వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్ తన 36 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెర్సటైల్ డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. పవన్ కుమార్ సమర్పణలో సక్సెస్ఫుల్ బ్యానర్ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రథ సప్తమి సందర్భంగా సైఫై ఎంటర్టైనర్ను మేకర్స్ అనౌన్స్ చేశారు .
విభిన్నమైన కథలు, కథనాలతో సినిమాలను రూపొందించే దర్శకుడు వి.ఐ.ఆనంద్ మరోసారి ఈ భారీ ప్రాజెక్ట్తో క్రియేటివ్ బౌండరీస్ రేంజ్ను మరింత పెంచటానికి సిద్ధమయ్యారు. సినీ ప్రేక్షకులకు ఇప్పటి వరకు చూడని సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను ఇచ్చేలా ఈ క్రేజీ సినిమా రూపొందనుంది. ఊరు పేరు భైరవకోన చిత్రం తర్వాత ఈ విజనరీ డైరెక్టర్ హై కాన్సెప్ట్ సైఫై ఎంటర్టైనర్తో ప్రేక్షకులను మెప్పించనున్నారు.
టాలెంటెడ్ యాక్టర్ నితిన్ హీరోగా నటిస్తుండటంతో ఈ మూవీపై ఎగ్జయిట్మెంట్ మరింతగా పెరిగింది. వెర్సటైల్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకునే నితిన్ వంటి కథానాయకుడితో..క్వాలిటీ సినిమాలను గ్రాండ్ స్కేల్లో సినిమాను రూపొందించే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ చేతులు కలపటం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ ప్రెస్టీజియస్ కాంబోను చూస్తుంటే సినిమాపై నిర్మాత శ్రీనివాస చిట్టూరికి ఉన్న ప్యాషన్ కనిపిస్తోంది. ఆదివారం (జనవరి 25) రథ సప్తమి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. టాలెంటెడ్ హీరో, వైవిధ్యంగా సినిమాను తెరకెక్కించే దర్శకుడు, గ్రాండ్గా సినిమాను నిర్మించే సంస్థ కలయికలో రూపొందబోయే ఈ సైఫై ఎంటర్టైనర్ నితిన్ కెరీర్లో అత్యంత ఆసక్తికరమై ప్రాజెక్ట్స్లో ఒకటిగా మారనుంది.
నితిన్ 36వ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.
నటీనటులు:
నితిన్
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: వి.ఐ.ఆనంద్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సమర్పణ: పవన్ కుమార్
పి.ఆర్.ఒ: వంశీ కాకా
మార్కెటింగ్: విష్ణు తేజ్ పుట్ట
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…