తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ జరిగి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 8వ తేదీన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించాలని ఛాంబర్ సభ్యులు నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఛాంబట్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఫిలింఛాంబర్ స్థాపించి 14 సంవత్సరాలు అయ్యింది. ఎలక్షన్స్ కోసం అడ్వైజర్లుగా సుదర్శన్ థియేటర్ అధినేత భాస్కరరావు, నిర్మాత గురురాజ్, జె వి ఆర్ గార్లు వ్యవరిస్తున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ గా అడ్వకేట్ కె వి ఎల్ నరసింహారావు గారు వ్యవహరిస్తారు. సెప్టెంబర్ 1వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమౌతుంది. 8వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. ఛాంబర్ లో 1000 మంది ప్రొడ్యూసర్స్, 16000 మంది 24 క్రాఫ్ట్స్ మెంబెర్స్ వున్నారు. సభ్యులకు ఇన్సూరెన్స్, సభ్యుల పిల్లలకు స్కాలర్షిప్ అందిస్తున్నాము. సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా ఛాంబర్ పనిచేస్తుంది. సభ్యులందరు తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ నిర్వహిస్తోంది. అవార్డ్ కమిటీని ఎఫ్ డి సి వారు ప్రకటించారు. తెలంగాణకు సంబంధం లేనివ్యక్తులు ఎఫ్ డి సి లో పనిచేస్తున్నారు. మా ఛాంబరుకు ప్రాధాన్యం లేకుండా చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. కమిటీని రివైజ్ చెయ్యాలని కోరుతున్నాను అన్నారు.
తెలంగాణ ఫిలింఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ గురురాజ్ మాట్లాడుతూ.. ఛాంబర్ ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ 1వ తేదీ ఉంటుంది. 2వ తేదీ నామినేషన్స్ పరిశీలించి కంఫర్మ్ చేస్తారు. 8వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. మా ఛాంబర్ నుండి ఇప్పటి వరకు 250కి పైగా సినిమాలు సెన్సార్ జరుపుకున్నాయి. చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలకు చేయూత నిచ్చేందుకే మా ఛాంబర్ పనిచేస్తుంది అన్నారు.
నిర్మాత జె వి ఆర్ మాట్లాడుతూ..50 సంవత్సరాలుగా తెలంగాణా వివక్షకు గురౌతోంది. సినిమా పరిశ్రమలో కూడా తెలంగాణా నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణుల పట్ల వివక్ష చూపిస్తున్నారు. గద్దర్ అవార్డ్స్ కమిటీలో కూడా తెలంగాణ ఛాంబరుకు ప్రాతినిధ్యం లేకుండా చేశారు. ఈ కమిటిని రివైజ్
చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. సెప్టెంబర్ 8న జరిగే ఎన్నికల్లో సభ్యులందరు పాల్గొనాలని కోరుతున్నాను అన్నారు.
సుదర్శన్ థియేటర్ అధినేత భాస్కర్ రావు మాట్లాడుతూ తెలుగు సినీపరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది. తెలంగాణా ప్రభుత్వం దీనిపై దృష్టి చారించి సహాయ సహకారాలు అందించాలన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…