స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న వరుస అవకాశాలతో పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది. పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా రశ్మిక గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు తెలుగుతో పాటు హిందీలో భారీ ఆఫర్స్ దక్కుతున్నాయి. యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది రశ్మిక మందన్న. ఆమె తాజాగా మరో బిగ్గెస్ట్ మూవీ దక్కించుకుంది. సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందిస్తున్న సికిందర్ సినిమాలో రశ్మిక హీరోయిన్ గా ఎంపికైంది. మేకర్స్ ఈ విషయాన్ని ఈ రోజు అనౌన్స్ చేశారు.
సికిందర్ సినిమాలో సల్మాన్ ఖాన్ జోడిగా నటించేందుకు రశ్మిక మందన్నకు అహ్వానం పలుకుతున్నాం. ఈ జంట ఆన్ స్క్రీన్ మ్యాజిక్ త్వరగా చూడాలని కోరుకుంటున్నాం. వచ్చే ఈద్ పండక్కి తెరపై సల్మాన్, రశ్మిక జంట తెరపైకి వస్తారు. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా దక్కడంపై రశ్మిక మంందన్న ఇన్ స్టాగ్రామ్ లో స్పందించింది. నా నెక్ట్ మూవీ అప్డేట్ చెప్పమని ఫ్యాన్స్ తరుచూ అడుగుతుంటారు. సల్మాన్ సరసన సికిందర్ మూవీలో నటించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా, గర్వంగా భావిస్తున్నా. అని పోస్ట్ చేసింది.
ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో ఉన్న రశ్మిక ఈ ఆగస్టు 15న శ్రీవల్లిగా మరోసారి స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతోంది. ఆమె గర్ల్ ఫ్రెండ్ అనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది. రశ్మిక అందుకుంటున్న అవకాశాలు చూస్తుంటే ప్రస్తుతం ఆమె బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరోయిన్ అనుకోవచ్చు.
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…