తమన్నా భాటియా మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ ఒదెల-2 కోసం మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్తో కలిసి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా వున్నారు. 2021 బ్లాక్బస్టర్ హిట్ ఒదెల రైల్వే స్టేషన్ సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీని విజనరీ అశోక్ అశోక్ తేజ డైరెక్టర్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, షెడ్యూల్డ్ వర్కింగ్ వీడియోకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది, సీక్వెల్పై ఎక్సయిట్మెంట్ ని పెంచింది.
ప్రస్తుతం, ఈ హైబడ్జెట్ మల్టీ లింగ్వల్ మూవీ హైదరాబాద్లోని ఆర్ఎఫ్సిలోని ఓదెల మల్లన్న టెంపుల్ లో ఇంటెన్స్ క్లైమాక్స్ షూటింగ్తో జరుగుతోంది. అత్యంత కీలకమైన మ్యాసీవ్ టెంపుల్ సెట్ ని హై బడ్జెట్తో నిర్మించారు. తమన్నా, ఇతర నటీనటులతో పాటు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా షూటింగ్లో పాల్గొంటున్నారు.
హైదరాబాద్ బోనాలు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. చీర కట్టుకుని, తమన్నా భాటియా తలపై బోనం మోస్తూ అద్భుతంగా కనిపించింది. కోఇన్సీడెంట్ గా, బోనాల సంబరాలు జరుగుతున్నప్పుడు బోనాల ఎపిసోడ్ను షూట్ చేస్తున్నారు.
తమన్నా భాటియా అద్భుతమైన పెర్ఫార్మెన్ అందించడానికి ఇంటెన్స్ ట్రైనింగ్, రిహార్సల్స్ తీసుకున్నారు. యాక్షన్ సన్నివేశాలను పర్ఫెక్ట్ గా చేయడంలో ఆమె డెడికెషన్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తాయి.
ఆకట్టుకునే కథాంశంతో ఇంటెన్స్ యాక్షన్ని బ్లెండ్ చేయడంలో పేరున్న దర్శకుడు సంపత్ నంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని సూపర్ విజన్ చేస్తున్నారు. అతని గైడెన్స్ లో, ‘ఓదెల 2’ ఎమోషన్స్, థ్రిల్స్, అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ సన్నివేశాల రోలర్-కోస్టర్ రైడ్ను అందించడానికి రెడీ అవుతోంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్రాజన్ డీవోపీ కాగా రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: డి మధు
క్రియేటెడ్ బై: సంపత్ నంది
బ్యానర్లు: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్
దర్శకత్వం: అశోక్ తేజ
డీవోపీ: సౌందర్ రాజన్. ఎస్
సంగీతం: అజనీష్ లోక్నాథ్
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…
సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…
‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…