సర్వైవల్ కామెడీ జానర్లో పూర్తి వినోదాత్మక చిత్రంగా ‘నమో’ అనే సినిమా రాబోతోంది. విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలు విస్మయ హీరోయిన్గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ ప్రశాంత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ జూన్ 7న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
విశ్వంత్, అనురూప్ కాంబోలో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీ నుంచి వదిలిన పోస్టర్, టీజర్ అన్నీ కూడా ఆడియెన్స్ను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించారు. జూన్ 7న సినిమాను విడుదల చేయబోతోన్నట్టుగా రిలీజ్ చేసిన పోస్టర్లో హీరోలిద్దరూ వింత ఎక్స్ప్రెషన్స్ పెట్టి కనిపిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమెరామెన్గా రాహుల్ శ్రీవాత్సవ్ మ్యూజిక్ డైరెక్టర్గా క్రాంతి ఆచార్య వడ్లూరి ఎడిటర్గా సనల్ అనిరుధన్ పని చేశారు.
తారాగణం : విశ్వంత్ దుద్ధుంపూడి, అనురూప్ కటారి, విస్మయ తదితరలు
సాంకేతిక బృందం
బ్యానర్ : శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నిర్మాత : ఏ. ప్రశాంత్
దర్శకులు : ఆదిత్య రెడ్డి కుందూరు
కెమెరామెన్ : రాహుల్ శ్రీవాత్సవ్
సంగీతం : క్రాంతి ఆచార్య వడ్లూరి
ఎడిటర్ : సనల్ అనిరుధన్
పీఆర్వో : ఎస్ ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…