ప్రతిభావంతులను ప్రోత్సహించి, వారి ప్రతిభను మా సంస్థ కోసం ఉపయోగించుకోవటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం

చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే యువ ప్రతిభావంతులను ప్రోత్సహించడమే తమ ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యమని అన్నారు ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ వివరాలను ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ వివరించారు. ఈ కార్యక్రమంలో పోటీకి ఎంపికైన షార్ట్ ఫిలింస్ మేకర్స్, ఆర్జీవీ డెన్ ప్రొడ్యూసర్ రవి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఈ కాంటెస్ట్ కు ఎంట్రీలు రావడం విశేషం. ఈ కార్యక్రమంలో

దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – మొదటి సినిమా శివ సమయంలో నా గురించి ఎవరికీ తెలియదు. శివ సినిమా ప్రేక్షకాదరణ పొందింది కాబట్టి రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరో అందరికీ తెలిసింది. కానీ ప్రతిభ ఉండి నాలా ఇంకా ప్రపంచానికి తెలియాల్సిన వారు ఎంతోమంది ఉన్నారు. మా నాన్న అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజినీర్ కాబట్టి నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు వీలు దొరికింది. వచ్చాక నేను ఏం చేశాను అనేది తర్వాత విషయం. ముందు మన కాన్సెప్ట్ చెప్పేందుకు ఎవరో ఒకరు అవకాశం ఇవ్వాలి కదా. వివిధ ప్రాంతాల్లో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తమలో ఎంతో ప్రతిభ ఉండి కూడా అవకాశాలు పొందలేకపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు.

అలాంటి వారికి ఇండస్ట్రీతో ఒక యాక్సెస్ ఇచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కాంటెస్ట్ ఆర్జీవీ యువర్ ఫిల్మ్. ఈ కాంటెస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత దాదాపు 400 ఎంట్రీలు వచ్చాయి. ఇవి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఉన్నాయి. వీటిలో 11 షార్ట్ ఫిలింస్ షార్ట్ లిస్ట్ చేసి ఎంపికచేశాం. నార్త్ ఇండియా నుంచి కూడా వచ్చాయి గానీ అవి షార్ట్ లిస్ట్ కాలేదు. షార్ట్ లిస్ట్ అయిన వాటిని సోషల్ మీడియాలో పోల్ కు పెట్టి ప్రేక్షకులు ఎక్కువమంది బెస్ట్ డైరెక్టర్ గా ఓటు వేసిన వారికి మా సంస్థలో అవకాశం ఇస్తాం. పేర్లు చెప్పను గానీ ఇప్పటికే వీరిలో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేశాను. వారికి సినిమా అవకాశం ఇవ్వబోతున్నాం. ఒక్క డైరెక్టర్స్ అనే కాదు. డీవోపీ, మ్యూజిక్ డైరెక్షన్ ఇలా..ప్రతి క్రాఫ్టులో టాలెంటెడ్ వారిని సెలెక్ట్ చేస్తున్నాం. ఈ పోల్ కు రెండు వారాల టైమ్ తీసుకుంటాం. ఈ షార్ట్ ఫిలింస్ చేసిన వారు నాకంటే బాగా డైరెక్ట్ చేశారు. ఈ షార్ట్ ఫిలింస్ లో మీరు ప్రొడక్షన్ వ్యాల్యూస్ చూడొద్దు. కాన్సెప్ట్ ను ఎంతబాగా కన్వే చేశారనేది మాత్రం చూడమని కోరుతున్నా. ఎందుకంటే మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాలు చూసిన మీకు వీరు అతి తక్కువ రిసోర్సెస్, బడ్జెట్ లో చేసిన మూవీస్ నచ్చకపోవచ్చు. కానీ వారి కాన్సెప్ట్ మేకింగ్ ఆకట్టుకుంటే చాలు.

ఈ కాంటెస్ట్ లో సెలెక్ట్ అయిన వారి ప్రతిభను ముందుగా మా సంస్థలో ఉపయోగించుకోవాలనేది నాది, ప్రొడ్యూసర్ రవి గారి స్వార్థం. అంతేగానీ వీళ్లందరికీ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలనేది ఒక్కటే ఆలోచన కాదు. ఆ తర్వాత వాళ్లు మమ్మల్ని వదిలేసి వెళ్తారనే విషయం కూడా తెలుసు. ఎవరికైనా మొదటి అవకాశం దొరకడం ముఖ్యం ఆ తర్వాత వాళ్లను వాళ్లు ప్రూవ్ చేసుకుని కెరీర్ లో ముందుకెళ్లాల్సిఉంటుంది. అన్నారు

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

5 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago