వరల్డ్ వైడ్ గా సిల్వర్ స్క్రీన్ పై సెన్సెషనల్ క్రియేట్ చేసి, 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్’ (The Face of the Faceless) మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో ఈ మూవీ నవంబర్ 21న తెలుగు వెర్షన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలుగు ఫిలింఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా ఒకప్పటి హీరో రాజా మాట్లాడుతూ.. ఒకప్పుడు నటుడుగా ఈ ఫిలిమ్ ఛాంబర్ కు వచ్చాను. ఇప్పుడు ఒక పాస్టర్ గా వచ్చాను. క్షమాపణ అనేది అందరి వల్ల అయ్యేది కాదు. క్షమాపణ అనేది గొప్పది. రాణి మారియా త్యాగం గురించి సినిమా ఉంటుంది. ఈ సినిమా ను ప్రతీ ఒక్కరూ ప్రమోట్ చేయాలి. 123 అవార్డులు పొందిన సినిమా ఇది. ఆస్కార్ కు కూడా ఎంట్రీ వచ్చిన సినిమా. నవంబర్ 21న విడుదలయ్యే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు.
దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ సీఈఓ డాక్టర్ ఐ. లూర్దూ రాజ్ మాట్లాడుతూ.. “క్షమాపణ అనేది గొప్పది. ఒకరిని క్షమిస్తేనే శాంతి ఉంటుంది. చాగంటి ప్రొడక్షన్స్ సపోర్ట్ చేస్తుంది. ప్రపంచాన్ని కదిలించిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ..“గొంతుక లేని వారికి గొంతుక అందించే సినిమా ఇది. మన సమాజంలో ప్రేమ గురించి, శాంతి గురించి క్షమాపణ విలువను ఈ సినిమా తెలుపుతుంది. తెలుగు రాష్ట్రాలలో 50-60 థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సీమను ఆదరిద్దాం తెలుగులోను హిట్ చేద్దాం” అని అన్నారు.
CSI బిషప్ విల్సన్ మాట్లాడుతూ.. ”ప్రేమించడానికి ధైర్యం కావాలి. క్షమించడానికి ధైర్యం కావాలి. ఆస్కార్ కు నామినేట్ అయిన సినిమా ఇది. ప్రధాన పాత్ర అట్టడుగున ఉన్న వారికి సహాయపడే పాత్ర. హర్ట్ టచింగ్ స్టోరీ.” అని అన్నారు.
డైరెక్టర్ వంశీకృష్ణ మాట్లాడతూ.. “హరి హారన్, చిత్ర వంటి దిగ్గజలు ఈ సినిమాలో పాడారు. ఇలాంటి మానవత్వం కలిగిన ప్రపంచ స్థాయి సినిమాలను ప్రతీ ఒక్కరూ సపోర్ట్ చేద్దాం. ఇలాంటి సినిమాలు సమాజానికి ఎంతో అవసరం.” అని అన్నారు.
నటుడు జక్కుల కృష్ణ మోహన్ మాట్లాడుతూ… “ఈ సినిమాలో గుస్ బమ్స్ వచ్చే సీన్లు ఉన్నాయి. ప్రతీ ఒక్కరిని కదిలిస్తుంది. నవంబర్ 21న తెలుగు వెర్షన్ ను కూడా భారీ స్థాయిలో హిట్ చేద్దాం” అని అన్నారు.
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…
సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…
‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…