ప్రతిభ గల యువ నటీనటులకు శిక్షణ ఇచ్చి అవకాశాలు అందించే ఉద్దేశంతో ఫేమస్ కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో “ఈగిల్ ఐ సినీ స్టూడియో” హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు తేజ ఈగిల్ ఐ సినీ స్టూడియోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢీ విన్నర్ అక్సాఖాన్, యువ నటి గాయత్రి రమణ, ఈగిల్ ఐ సినీ స్టూడియో ఓనర్, కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
దర్శకుడు తేజ మాట్లాడుతూ – ప్రసాద్ గారు నాకు చాలాకాలంగా తెలుసు. మా సినిమాలకు కావాల్సిన అన్ని ఏజ్ గ్రూప్స్ నటీనటులను ఇచ్చేవారు. ఆయన మంచి శిక్షణ ఇచ్చి ప్రతిభావంతులను తయారుచేస్తాడు. సినీ పరిశ్రమలో నటీనటులుగా స్థిరపడాలనుకునే వారికి సరైన శిక్షణ అవసరం. ఈగిల్ ఐ సినీ స్టూడియోలో మీకు అవసరమైన అలాంటి శిక్షణ ఇచ్చి అవకాశాలు కూడా చూపిస్తారు. ఈ సంస్థ నుంచి ఎంతోమంది ప్రతిభావంతులైన యువ నటీనటులు ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
ఈగిల్ ఐ సినీ స్టూడియో ఓనర్, కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ – ఈ రోజు మా ఈగిల్ ఐ సినీ స్టూడియో ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చి మాకు తన విశెస్ అందించిన డైరెక్టర్ తేజ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన మా వెల్ విషర్. తేజ గారి బెస్ట్ విశెస్ తో ఈగిల్ ఐ సినీ స్టూడియోను మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థగా తీర్చిదిద్దుతాం. అన్నారు.
హీరోయిన్ అక్సాఖాన్ మాట్లాడుతూ – దర్శకుడు తేజ గారంటే మాకు ఎంతో ఇష్టం. ఆయన ఎంతోమందిని ఇన్స్ పైర్ చేశారు. ఎన్నో మంచి మూవీస్ చేసి, చాలా మంది కొత్త నటీనటులకు అవకాశాలు ఇచ్చారు. తేజ గారు ఈరోజు ఈగిల్ ఐ సినీ స్టూడియో ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉంది. ఆయన సినిమాలో నటించే అవకాశం నాకు రావాలని వెయిట్ చేస్తున్నా. అన్నారు.
యువ నటి గాయత్రి రమణ మాట్లాడుతూ – నేను కూచిపూడి డ్యాన్సర్ ను, నటిగా ఇండస్ట్రీలో స్థిరపడాలని కోరుకుంటున్నా. ప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఈగిల్ ఐ సినీ స్టూడియో అందరికీ రీచ్ కావాలి. మా లాంటి ఎంతోమంది కొత్త నటీనటులకు శిక్షణ, అవకాశాలు ఇప్పించాలని కోరుకుంటున్నా. అలాగే ఈ రోజు ఈగిల్ ఐ సినీ స్టూడియో ప్రారంభోత్సవానికి వచ్చిన డైరెక్టర్ తేజ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. నేను ఓ ప్రముఖ టెలివిజన్ నిర్వహించిన డుం డుం డిగా డిగా డ్యాన్స్ షోలో విన్నర్ ను. అప్పుడు తేజ గారే నాకు బహుమతి ఇచ్చారు. అన్నారు.
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…
సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక…
అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల…
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…