లాభాల్లోకి సిల్లీ మాంక్స్ – ఉద్యోగులకు ఈ సాప్స్​ ఇస్తున్నట్టు ప్రకటన

లాభాల్లోకి సిల్లీ మాంక్స్ – ఉద్యోగులకు ఈ సాప్స్​ ఇస్తున్నట్టు ప్రకటన

స్మాల్ క్యాప్ పబ్లిక్‌ లిస్టెడ్ (ఎన్​ఎస్​ఈ) కంపెనీ, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్‌లో అగ్రగామి సిల్లీ మాంక్స్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, నాలుగేళ్ల తరువాత లాభాల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సిల్లీ మాంక్స్ కీలక నిర్ణయాలను ప్రకటించింది. కంపెనీ తన ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ఈసాప్​) ప్లాన్ వివరాలను కూడా వెల్లడించింది. కంటెంట్ పబ్లిషింగ్, డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ కంపెనీ అయిన సిల్లీ మాంక్స్ ఆర్థిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి 26.83 లక్షల లాభం (పన్నుకు ముందు) సాధించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.46 లక్షల లాభం (పన్నుకు ముందు) సాధించి పెట్టుబడిదారులను ఉత్సాహపరిచింది. 2022–23 ఆర్థిక సంవత్సరం లో సంస్థకు రూ. 552.15 లక్షల నష్టం వచ్చింది. వ్యూహాత్మక పునర్నిర్మాణం, వనరుల సమర్థ వినియోగం ద్వారా సిల్లీమాంక్స్​ ఈ విజయాన్ని సాధించింది. ఈ మైలురాయి కంపెనీకి వృద్ధి స్థిరత్వాన్ని, కొత్త మార్గాన్ని సూచిస్తుంది. భారతీయ వినోద పరిశ్రమలో కీలక సంస్థగా దాని స్థానాన్ని బలపరుచుకుంది. సోమవారం జరిగిన వారి బోర్డు సమావేశంలో ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా

సిల్లీ మాంక్స్‌ సహ వ్యవస్థాపకుడు, ఎండీ సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ – “నాలుగు సంవత్సరాల తర్వాత లాభదాయకంగా మారడం సిల్లీ మాంక్స్​కు గొప్ప విజయం. మా అంకితభావంతో కూడిన బృందం, వ్యూహాత్మక కార్యక్రమాల వల్లే ఈ ఘనత సాధ్యపడింది. మేం మా కార్యకలాపాలను క్రమబద్ధీకరించాం. స్థిరమైన వృద్ధికి అవసరమైన విభాగాలపై దృష్టి సారించాం. నిలకడతో కూడిన వృద్ధికి, విజయానికి బాటలు వేశాం. మా ఆర్థికస్థితిని మెరుగ్గా మార్చడంలో క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానం, వ్యూహాత్మక దృష్టి చాలా కీలకం. బలమైన ప్రణాళికలు ప్రతిభావంతులైన బృందంతో బలమైన ఆర్థిక పనితీరును కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం” అన్నారు.

కేజీఎఫ్​, కేజీఎఫ్​2, కాంతార, సలార్ వంటి బ్లాక్​బ్లస్టర్​ సినిమాల విజయంలో డిజిటల్​ మార్కెటింగ్ పార్ట్​నర్​గా సిల్లీ మాంక్స్​ కీలకంగా నిలిచింది. ఈ ఏడాది 27 జూన్​లో విడుదల కానున్న కల్కి 2898 – ఏడీకి కూడా డిజిటల్ మార్కెటింగ్ పార్ట్​నర్​. ఈ అసోసియేషన్స్ వినోద పరిశ్రమలో ప్రీమియర్ కంటెంట్ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటర్‌గా సిల్లీ మాంక్స్ కు మరింత పేరు తీసుకొచ్చాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో సిల్లీ మాంక్స్ తన తన ఉద్యోగులను మరింత శక్తివంతం చేయడానికి, కస్టమర్ కేంద్రీకృత సంస్కృతిని పెంపొందించడానికి ఈసాప్​ పథకాన్ని కూడా ప్రారంభించింది. ఈసాప్​ విలువ మొత్తం షేర్ క్యాపిటల్‌లో ఐదుశాతం ఉంటుంది. దీని నుంచి కంపెనీ ప్రస్తుత ఉద్యోగుల కోసం 70 శాతాన్ని కేటాయించింది. జూన్ 2024 నుంచి రాబోయే 5 సంవత్సరాలలో సమానంగా జారీ చేస్తుంది. ఈ నిర్ణయం వల్ల సిల్లీ మాంక్స్ బృంద సభ్యులు భవిష్యత్తులో కంపెనీ విజయంలో సమగ్ర వాటాదారులు అవుతారు. ఈ నిర్ణయం వారిని ప్రేరేపిస్తుంది. సిల్లీ మాంక్స్ ఎదుగుదల, ఆవిష్కరణలను కొనసాగిస్తున్నందున, కంపెనీ తన వాటాదారులకు అద్భుత విలువను అందించడానికి ఎల్లలు లేని డిజిటల్ వినోదం అందించాలనే సంకల్పంతో ఉంది.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

11 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago