ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో బిగ్బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటిస్తూ జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సోలో బాయ్. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, భద్రం, షఫీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. త్రిలోక్ సుద్దు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా చేయగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. అయితే ఎంతో ప్రేక్షక ఆదరణతో ముందుకు వెళుతున్న సందర్భంగా ఈ చిత్ర బృందం సోలో బాయ్ చిత్రాన్ని ఆదర్శించినందుకుగాను ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థాంక్యూ మీట్ పెట్టడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రముఖ లిరిసిస్ట్ పూర్ణాచారి మాట్లాడుతూ… “నాకు ఈ సినిమాలోని పాటను రచించే అవకాశం ఇచ్చినందుకుగాను ముందుగా చిత్ర బృందానికి చాలా థాంక్స్. అలాగే మా చిత్రాన్ని థియేటర్లలో ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నాను” అన్నారు.

నటి అనిత చౌదరి మాట్లాడుతూ… “ముందుగా మా సినిమాకు సపోర్ట్ చేసినందుకు మీడియా వారికి థాంక్స్. నాకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా థ్యాంక్స్. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సోలో బాయ్ సినిమా చూసిన వారంతా ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి నాతో వ్యక్తిగతంగా షేర్ చేసుకున్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నందుకుగాను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

నటి శ్వేత అవస్తి మాట్లాడుతూ… “మీడియా వారికి థాంక్స్. మీడియా తరఫునుండి వచ్చిన ప్రశంసలకు మేము ఎంతో ఆనందిస్తున్నాము. మమ్మల్ని, మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా థ్యాంక్స్” అన్నారు.

దర్శకుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ… “మా సోలో బాయ్ చిత్రాన్ని సోల్ ఫుల్ గా హిట్ చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. మంచి కంటెంట్ ఉన్న సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తే ఎంతగా ఆదరిస్తారో మరోసారి నిరూపించారు. సినిమాలో గౌతమ్ కృష్ణ ఎంతో బాగా నటించారు. నటన మాత్రమే కాకుండా డాన్స్ ఇంకా ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుని తనదైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనిత చౌదరి గారు, పోసాని కృష్ణ మురళి గారు అద్భుతంగా నటించారు. హీహీరోయిన్ శ్వేత అవస్తి ఎన్నో వేరియేషన్స్ తో ఉన్న తన క్యారెక్టర్ తో చక్కగా నటించారు. ఆమె భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్తారు. ఈ సినిమాలో ఉన్న ఐదు పాటలు ఐదు ఆణిముత్యాలు లాంటివి. సంగీత దర్శకుడు జూడ సాండీ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. యాక్షన్ సీన్స్ కూడా బాగా వచ్చాయి. ఈ సినిమాకు నిర్మాతగా ముందుకు వచ్చిన సతీష్ గారికి ముందు ముందు మరింత లాభాలు వచ్చి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సోలో బాయ్ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమాను అందరూ థియేటర్లో చూసి మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర డైరెక్షన్ టీం మాట్లాడుతూ… “మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులు అందరికీ మా కృతజ్ఞతలు. ఈ సినిమాను థియేటర్లలో చూసి మరింత ఆదరిస్తారని కోరుకుంటున్నాము” అన్నారు.

నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ… “సోలో బాయ్ సినిమా చూసి మీడియా వారి దగ్గర నుండి ప్రతి ఒక్కరూ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మౌత్ టాక్ ద్వారా సినిమాను ముందుకు తీసుకువెళ్తున్నారు. దానికిగాను అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా మొదలైన రెండు సంవత్సరాల తర్వాత అదే తేదీన థాంక్యూ మీట్ జరగడం అనేది యాదృచ్ఛికమని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేశాము. ఎన్ని అవదుడుకులు వచ్చినా కూడా తట్టుకుని నిలబడి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాము. దానికి సహాయపడుతూ నాతో తోడుగా నిలబడిన అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా మాకు ఎన్నో విషయాలు నేర్పించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాతో ఉన్నాయని నమ్ముతున్నాను. మా బ్యానర్ గౌరవం తగ్గే సినిమా నేను చేయను. భవిష్యత్తులో కూడా మంచి సినిమాలు మాత్రమే చేస్తాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. చిత్ర బంధం అంతా ఈ సినిమాకు ఎంతో సహకారాన్ని అందించారు. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చినందుకు సంతోషంగా ఉంది” అన్నారు.

నటుడు గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ… “నిన్న సినిమా చూసిన ఒక పెద్దావిడ ఒక మంచి సినిమా చూసా అని చెప్పిన వీడియో చూసాక నేను చాలా సంతోషించాను. ఒక మంచి సినిమా చూశాను అనే ఫీల్ తో ప్రేక్షకులు బయటకు వస్తుంటే అది తెలిసి నాకు ఎంతో ఎమోషనల్ గా అనిపించింది. అందరం కలిసికట్టుగా పనిచేసి మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాము. చాలా చిన్నగా చేద్దాం అనుకున్న సినిమా కానీ మంచి కంటెంట్ ఉండటంతో పెరుగుతూనే వెళ్ళింది. మీడియా వారు, ప్రేక్షకులు సోలో బాయ్ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు సినిమాను ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్లడం అనేది సంతోషకరంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో కంటెంట్ హీరో. మరొకసారి మా సినిమాను ఆదరించిన అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అంటూ ముగించారు.

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

3 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

4 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago