రెబల్ స్టార్ కృష్ణంరాజు బంధువు యంగ్ హీరో విరాట్ రాజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిలింస్ బ్యానర్పై ఎస్ఆర్ కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈరోజు పూజా ముహూర్తంతో సినిమా గ్రాండ్గా లాంచ్ అయింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ టైటిల్ను లాంచ్ చేశారు. ఈ చిత్రానికి ‘గౌడ్ సాబ్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.
పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైయింది. డైరెక్టర్ సుకుమార్ మేకర్స్ కు స్క్రిప్ట్ అందించగా, రాహుల్ షిప్లిగంజ్ క్లాప్ కొట్టారు. జోనీ మాస్టర్, భాను మాస్టర్, అన్నీ మాస్టర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా గణేష్ మాస్టర్ ముహూర్తం సన్నివేశానికి దర్శకత్వం వహించారు.
మూవీ లాంచింగ్ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. గణేష్ చాలా ప్రతిభావంతుడు. ‘జగడం’ సినిమాలో కొరియోగ్రఫర్ గా పరిచయం చేశాను. తన పరిచయమే ఒక సునామీలా వుంది. ప్రతి మూమెంట్ ని చాలా కొత్త చేశాడు. తనకి పరిశ్రమ చాలా మంచి భవిష్యత్ వుంటుందని అప్పుడే చెప్పాను. తను చాలా క్రియేట్ గా వుంటాడు. తన చేసిన ప్రతి పాటలో కథ వుంటుంది. పాట ద్వారా కథ చెప్పే నేర్పు తనకి వుంది. ఇప్పుడు గౌడ్ సాబ్ తో తను దర్శకుడిగా మారడం ఆనందంగా వుంది. తను ఈ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. కథ చాలా చాలా బావుంది. టైటిల్ లో కూడా ట్విస్ట్ వుంది. ఇంత మంచి కథతో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా అద్భుతం అవుతుంది. తను చెప్పిన పాయింట్ చాలా గొప్పగా వుంది. హీరో, నిర్మాతలు, టీం అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు.
శ్యామల దేవి మాట్లాడుతూ.. మా విరాట్ మూవీ గణేష్ మాస్టర్ గారి దర్శకత్వంలో లాంచ్ కావడం చాలా ఆనందంగా వుంది. గణేష్ మాస్టర్ చాలా ప్రతిభావంతులు. విరాట్ అంటే కృష్ణం రాజుగారికి చాలా ఇష్టం. తను హీరో అవుతాడని దీవించారు. గౌడ్ సాబ్ టైటిల్ లోనే మాస్ కనిపిస్తుంది. మంచి టీంతో ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.
హీరో విరాట్ రాజ్ మాట్లాడుతూ.. సుకుమార్ గారి ధన్యవాదాలు. ఆయన మా సినిమా పోస్టర్ లాంచ్ చేయడం మెమరబుల్ మూమెంట్. ఈ సినిమా మా కెరీర్ లో ఒక ఉత్తమ సినిమాగా నిలిచిపోతుంది. కథ, కథనం అద్భుతంగా కుదిరాయి. నిర్మతలు ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ఆర్ కళ్యాణమండపంలానే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. వారితో మళ్ళీమళ్ళీ పని చేయాలి. తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావాలి’ అన్నారు.
డైరెక్టర్ గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. డ్యాన్స్ మాస్టర్ గా నన్ను ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు మరో అడుగు వేశాను. దీనికి కూడా మీ అందరి సపోర్ట్ కావాలి. ఇప్పటివరకూ నేను చేసిన పాటలు చూశారు. ఇప్పుడు సినిమా చూడబోతున్నారు. గౌడ్ సాబ్.. ట్రూ లవ్ స్టొరీ. తప్పకుండా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. మీ అందరి ప్రోత్సాహం కావాలి. సుకుమార్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు’ తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. సుకుమార్ గారికి ధన్యవాదాలు. గౌడ్ సాబ్.. ట్రూ లవ్ స్టొరీ. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఎంతలా అలరించిందో గౌడ్ సాబ్ కూడా అదే విధంగా ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్మెంట్ పంచుతుంది. మీ అందరి ఆదరణ కావాలి’ అన్నారు.
గౌడ్ సాబ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. సినిమాలో మంత్రముగ్ధులను చేసే ప్రేమకథ ఉంటుందని సూచిస్తూ, టైటిల్ పోస్టర్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ హ్యాండిల్ కి అమ్మాయి వోని చుట్టుకొని వుండటం చాలా ఆసక్తికరంగా వుంది.
ఈ చిత్రానికి ఆర్ఎం స్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లిరిక్ రైటర్ వెంగీ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ‘బేబీ’ ఫేం సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్. భాను మాస్టర్ క్రియేటివ్ హెడ్ కాగా, మహాదేవ స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ కొంతమంది దివ్యాంగులకు ఆర్థిక సాయం అందించింది.
తారాగణం: విరాట్ రాజ్
సాంకేతిక విభాగం:
రచన & దర్శకత్వం: గణేష్ మాస్టర్
నిర్మాతలు: SR కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయి కృష్ణ కార్తీక్
బ్యానర్: శ్రీపాద ఫిలింస్
సమర్పణ: మల్లీశ్వరి
సంగీతం: వెంగి
డీవోపీ: RM స్వామి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
క్రియేటివ్ హెడ్: భాను మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్: బేబీ సురేష్ భీమగాని
కొరియోగ్రఫీ: పృధ్వీ రాజ్
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: ఎ మహదేవ
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
కాస్ట్యూమ్స్: రోహిణి దుబ్కుల
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…