టెంపుల్ మీడియా పతాకం పై దర్శకులు సి .జగన్మోహన్ (మనకు సుపరిచితమైన మాయాబజార్ జగన్మోహన్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘S99.’ యాక్షన్ అండ్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యతీష్ అండ్ నందిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ టైటిల్ ను రమేశ్ ప్రసాద్ గారు ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం రమేష్ ప్రసాద్ గారు మాట్లాడుతూ… మా నాన్నగారు సినిమాని చాలా ఇష్టపడేవారు, సినిమాల కోసం మా నాన్నగారు చాలా కష్టపడ్డారు, అదే నన్ను ఉత్సాహపరిచింది. సినిమా కోసం పని చేయాలి అనుకున్న. అందుకోసమే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా, ప్రపంచవ్యాప్తంగా ప్రసాద్ ల్యాబ్స్ ను నిర్మించాను. సినిమా అంటే ఒక అద్భుతం కానీ ఇప్పుడు సినిమాలు థియేటర్లో సరిగ్గా ఆడటం లేదు.. కానీ సినిమాల కోసం చాలామంది కష్టపడి పని చేస్తున్నారు. S99 టైటిల్ చాలా కొత్తగా అనిపిస్తుంది. అలాగే S99 సినిమాని నిర్మించిన జగన్ గారికి ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అన్నారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు టైటిల్ పోస్టర్ విడుదల చేసిన రమేశ్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ S99 సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా మీ ముందుకు రాబోతుందని మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అంటూ దర్శకుడు జగన్మోహన్ గారు తెలిపారు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని ప్రకటించారు. ఇలాంటి మరిన్ని చిత్రాలని తీయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మాత యతీష్ అన్నారు.
హీరో: జగన్మోహన్
హీరోయిన్: శ్వేతా వర్మ
కెమెరా: వీ. శ్రీనివాస్
ఎడిటర్: సనాల్ అనిరుధన్
డైరెక్టర్: జగన్మోహన్
ప్రొడ్యూసర్స్ : యతీష్ అండ్ నందిని
పి ఆర్ ఓ : బి. వీరబాబు
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…