ఈ పాశ్చాత్య పోకడలో తెలుగుదనం వున్న సినిమాలు, తెలుగు వారి సంప్రదాయాలు చూపించే సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. సహజత్వంతో కూడిన ఈ అంశాలను హైలైట్ చేస్తూ చూపించే సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. తాజాగా యేవమ్ చిత్రంలో తెలంగాణ ఒగ్గు కథ కల్చర్ని హైలైట్ చేస్తూ, తెలంగాణ సంస్కృతిలోని ముఖ్యమైన అంశమైన ఒగ్గుకథను ఈ చిత్రంలో చూపించారు యేవమ్ చిత్ర దర్శకుడు ప్రకాష్ దంతులూరి. ఈచిత్రంలో ఓ కీలకమైన సన్నివేశం వచ్చేటప్పుడు ఆ సన్నివేశంలోని గాఢతను తెలంగాణ ఒగ్గుకథతో చెబుతున్నారు. ఈ కథలో హిందూ సంప్రదాయంలోని గ్రామ దైవాల గొప్పదనాన్ని ఒగ్గుకథలో కూడా ఈ చిత్రంలో చూపించారు. ఒగ్గుకథను సినిమాలో
ముఖ్య అంశంగా చేర్చిన కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. ఈ ఒగ్గుకథను కూడా రియల్గా ఒగ్గుకథలను పాడే ఒగ్గుకథ కళాకారుల చేతనే చెప్పించడం విశేషం.
దర్శకుడు మాట్లాడుతూ ఈ ఒగ్గుకథతో కథలోని గాఢతను, సన్నివేశంలోని సారాంశంను చెప్పించడంతో ప్రేక్షకులు కథలో ఇన్వాల్వ్ అవ్వడమే కాకుండా వారికి కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్కు మంచి స్పందన వస్తుంది. ఈ నెల 14న విడుదల కాబోతున్న ఈ చిత్రం అందని అలరిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.
ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి
దిని చైదరి, వశిష్ట సింహా, భరత్రాజ్,ఆషు రెడ్డి ముఖ్యతారలు. ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. గోపరాజు రమణ, దేవిప్రసాద్, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ ఎస్వీ విశ్వేశ్వర్, సంగీతం కీర్తన శేషు, నీలేష్ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…