సూపర్ గుడ్ ఫిల్మ్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’ ట్రైలర్ కు అనూహ్య స్పందన

హీరోలను స్టార్ హీరోలుగా చేసిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే ‘భవనమ్’ ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేయగా అనూహ్య స్పందన లభించింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను, జానపద పాటయైన యాదమ్మ.. సాంగ్ ను మంగళవారంనాడు ప్రసాద్ ల్యాబ్ లో విడుదలచేసి విలేకరులకు ప్రదర్శించారు. ఈ సాంగ్ జానపద బాణీలతో వుంటూ అలరించింది. ట్రైలర్  మరింత ఆకట్టుకుంది.

అనంతరం ఆర్.బి. చౌదరి మాట్లాడుతూ,మా బేనర్ లో ఇది 95 వ సినిమా. మలయాళంలో 96 వ సినిమా చేస్తున్నాం. అలాగే 97, 98 సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి. త్వరలో  100 సినిమాలకు చేరుకోబోతున్నాం. దర్శకుడు బాలాచారి భవనమ్ సినిమాను చక్కగా తీశాడు. ఆల్ రెడీ సాంగ్స్ వెరీ గుడ్. సంగీత దర్శకుడు చరణ్  గొప్ప టాలెంట్ పర్సన్. ఇందులో పనిచేసిన అందరికీ మంచి విజయం రావాలని కోరుకుంటున్నానని అన్నారు.

సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ, రామ్ చరణ్ రచ్చలో ..మిల్క్ మిల్క్ చిలక.. పాట చేశాను. అదే నన్ను బతికిస్తుంది. అదే సూపర్ గుడ్ బేనర్ లో మరో అవకాశం దక్కేలా చేసింది. నల్గొండ గద్దర్ నర్సన్న.. రేవంత రెడ్డి గారికి ఎలక్షన్ సమయంలో పాట పాడారు. ఆ పాట విన్న దర్శకుడు బాలాచారిగారు యాదమ్మ.. పాటను నర్సన్న తో పాడించారు. తనకు ఈ సినిమా నుంచి మంచి విజయాలు దక్కాలి.ఈ పాటటకు మంగ్లీ వాయిస్ చాలా ప్లస్ అయింది. ఇలా అందరి కాంబినేష న్ లో పనిచేయడం నాకూ చాలా ఆనందంగా వుంది. నిర్మాత అంజన్ కుమార్ సపోర్ట్ మర్చిపోలేను. నాకు గతంలో లారెన్స్ నన్ను ప్రోత్సహించారు. అందరికీ ఈ సినిమా మంచి గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.

ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన విఎస్.ఆర్. మాట్లాడుతూ, సూపర్ గుడ్ అంటే గౌరవం. అదే సంస్థలో పనిచేయడం ఆనందంగా వుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవకాశం ఇచ్చిన చౌదరిగారికి ఈ సినిమా పెద్ద హిట్ అయి, చరణ్ కు బ్రేక్ రావాలని కోరుకుంటున్నా అన్నారు.

నల్గొండ గద్దర్ నర్సన్న మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాజకీయ నేపథ్య పాటలు పాడినా త్రుప్తి లేదు. కానీ ఒక్క సినిమా చేయాలనే కోరిక ఇరవై ఏళ్ళుగా వుంది. స్నేహితుడు చరణ్ అర్జున్ ఏదోరోజు నీకూ వస్తుంది అని ప్రోత్సహించారు. భవనం లో   నా పాటకు డాన్స్ లు వేయడం మర్చిపోలేని అనుభూతి కలిగించింది. యాదమ్మ పాటలో జానపదబాణీలకు చరణ్ చక్కటి బాణీలు సమకూర్చారు. రచయితలు చక్కగా ప్రాసలతో రాశారు అన్నారు.

నటి స్నిగ్థ మాట్లాడుతూ, ఆర్.బి. చౌదరి గారి నిర్మాణ సంస్థలో చేయడం గొప్ప వరం.. ఈ మూవీ చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ రోప్ కట్టి నాతో కఠినమైన ఫైట్లు కూడా చేయించారు. అవి తెరపై బాగుంటాయి. పాటలు చాలా బాగున్నాయని అని అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ ఆంథోని మాట్లాడుతూ, ప్రేమలు సినిమా చేశాను హిట్ అయింది. ఇది కూడా కావాలని కోరుకుంటున్నానన్నారు.

కొరియో గ్రాఫర్ శ్యామ్ తెలుపుతూ, ఆర్.బి. చౌదరి బేనర్ లో చేయడం అద్రుష్టం. అదే సక్సెస్ అనుకుంటున్నాను. దర్శకుడు నమ్మి అవకాశం ఇచ్చారు. యాదమ్మ సాంగ్ లో షలకలశంకర్, సప్తగిరి. బిత్తిరి సత్తి.. స్నేహా ఉల్లాల్ బాగా నటించారు. సాంగ్ హిట్ కావాలి. ఈ సాంగ్ ను అందించిన నల్గొండ గద్దర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.

బిత్తిరి సత్తి మాట్లాడుతూ, సూపర్ గుడ్ లోగో అనేది పెద్ద బ్రాండ్. గతంలోనే సినిమా చేయాలనుకున్న నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. దర్శకుడు నా పాత్రను సరికొత్తగా క్రియేట్ చేశారు. ఇదంతా టీమ్ వర్క్. పాటల్లో సోల్ వుంది అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.

చిత్ర దర్శకుడు బాలాచారి మాట్లాడుతూ, సూపర్ గుడ్ బేనర్ లో ఇరవై ఏల్ళ నాడు విద్యార్థి చేశాను. మరోసారి చౌదరి గారు అవకాశం ఇచ్చారు. చరణ్ అర్జున్ సంగీతం ఈ సినిమా చాలా ప్లస్ అవుతుంది. విఎస్ ఆర్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా పనితనంతో మరింత బాగా భవనమ్ సినిమా వచ్చింది అన్నారు.

షకలకల శంకర్ మాట్లాడుతూ, తనదైన శైలిలో మాట్లాడుతూ, దర్శకులు ఓ భవనాన్ని కట్టి మా చేత కూలీలుగా చేయించారు. గ్రుహ ప్రవేశం కోసం మేం వెయిట్ చేస్తున్నాం. నాకు సూపర్ గుడ్ అనే పేరు ఎంతో ఇష్టం. చిన్నతనంలో చదువుకన్నా థియేటర్లలో ఎక్కువగా వుండేవాడిని సూపర్ గుడ్ లోగో చూసి బొమ్మలు వేసేవాడిని. అలా అగ్రహీరోల బొమ్మలు కూడా వేశాను. ఇప్పుడు అటువంటి గొప్ప సంస్థలో నటించడం చాలా ఆనందంగా వుంది. హార్రర్ సినిమాలు తీసే వారు ఆశ్చర్యపరిచేలా మా దర్శకుడు సినిమాను తీశారు. ప్రేక్షకులకు గగుర్పాటును కలిగించడంతోపాటు కడుపుప్ప నవ్విస్తుంది అన్నారు.

అతిథి దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ, సూపర్ గుడ్ బేనర్ లో 95 వ సినిమాగా భవనమ్ రావడం ఆనందంగావుంది.  ఎవిఎం. సురేష్ సంస్థలా త్వరలో  100 సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. ఈ బేనర్ లో వచ్చే సినిమాలలో ఆడియో చాలా బాగుంటుంది. అలా ఇందులో పాటలు చాలా బాగున్నాయి అని చెప్పారు.

TFJA

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

15 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago