కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన ‘అనగనగా ఒక రాజు’
నవీన్ పొలిశెట్టి కెరీర్లోనే అతిపెద్ద విజయం
యూఎస్లో హ్యాట్రిక్ $1 మిలియన్.. $2 మిలియన్ దిశగా పరుగులు
మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి, తాజా సంచలన విజయం ‘అనగనగా ఒక రాజు’తో మరో స్థాయికి చేరుకున్నారు. ఈ చిత్రం నవీన్ పొలిశెట్టి కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100.2 కోట్ల గ్రాస్ను సాధించి, బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. థియేటర్లలో ప్రేక్షకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, ఈ సంక్రాంతి పండుగను మరింత వైభవంగా మార్చింది.
సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లలో అడుగుపెట్టిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం, మొదటి షో నుంచే విశేష స్పందనను సొంతం చేసుకుంది. హౌస్ఫుల్ ప్రదర్శనలు, మళ్లీ మళ్లీ కుటుంబ ప్రేక్షకుల రాకతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఫలితంగా ఇది చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. సంక్రాంతికి తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, కేవలం నాలుగు రోజుల్లోనే అన్ని ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్ చేరుకోవడం అనేది అరుదైన ఘనతగా మారింది. అన్ని ప్రాంతాల్లోనూ సంచలన వసూళ్లతో భారీ విజయాన్ని సాధించింది.
ఈ సంచలనాత్మక ప్రదర్శనతో, నవీన్ పొలిశెట్టి తన నాలుగో వరుస బ్లాక్బస్టర్ను సాధించి, తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విశ్వసనీయ తారలలో ఒకరిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ప్రతి సినిమాతో తన మార్కెట్ ని పెంచుకుంటూ వచ్చి, ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో తన సినీ ప్రయాణంలోనే అతిపెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.
ఓవర్సీస్లో కూడా ఈ సినిమా మరో మైలురాయిని నమోదు చేసింది. యూఎస్లో నవీన్ పొలిశెట్టి వరుసగా మూడు సినిమాలతో $1 మిలియన్కు పైగా వసూళ్లను సాధించిన ఘనతను అందుకున్నారు. ఇది కొద్దిమందికే దక్కిన అరుదైన విజయంగా నిలిచింది. అంతేకాదు, రోజువారీ కలెక్షన్లు బలంగా కొనసాగుతుండటంతో ‘అనగనగా ఒక రాజు’ ఇప్పుడు ప్రతిష్టాత్మక $2 మిలియన్ మార్క్ వైపు వేగంగా దూసుకెళ్తోంది. పండుగ సమయంలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ.. అద్భుతమైన స్క్రీన్ హోల్డింగ్, వ్యూహాత్మక ప్లేస్మెంట్తో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ మోక్ష మూవీస్ ఈ చిత్ర భారీ విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ అసాధారణమైన బలం చూపిస్తూ సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది ‘అనగనగా ఒక రాజు’. భారీ సంక్రాంతి పోటీ ఉన్నా, సితార ఎంటర్టైన్మెంట్స్ కి చెందిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా సినిమాకు అండగా నిలిచి, ఉత్తమ విడుదల అందించారు. కీలక ప్రాంతాల్లో తగినన్ని థియేటర్లను కేటాయించారు. సినిమాపై నమ్మకంతో ఈ స్థాయి విడుదల చేశారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ ప్రేక్షకుల పెద్దఎత్తున థియేటర్లకు కదిలిరావడంతో, రికార్డు స్థాయి వసూళ్లు వస్తున్నాయి.
కడుపుబ్బా నవ్వించే హాస్యం, కంటతడి పెట్టించే భావోద్వేగాలతో రూపొందిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం అన్ని వయసుల మరియు అన్ని ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అసలు సిసలైన సంక్రాంతి ఎంటర్టైనర్గా నిలిచింది. బలమైన రచనతో ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూసేలా అద్భుతంగా మలిచిన ఈ చిత్రానికి, దీర్ఘకాలం పాటు థియేటర్లలో ప్రదర్శితమయ్యే సత్తా ఉందని ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
ఐదు రోజుల్లో రూ.100.2 కోట్లు, నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్, యూఎస్లో హ్యాట్రిక్ మిలియన్ డాలర్, నాలుగు వరుస బ్లాక్బస్టర్లు.. ఇలా ‘అనగనగా ఒక రాజు’తో ఎన్నో ఘనతలు సాధించిన నవీన్ పొలిశెట్టి ప్రేక్షకుల హృదయాలలో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. ‘అనగనగా ఒక రాజు’ జోరు ఇప్పట్లో ఆగే సూచనలు లేవు. ఈ చిత్రం మరిన్ని మైలురాళ్లను చేరుకునే దిశగా పరుగులు పెడుతోంది.
చిత్రం: అనగనగా ఒక రాజు
తారాగణం: నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి
సంగీతం: మిక్కీ జే మేయర్
దర్శకత్వం: మారి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణు గోపాల్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…