరం నాగార్జున గారు వస్తే బాగుంటుందనుకున్నాము. నాగార్జున గారు ఎంతో మంచి మనసున్న మనిషి. ఆయన లాంటి స్టార్ మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడు కూడా కొత్త కాంటెంట్, కథలపై ఆసక్తి చూపిస్తుంటారు. ఆయనకి టీజర్ ట్రైలర్ చాలా నచ్చాయి. ఈవెంట్ కి వచ్చి మాకు సపోర్ట్ చేసిన నాగార్జున గారికి మరోసారి కృతజ్ఞతలు.
డైరెక్టర్ సింపుల్ సుని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం గత వైభవం. అంటే ఒక సామ్రాజ్యం గుర్తుకొస్తుంది. ఆ సామ్రాజ్యానికి రాజులా నాగార్జున గారు వచ్చారు. ఆయన ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. గత వైభవం డిఫరెంట్ జానెర్ సినిమా. అన్ని కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఎక్స్పరిమెంటల్ ఫిల్మ్. తప్పకుండా ఆడియన్స్ అందరూ సినిమా ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన దీపక్ కి థాంక్యూ. టీమ్ అందరికీ గుడ్ లక్. ఈ టీజర్ చూడగానే మన సినిమాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి వైబ్ వచ్చింది. ఈ మధ్యకాలంలో మన తెలుగులో ఇలాంటి ఫాంటసీ సినిమా రాలేదు. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాము.
నిర్మాత దీపక్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఇది మాకు చాలా స్పెషల్. నాగార్జున గారు అద్భుతమైన పెర్ఫార్మర్. ఆయన శివ సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. రు ఆయన మా వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతలు నిరంజన్ రెడ్డి చైతన్య గారికి థాంక్యూ. తెలుగు నార్త్ అమెరికాలో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. శివ సినిమా చూస్తున్నప్పుడు నాగార్జున గారిలో ఒక స్పార్క్ కనిపించింది. అదే స్పార్క్ నేను దుష్యంత్ లో చూశాను .తప్పకుండా గత వైభవం సినిమా మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ముందు శివ చూడండి. తర్వాత గత వైభవం చూడండి.
డిఓపి విలియం డేవిడ్ మాట్లాడుతూ.. టెక్నికల్ గా చాలా మంచి సినిమా. నా కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గా నిలుస్తుంది. నవంబర్ 14న అందరూ థియేటర్లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…