“రామ్ నగర్ బన్నీ” సినిమా యునానమస్ సూపర్ హిట్ టాక్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటించిన సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా కనిపించారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహించారు. నిన్న(శుక్రవారం) థియేటర్స్ లోకి వచ్చిన “రామ్ నగర్ బన్నీ” సినిమా యునానమస్ గా ప్రేక్షకుల దగ్గర నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత ప్రభాకర్ మాట్లాడుతూ – మా “రామ్ నగర్ బన్నీ” సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది. ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని చెబుతున్నారు. చంద్రహాస్ బాగా నటించాడని, డ్యాన్స్ లు , ఫైట్స్ బాగా చేశాడని చెబుతున్నారు. 100 పర్సెంట్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మీడియా నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. అందుకు మీడియా వారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఇంత మంచి టాక్ వస్తున్నప్పుడు మూవీకి మరిన్ని థియేటర్స్ పెంచుకోవడం అవసరం. ఆ ప్రయత్నం చేస్తున్నాం. మరిన్ని థియేటర్స్ లో “రామ్ నగర్ బన్నీ” సినిమా అందుబాటులోకి వస్తుంది. ఇంతమంచి సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. శని, ఆదివారాలు మరింత మంది మా “రామ్ నగర్ బన్నీ” సినిమాను చూస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ రిచా జోషి మాట్లాడుతూ- “రామ్ నగర్ బన్నీ” సినిమాకు అన్ని చోట్ల నుంచీ మంచి టాక్ వస్తోంది. రివ్యూస్ చాలా బాగున్నాయి. మా మూవీ రిలీజ్ ముందు ప్రతి కంటెంట్ కు పాజిటివ్ రెస్పాన్స్ ఎలా వచ్చిందో..ఇప్పుడు థియేటర్స్ లోనూ అలాంటి రెస్పాన్స్ వస్తోంది. సెలబ్రిటీ షో కు వచ్చిన వారంతా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఈ వీకెండ్ లో ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి చూడండి. అన్నారు.

హీరోయిన్ రీతు మంత్ర మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నేను మలయాళంలో మూవీస్ చేస్తున్నాను. తెలుగులో నా ఫస్ట్ మూవీకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మా చంద్రహాస్ బాగా నటించకుంటే మేము కూడా అంత బాగా పర్ ఫార్మ్ చేసి ఉండేవారం కాదు. డ్యాన్స్, ఫైట్స్, లవ్, ఎంటర్ టైన్ మెంట్..ఇలా మీరు కోరుకునే ప్రతి అంశం ఈ మూవీలో ఉంది. చూడని వారు వెంటనే థియేటర్స్ కు వెళ్లి చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ అంబికా వాణి మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమాకు వస్తున్న టాక్ తో మా టీమ్ అంతా హ్యాపీగా ఉన్నాం. మంచి రివ్యూస్ వస్తున్నాయి. థియేటర్స్ లో సినిమా చూస్తున్న వారంతా తమకు మూవీ బాగా నచ్చిందని అంటున్నారు. ఈ సినిమా కోసం మళయజ గారు, ప్రభాకర్ గారు ఎంతో కష్టపడ్డారు. రామ్ నగర్ బన్నీ సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) మాట్లాడుతూ – మా “రామ్ నగర్ బన్నీ” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన సినిమాలే సక్సెస్ కోసం ఎంతో శ్రమిస్తున్నాయి. అలాంటిది కొత్త హీరో, కొత్త నిర్మాత, చిన్న బడ్జెట్ లో రామ్ నగర్ బన్నీ మూవీని రూపొందించి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం సాధారణ విషయం కాదు. ఈ సక్సెస్ ను మాకు అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.

నిర్మాత మళయజ ప్రభాకర్ మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమా సక్సెస్ మీట్ కు వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. మా మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. సాధారణంగా సినిమాలకు కలెక్షన్స్ బాగున్నాయి అంటారు కానీ మా సినిమాకు యునానమస్ గా మంచి సినిమా చేశారనే టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఫస్ట్ సినిమాతో మా అబ్బాయి చంద్రహాస్ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందటం సంతోషంగా ఉంది. అన్నారు.

హీరో చంద్రహాస్ మాట్లాడుతూ – మా “రామ్ నగర్ బన్నీ” సినిమాకు మంచి రివ్యూస్ ఇస్తున్న మీడియా మిత్రులకు థ్యాంక్స్. ఎక్కడో ఒకరు తప్ప మిగతా వారంతా మూవీ చాలా బాగుందనే రాశారు. నేను మా సినిమా నచ్చకుంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తా అని ప్రామిస్ చేశా. 95 పర్సెంట్ ప్రేక్షకులకు మూవీ నచ్చింది. ఈ సినిమా నా డెబ్యూ మూవీ కాబట్టి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుని చేశాను. నెక్ట్ మూవీ సందీప్ రెడ్డి వంగా, రాజమౌళి గారు నాకు అవకాశాలు ఇచ్చేలా పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలనుకుంటున్నాను. ఇకపై రామ్ నగర్ బన్నీ లాంటి కమర్షియల్ మూవీస్ చేయను. మా సినిమాకు అన్ని థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. నేను అన్ని ఎమోషన్స్ చేయగలను అనే షో రీల్ లా సినిమా ఉందని అంటున్నారు. నేను నటుడిగా ప్రూవ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. తప్పకుండా థియేటర్స్ కు వెళ్లండి రామ్ నగర్ బన్నీతో మీరంతా ఎంటర్ టైన్ అవుతారని ప్రామిస్ చేస్తున్నా. అన్నారు.

నటీనటులు – చంద్రహాస్, విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర, మురళీధర్, సలీమ్ ఫేకు, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని, తదితరులు

టెక్నికల్ టీమ్

పబ్లిసిటీ డిజైన్ – మ్యానీ
ఆర్ట్ డైరెక్టర్ – రాజశేఖర్
ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ- అష్కర్ అలీ
మ్యూజిక్ డైరెక్టర్ – అశ్విన్ హేమంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విజయ్
పీఆర్ఓ – సురేష్ కొండేటి
సమర్పణ – దివిజ ప్రభాకర్
నిర్మాతలు – మళయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ
రచన, దర్శకత్వం – శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్)

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

15 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago