బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’ ట్రైలర్ సిద్ధం.. ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రాకింగ్’ థియేటర్స్లో ప్రేక్షకులకు అమేజింగ్ ఎక్స్పీరియెన్స్ పక్కా
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్.. ఏడాది ‘పఠాన్’ చిత్రంతో వరల్డ్ వైడ్గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి సిల్వర్ స్క్రీన్పై ‘జవాన్’ చిత్రంతో దండయాత్ర చేసి బాక్సాఫీస్ను కొల్లగొట్టడానికి రెడీ అయ్యారు. దీని కోసం ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఎగ్జయిట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ‘జవాన్’ ట్రైలర్ను ఆడియెన్స్ ముందుకు తీసుకురావటానికి మేకర్స్ భారీ సన్నాహాలు చేస్తున్నారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా థియేటర్స్లో జవాన్ ట్రైలర్ను ప్రదర్శించబోతున్నారు.
ఎమోషనల్ రోలర్ కోస్టర్గా అబ్బుర పరిచే యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులకు వారి సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. అసలు ఈ సినిమా కోసం షారూక్ ఖాన్ ఎవరూ ఊహించని సరికొత్త లుక్లోకి మారారు. ఆ లుక్ను చూసి ఆయన అభిమానులు ఆశ్చర్యపోయారు. దీంతో షారూక్ ఖాన్ పాత్ర ఎలా ఉండబోతుందోనని అందరిలో ఉత్కంఠత నెలకొంది. దీంతో జవాన్ మూవీ ట్రైలర్ను చూడాలని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో అభిమానులను మెప్పించిన ఈ స్టార్ హీరో ఇప్పుడు జవాన్ చిత్రంలో ఎలా ఆకట్టుకోబోతున్నాడనేది అందరిలోనూ క్యూరియాసిటీని కలిగిస్తోంది.
షారూక్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…