బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎన్ వీ వీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. మంగళవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ తో పాటు మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిథి మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ..
“ట్రైలర్ చూశాక చాలా కొత్తగా అనిపించింది. మూవీ టీమ్ కి నా అభినందనలు. ఫిబ్రవరి 6న నేను కచ్చితంగా టికెట్ కొనుక్కుని సినిమా చూస్తా. చిన్నారి తేజస్విని యాక్టింగ్ బాగుంది. చిన్న సినిమాలకు ప్రోత్సాహం లభించాలి. సీఎం రేవంత్ గారు అందుకు కృషి చేస్తున్నారు. చిన్న నిర్మాతలు ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ సినిమాలు తీస్తున్నారు. ఎర్ర చీర సినిమా విజయవంతంగా ఆడాలని కోరుకుంటున్నా.” అన్నారు.
నిర్మాతలలో ఒకరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. “మా సినిమాకు పని చేసిన నాటినటులందరికి కృతజ్ఞతలు. 300 థియేటరస్ లో మా సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఇందుకు సహకరించిన పెద్దలకు ధన్యవాదములు. నేను నిర్మాతగా నాలుగు సినిమాలు చేశా. ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతున్న” అన్నారు
జయలక్ష్మి ఫిలిమ్స్ వెంకట్రావ్ మాట్లాడుతూ.. “సుమన్ గారికి మంచి భవిష్యత్ ఉంది. సినిమా చూస్తున్నంత సేపు కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది. ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ఇదే పెద్ద సినిమా అవుతుంది. బి, సి సెంటర్స్ లో హిట్ అవుతుంది.” అన్నారు.
హీరోయిన్
కారుణ్య చౌదరి మాట్లాడుతూ..
“ట్రైలర్ చూశాక చాలా బాగా అనిపించింది. మూవీ మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది.” అన్నారు.
రైటర్ గోపి మాట్లాడుతూ “ఈ సినిమా తీయడానికి మేము పడిన కష్టాలు వర్ణనతీతం. సుమన్ బాబు గారు నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. మా సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది.” అన్నారు.
నటుడు, దర్శకుడు, నిర్మాత సుమన్ బాబు మాట్లాడుతూ.. “ఎర్ర చీర సినిమాను ఈ స్థాయికి తెచ్చింది మీడియానే. మధు యాష్కి అన్నకి థాంక్స్. సినిమా గురించి నేను అంతా ఇప్పటికే చెప్పేసాను. బుక్ మై షోలో సప్తగిరి థియేటర్లో మా సినిమా బుకింగ్ చూసి సంతోషపడ్డా. కారుణ్య ఈ మూవీకి వన్ మాన్ ఆర్మీ షో. చిన్నారి సాయి తేజస్విని యాక్టింగ్ సూపర్బ్. సినిమా ఎక్కడ బోర్ కొట్టినా టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తా. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. ఫిబ్రవరి 6 సినిమా గ్రాండ్ సక్సెస్ కానుంది. అందరూ సక్సెస్ మీట్ లో కలుద్దాం.” అన్నారు.
నిర్మాత, నటుడు, పీఆర్వో సురేష్ కొండేటి మాట్లాడుతూ.. “చిన్న సినిమాల డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా సినిమా కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అందుకే ఈ సినిమాకు అండగా నిలబడ్డాను. ఇందులో ఒక మంచి పాత్రలో నటించాను. సినిమా మొత్తం నేను చూశాను. నా ఎక్స్పీరియన్స్ తో చెబుతున్నా.. సుమన్ బాబు ఒక మంచి సినిమా తీశారు. ఫిబ్రవరి 6న సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అందరూ తప్పకుండా థియేటర్ లోనే సినిమా చూడండి.” అన్నారు.
నటీ నటులు – బేబీ సాయి తేజస్విని, సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు, జీవా, తదితరులు
టెక్నికల్ టీమ్:
ఆర్ట్ – నాని, సుభాష్
స్టంట్స్ – నందు,
డైలాగ్స్ – గోపి విమల పుత్ర,
సినిమాటోగ్రఫీ – చందు
ఎడిటర్ – వెంకట ప్రభు,
చీఫ్ కో డైరెక్టర్ – నవీన్ రామ నల్లం రెడ్డి,
రాజ మోహన్
బీజీఎం – ఎస్ చిన్న
మ్యూజిక్ – ప్రమోద్ పులిగార్ల
సౌండ్ ఎఫెక్ట్స్ – ప్రదీప్
పిఆర్ఓ – సురేష్ కొండేటి
సమర్పణ – బేబీ డమరి ప్రజెంట్స్
నిర్మాత – ఎన్. వి.వి. సుబ్బారెడ్డి, సీహెచ్. వెంకట సుమన్
కథ – స్క్రీన్ ప్లే- దర్శకత్వం – సుమన్ బాబు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…