పాన్ ఇండియా ఫిల్మ్ ‘సుబ్రహ్మణ్య’- బియాండ్ ఇమాజినేషన్ గ్లింప్స్ రిలీజ్

పాపులర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన దర్శకత్వంలో “సుబ్రహ్మణ్య”సినిమాతో తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఎస్‌జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల, శ్రీమతి రామలక్ష్మి సమర్పిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్‌, ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అన్నీ వైపుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

దుబాయ్‌లో జరిగిన ప్రముఖ అవార్డు ఫంక్షన్‌లో భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొత్తన్ని ఆకట్టుకునే మూవీ గ్లింప్స్ ని లాంచ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ కు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి యునానిమస్ గా అద్భుతమైన స్పందన అందుకుంది.

విషపూరిత పాములతో నిండిన బావిలోకి అద్వాయ్ జంప్ చేయడంతో టీజర్ ఓపెన్ అవుతోంది. అతను దొంగచాటుగా లోపలికి ప్రవేశించి, ఒక పురాతన పుస్తకాన్ని తీసుకొని, అన్ని పాములు తనను వెంబడించడంతో పరుగెత్తడం ప్రారంభిస్తాడు. VFX , యానిమేషన్ అత్యుత్తమంగా ఉన్నాయి,  ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించాయి. టీజర్ లో కనిపించిన భారీ వానరాలు ఆసక్తిని మరింతగా పెంచాచాయి.  దర్శకుడు పి రవిశంకర్ గ్లింప్స్ తో మెస్మరైజ్ చేశారు. టీజర్ చివరి షాట్ మహాఅద్భుతంగా వుంది. ఈ విజువల్ వండర్ గ్లింప్స్ తో సుబ్రహ్మణ్య ఈ ఇయర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటిగా మారింది.

విదేశాల్లో శిక్షణ తీసుకున్న అద్వాయ్ తెరపై అద్భుతంగా కనిపిస్తున్నాడు. అతని ప్రజెన్స్, ఎక్స్ ప్రెషన్స్, ఆటిట్యూడ్ చార్మ్ అండ్ ఎనర్జిటిక్ గా వున్నాయి.  

పి రవిశంకర్ గొప్ప అనుభూతిని అందించే అద్భుతమైన ఫాంటసీ ప్రపంచాన్ని రూపొందించారు. భగవాన్ శ్రీ రాముడు కనిపించిన చివరి సీక్వెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది, గూస్‌బంప్‌లను తెస్తుంది.

విఘ్నేష్ రాజ్ కెమెరా పనితనం అద్భుతంగా వుంది. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. సప్త సాగరదాచే,  చార్లీ 777 చిత్రాలతో ఆకట్టుకున్న ఉల్లాస్ హైదూర్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్,  విజయ్ ఎం. కుమార్ ఎడిటర్.  

ఈ అద్భుతమైన ఫైనల్అవుట్‌పుట్‌ను సాధించడానికి అరవై మందికి పైగా VFX ఆర్టిస్ట్  ఈ టీజర్‌పై నాలుగు నెలలకు పైగా పనిచేశారు. ‘సుబ్రహ్మణ్య’  క్రియేటివ్ ప్రొడ్యూసర్ & VFX సూపర్‌వైజర్ నిఖిల్ కోడూరు నేతృత్వంలో, విజువల్స్ ముంబై, హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నైలోని ప్రసిద్ధ స్టూడియోలలో రూపొందించబడ్డాయి. భారతదేశపు ప్రీమియర్ కలర్ గ్రేడింగ్ స్టూడియోలలో ఒకటైన ‘Red Chillies.color’ ఈ చిత్రానికి కలర్ గ్రేడింగ్ పార్టనర్‌గా ఉంది, సీనియర్ కలరిస్ట్ కెన్ మెట్జ్‌కర్, కలరిస్ట్ దేవాన్షి దేశాయ్‌ గ్రేట్ వర్క్ అందించారు.

ప్రీమియం లార్జ్ ఫార్మాట్, IMAX థియేటర్లలో విజువల్ వండర్, అడ్వంచర్  థ్రిల్లర్‌ను అందించడానికి ఈ చిత్రాన్ని లార్జ్ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు. లాంగ్వేజ్ బారియర్ అధిగమించే కథతో ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ విజువల్, ఎమోషనల్ ట్రీట్‌గా తీర్చిదిద్దుతున్నారు.

పాన్ ఇండియా మూవీ సుబ్రహ్మణ్య తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

తారాగణం: అద్వయ్

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: SG మూవీ క్రియేషన్స్
సమర్పణ: శ్రీమతి ప్రవీణ కడియాల & శ్రీమతి రామలక్ష్మి
నిర్మాతలు: తిరుమల్ రెడ్డి & అనిల్ కడియాల
దర్శకత్వం: పి.రవిశంకర్
సంగీతం: రవి బస్రూర్
డిఓపి: విఘ్నేష్ రాజ్
ఎడిటర్: విజయ్ ఎం కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: ఉల్లాస్ హైదూర్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

8 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago