తొలి సారిగా ‘యానిమల్ ఆరాధ్య’ ఫోటో సిరీస్ ను ఆవిష్కరించిన రాంగోపాల్ వర్మ

నా చిత్రాలలో హీరోయిన్స్ గా నటించిన వారందిరిలో మొదటి స్తానం ఆరాధ్య దేవి కే ఇస్తాను ఇది సీక్రెట్ : రాంగోపాల్ వర్మ

ప్రముఖ స్టిల్స్ ఫోటోగ్రాపర్ నవీన్ కళ్యాణ్ భారతీయ సినీ చరిత్ర లో తొలి సారిగా ఓ విప్లవాత్మక ఫోటో సిరీస్ కి శ్రీకారం చుట్టారు. ఆరాధ్య దేవి ప్రదాన పాత్రతో రామ్ గోపాల్ వర్మ నేతృత్వంలో తెరకెక్కిన ‘శారీ’ చిత్రం త్వరలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే! ఆ చిత్ర హీరోయిన్ ఆరాధ్య దేవి తో నవీన్ కళ్యాణ్ ‘యానిమల్ ఆరాధ్య’ టైటిల్ తో ఫోటో సిరీస్ రూపొందించి సరికొత్త ప్రయోగం చేసాడు. హైదరాబాద్ లోని ఓ పబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామ్ గోపాల్ వర్మ హాజరై ఫోటో సిరీస్ ని ఆవిష్కరించారు.
ఈ ఫోటో సిరీస్ లోని అంత్యంత ప్రత్యేకత ఏమిటంటే ఇంతవరకూ భారతీయ సినీ చరిత్ర లో ఇంత వినూత్న తరహా లో ఫోటోలను తీయడం జరగలేదు. అందువల్ల ఇది సమ్ థింగ్ స్పెషల్ ఫోటో సీరిస్ అని ఫోటోగ్రాఫర్ నవీన్ కళ్యాణ్ చెబుతున్నారు. అందమైన ఆరాధ్యదేవిని ఒక వైల్డ్ యానిమల్ కంపేరిజన్ తో సరికొత్త క్రియేటివిటీ తో, ఆమెలోని అందాన్ని అడివి మృగాలతో మిక్స్ చేసిన హై ఫ్యాషన్ ఫోటో సీరిస్ గా రూపొందించారు.
ఈ వైల్డ్ ఫోటో లలో ఆరాధ్య ని అడివి జంతువులైన మాకావు , ఇగువానా , కొండచిలువ, నల్ల హంస, ఆస్ట్రీచ్ మరియు  రేస్ గుర్రoల తో కలిసి కళ్యాణ్  ఈ అధ్బుతమైన చిత్రాలను తన కెమెరాలో భందించారు. ఈ ఫోటో షూట్ కు ప్రణతి వర్మ కాస్టుమ్ డిజైనర్ గా వ్యవహరించారు. చూపు మరల్చనీయకుండా చేసే ఈ ఫోటో సీరిస్ స్వేచ్ఛకు, నిర్భయానికీ ప్రతీకగా ఉన్నాయి.

ఆవిష్కరణ తరువాత దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ -“అడవి మృగలంటేనే అందరు భయపడతారు…ఎందుకంటె అవి మనల్ని ఏం చేస్తాయన్నది మనం ఊహించలేము. అలాంటిది మా హీరోయిన్ ఆరాధ్య ఎంతో ధైర్యంగా వాటిని కలుపుగోలుగా మచ్చిక చేసుకుని ఈ ఫోటో సిరీస్ చేసింది. ఇలా అడివి జంతువులతో ఒక అమ్మాయి ఫోటో షూట్ చేయడం సమ్ థింగ్ స్పెషల్ భారతీయ సినీ చరిత్ర లో ఇంత వినూత్న తరహా లో చిత్రీకరించిన ఫోటోగ్రాఫర్ నవీన్ కళ్యాణ్ ను అభినందిస్తున్నాను. ఇక ఆరాధ్య దేవి గురించి చెప్పాలంటే కేరళకు చెందిన అమ్మాయి – ఇంతకు ముందు శ్రీలక్ష్మి అనే పేరుతో సాగింది.  ఆరాధ్యను ఓ ఇన్ స్టా రీల్ లో తొలుత శారిలో చూసాను. ఆ తరువాత ఈ అమ్మాయి సైకలాజికల్ థ్రిల్లర్ కథ ‘శారీ’ చిత్రం లో కథానాయకి గా సరిపోతుందని సినిమా పూర్తి చేసాం. ఈ నెల 28న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పుడు ఆ శారీ లో వున్నాఅమ్మాయి ఈ విధంగా చుడోచ్చనేది నవీన్ కళ్యాణ్ మదిలో మెదిలిన ఆలోచన. ఈ క్రెడిట్ అంతా అతనిదే!” అన్నారు.

స్టిల్స్ ఫోటోగ్రాపర్ నవీన్ కళ్యాణ్ మాట్లాడుతూ – “నేను అర్జివి సర్ వద్ద పదేళ్లుగా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ నుండి కూడా నన్ను సర్ బాగా సప్పోర్ట్ చేస్తున్నారు. అయితే ఓ రోజు నన్ను ఆఫీస్ కి పిలిపించి శారీ చిత్రంలోని ఓ పాటను చూపించారు. పాటలు చాల బాగున్నాయి. ఆరాధ్య ఆ పాటల్లో చాలా అందంగా హుందాగా కనిపించింది. అయితే ఆరధ్యను ప్రత్యేకంగా ఓ ఫోటో షూట్ చేద్దామని అడిగాను. దానికి ఆర్జీవి సర్ ఎప్పుడూ రెగ్యులర్ గా వుండే ఫోటోలు కాదు ఏదైనా డిఫరెంట్ చెయ్యి అన్నారు. అప్పడు వైల్డ్ యనిమల్స్ తో ఓ ఫోటో షూట్ చేద్దామని అనుకుంటున్నానని చెప్పా! మరి నీ ఓకేనా అంటే అవి వైల్డ్ యనిమల్స్ కదా మైంటైన్ చేయగలవా అన్నారు. సరే అనుకుని వాటితో షూటింగ్ చేసాము. నాకైతే కెమెరా తో పని కాని ఆ పాము, ఇగువాన వంటి ఒళ్ళు జలదరించే వాటితో ఆరాధ్య ఎంతో ఫ్రెండ్లీ గా ఫోటో షూట్ కి సహకరించింది.” అన్నారు.

ఆరాధ్య దేవి మాట్లాడుతూ – “ఈ ఫోటో షూట్ గురించి ఆర్జీవి సర్ చెప్పినపుడు నేను కాస్త ఆలోచించాను! కొత్తదనం కోసం పరితపించే ఆర్జీవి సర్ ఊరికే చెప్పారు. ఏ మాత్రం సంకోచించకుండా ఒప్పుకున్నాను. ఆర్జీవి సర్, నవీన్ కళ్యాణ్ గారి ఎంకరేజ్మెంట్ తో ఈ ఫోటో షూట్ పూర్తి చేశాను. వైల్డ్ యనిమల్స్ అంటే అందరికి భయమే షూట్ జరుగుతున్నపుడు నాకు కూడా అస్త్రిచ్ తో ఓ సారి భయమేసింది.”అన్నారు.

కాస్టుమ్ డిజైనర్ ప్రణతి వర్మ – “నవీన్ కళ్యాణ్, ఆర్జీవి సర్ ఈ కాన్సెప్ట్ చెప్పినపుడు వైల్డ్ యనిమల్స్ తో ఫోటో షూట్ అనగానే ఇదేదో కొత్తగా వుంది అనుకున్నాను ఓ చాలెంజ్ గా తెసుకున్నాను. యం టి వి వంటి పాపులర్ మ్యూజిక్ చానల్ లో ఓ సారి ఓ వీడియో ఆల్బం చూసాను….ఆ రిఫరెన్స్ తీసుకుని ఈ షూట్ కి డిజైన్ చేయడం జరిగింది.”అన్నారు.

ఆ తరువాత రామ్ గోపాల్ వర్మతో ప్రశ్న జవాబుల కార్యక్రమం జరిగింది.

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

3 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

4 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago