సే ఫ్యాక్ట్ క్రియేషన్స్ పతాకంపై భాను చందర్, కిరణ్, చందన సిరి కృష్ణన్, చమ్మక్ చంద్ర, రేఖ నటీ నటులుగా వెంకట్ రామళ్ల దర్శకత్వంలో సాయి సిద్దార్థ రామళ్ల నిర్మించిన చిత్రం “రైఫిల్ “.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా ముందుగా మీడియా మిత్రులకు ప్రీమియర్ షో వేయడం జరిగింది. షో అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
చిత్ర దర్శకుడు వెంకట్ రామళ్ల మాట్లాడుతూ..ఇది ఒక డి. గ్లాసిఫైడ్ ట్రూ స్టోరీ..20 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతంలోని ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో జరిగిన ఇన్సిడెంట్ ను స్టోరీని తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది .ఈ సినిమాకు లొకేషన్స్ మొదలుకొని ప్రొడక్షన్స్ డిజైన్స్ అన్నీ మా అమ్మాయి సిందూజ చూసుకుంది.యంగ్ యానర్జటిక్ స్టార్ మా అబ్బాయి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.. కో ప్రొడ్యూసర్ గా మా వైఫ్ చేసింది.. నేను మంచి టీం ను సెలెక్ట్ చేసుకొని డైరెక్షన్ చేశాను.. నటీ, నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా రైఫిల్ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర నిర్మాత సాయి సిద్దార్థ రామళ్ళ మాట్లాడుతూ.. ఈ రోజు మీడియాకు వేసిన ప్రీమియర్ షో లో చూసిన వారందరూ సినిమా బాగుందని చెప్పడంతో చాలా సంతోషం వేసింది.మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా రైఫిల్ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు
గెస్ట్ గా వచ్చిన నటుడు కార్తికేయ మాట్లాడుతూ..సినిమా చాలా బాగుంది.ప్రస్తుత సమాజంలో మార్పు రావాలనే ఉద్దేశ్యం తో వెంకట్ గారు తన కుటుంబంలోని వారందరినీ ఇన్వాల్వ్ చేస్తూ చక్కటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీశారు.. ఈ సినిమా వారందరికీ బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.
ఆర్టిస్ట్ డా!మారుతి మాట్లాడుతూ..ఇది ఒక చక్కటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా .. ఎవరి చేతుల్లో రైఫిల్ ఉంటే బాగుంటుంది అనేది సినిమాలో చాలా చక్కగా చెప్పారు..అలాగే ఫారెస్ట్ లో సినిమా తీయడం చాలా కష్టం అలాంటింది ఫారెస్ట్ లో తీసిన సీన్స్ బాగా వచ్చాయి.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
ఆర్టిస్ట్ ధనరాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తరువాత ఇందులో నేను చెయ్యనందుకు చాలా బాధ పడుతున్నాను. సమాజానికి ఎలా మంచి చెయ్యచ్చో ఈ సినిమా లో చాలా చక్కగా చూయించారని అన్నారు.
ఆర్టిస్ట్ దాసన్న మాట్లాడుతూ.. వెంకట్ నా ప్రియ మిత్రుడు.. కలలే నా కుటుంబం అనే రీతిలో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి తను డైరెక్షన్ చేస్తూ తన కొడుకును నిర్మాతగా, ప్రొడక్షన్ డిజైనర్ గా కూతురును, కో ప్రొడ్యూసర్ గా భార్యను ఇండస్ట్రీ కి పరిచయం చేయడం చాలా హ్యాపీ గా ఉంది..ఎంతో కష్టపడి చేసిన ఈ రైఫిల్ సినిమాను ప్రేక్షకులను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
ఆర్టిస్ట్ వర్షిత మాట్లాడుతూ.. రామ్ గారి ఫ్యామిలీ అందరూ కష్టపడి చేసిన ఈ సినిమాను ప్రేక్షకులందరూ బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
తారాగణం.
భాను చందర్, కిరణ్, చందన సిరి కృష్ణన్, చమ్మక్ చంద్ర, రేఖ, జయ నాయుడు, జగదీశ్వరి, మారుతీ సాకారం, వీరభద్రం, యుగంధర్, పట్టాభి గుప్తా, శ్రీ కుమారి, తడివేలు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : సే ఫ్యాక్ట్ క్రియేషన్స్
కెమెరా: సుధాకర్ నాయుడు
ఎడిటింగ్: స్వామి చిత్రాల
Vfx / Di : ప్రభు (RGB స్టూడియోస్)
బ్యాక్గ్రౌండ్ స్కోర్: వినోద్ కుమార్ (విన్ను)
సంగీతం: విజయ్ సలవాడి
సాహిత్యం: సంస్కృతి శ్రీకాంత్
సహ దర్శకుడు: నారాయణ సంతోష్
మేకప్: రాజా రమేష్
సహాయ దర్శకుడు: నగేష్ శ్రీనివాస్
నిర్మాత : సాయి సిద్దార్థ రామళ్ల
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: వెంకట్ రామళ్ల
పి.ఆర్. ఓ : లక్ష్మీ నివాస్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…