విజయ్ సేతుపతి హీరోగా మారిన పిజ్జా తెలుగులో రిలీజ్ అయి పన్నెండేళ్ళు పూర్తయింది. “ప్రేమిస్తే”,”షాపింగ్ మాల్” మరియు “జర్నీ” వంటి పలు చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సురేష్ కొండేటి పిజ్జా సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ చరిత చిత్ర బ్యానర్ మీద సమర్పిస్తూ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన “పిజ్జా” చిత్రం తమిళంలో భారీ విజయం సాధించింది. విజయ్ సేతుపతి, రమ్య నంబీసన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం కోసం అప్పట్లో దాదాపు 40 మంది నిర్మాతలు పోటీ పాడగా సురేష్ కొండేటి ఈ హక్కులను సొంతం చేసుకున్నారు.
ఈ చిత్రం తమిళంలో లానే అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ విజయం సాధించింది. సురేష్ కొండేటి నిర్మాతగా సమన్య రెడ్డి కో ప్రొడ్యూసర్ గా ఈ సినిమాను అందించారు. అక్టోబర్ 19న పన్నెండేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా చేసిన తరువాత విజయ్ సేతుపతి పిజ్జా తరువాత ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు నెగిటివ్ రోల్స్ లోనూ అదరగొడుతున్నాడు సేతుపతి. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు ఇప్పుడు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తున్నారు విజయ్ సేతుపతి. ఇక సేతుపతికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అప్పట్లో ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ సేతుపతి అందించిన సపోర్ట్ మర్చిపోలేనని, తన కారులోనే తిరుగుతూ ప్రమోషన్స్ చేశామని సురేష్ కొండేటి వెల్లడించారు. ఇక ఈ సినిమా డబ్బింగ్ కూడా సంతోషం స్టూడియోస్ లోనే జరిగిందని మెగా బ్రదర్ నాగబాబు, శివాజీ, ఉత్తేజ్ వంటివారు ఈ సినిమాకు తమ గాత్రదానం చేశారని ఆయన అన్నారు. ఇదంతా నిన్ననే జరిగినట్టు అనిపిస్తోందని, అప్పుడే పన్నెండేళ్ళు పూర్తయ్యాయి అంటే నమ్మలేకుండా ఉన్నానని అంటున్నారు. నేను నిర్మాతగా మారిన తొలి రోజుల్లో ఒక పెద్ద మనిషి చెప్పిన ఒక మాట – ‘నిర్మాత అంటే ఒక మంచి కథను ప్రేక్షకుడికి చెప్పడానికి మంచి కథతో కూడిన సినిమాని ప్రేక్షకులకు చూపించడం కోసం ఎప్పుడూ వెనకాడకూడదు’ అని.
అలా నేను నా మనసుకు నచ్చిన ఒక మంచి కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలని చేసిన సినిమా ‘పిజ్జా.’ తరవాత కాలంలో ‘పిజ్జా 2’, ‘పిజ్జా 3’ తెలుగు లోకి వచ్చేలా చేసిన సినిమా ‘పిజ్జా.’ సినిమా వచ్చి నేటికి 12 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా, నటించిన నటీనటులకు, ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకు, మరియు పని చేసిన సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరించిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి మరియు సహనిర్మాతగా వ్యవహరించిన సమన్య రెడ్డికి ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విజయ్ సేతుపతి ఒక మంచి నటుడిగా తనని తాను నిరూపించుకుని, ప్రస్తుతం తెలుగు లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. అలాగే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఎంత గొప్ప డైరెక్టర్ అయ్యారో మన అందరికీ తెలుసు. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…