రామ్ చరణ్ నటించిన RRR చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను సృష్టించటమే కాదు, అందులోని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఇది ఇండియన్ సినిమాకు ఎంతో గర్వ కారణంగా నిలిచింది. ఇది రామ్ చరణ్కు విజయాన్ని అందించటంతో పాటు భారతీయ సినిమాపై తిరుగులేని ప్రభావాన్ని చూపించింది. అలాగే రామ్ చరణ్కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది.
ఇండియన్ సినిమాల్లో లెజెండ్రీ నటుడైన చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్ ఇప్పుడు తనదైన ముద్ర వేశారు. ఆయన ఇండియన్ సినిమాకు చేసిన కృషి అసాధారణమైనది. అలాంటి నటుడు IFFMలో పాల్గొనటం అనేది ఆయనకు మరింత గుర్తింపును తెచ్చి పెట్టటమే కాదు ఇండియన సినిమాకు చేసిన సపోర్ట్కు మరో మెట్టుకు ఎక్కించేలా ఉంది.
ఈ IFFM వేడుకల్లో గౌరవ అతిథిగా ఉండటంతో పాటు.. ఇండియన్ సినిమాకు ఆయన చేసిన సేవకుగానూ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్గా అందుకోనున్నారు. ఈ ఫెస్టివల్లో చరణ్ పాల్గొనటం అనేది ఆయన గౌరవాన్ని మరింతగా పెంపొందిస్తోంది. తద్వారా చలన చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన ప్రయాణాన్ని ఇది తెలియచేస్తుంది.
ఈ సందర్భంగా రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘‘ మన భారతీయ చిత్రాల్లోని వైవిధ్యాన్ని, గొప్పదనాన్ని ఇలాంటి ఓ అంతర్జాతీయ వేదికగా ఘనంగా నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. అలాంటి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో భాగం కావటం అనేది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ వేదికపై మన చిత్ర పరిశ్రమ తరపున నేను ప్రాతినిద్యం వహించటం ఆనందంగా ఉంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులతో కనెక్ట్ కావటం అనేది మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ట్రిపులార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి విజయాన్ని దక్కించుకుందో అందరికీ తెలుసు. ఆ సినిమాను ఆదరించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. మెల్బోర్న్లో ఆ సినిమాకు సంబంధించిన క్షణాలను ప్రేక్షకులతో పంచుకోవటం నాకు మాటల్లో చెప్పలేని సంతోషాన్ని కలిగిస్తోంది. మెల్బోర్న్లో మన జాతీయ జెండాను ఎగురవేసే అద్భుతమైన అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.
IFFM డైరెక్టర్ మితు బౌమిక్ లాంగ్ మాట్లాడుతూ ‘‘IFFM 15 ఎడిషన్ సినీ వేడుకల్లో రామ్ చరణ్ పాల్గొనబోతుండటం అందరిలో ఆసక్తిని పెంచటంతో పాటు మాకెంతో గౌరవంగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటుడిగా ఆయన క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ ఇండియన్ సినిమాలో ప్రభావంతమైన నటుల్లో ఒకరిగా నిలబెట్టింది. ఆయన్ని మెల్బోర్న్కు సాదరంగా స్వాగతించటానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. అలాగే ఆయన విజయాలను ఇక్కడ మరింత ఘనంగా జరుపుకోబోతున్నాం’’ అన్నారు.
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 15వ ఎడిషన్లో రామ్ చరణ్ పాల్గొనబోతుండటం అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. అలాగే అందరికీ మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుందని కమిటీ తెలియజేసింది. ఈ 15వ ఎడిషను చాలా వైభవంగా ఓ మైలురాయిలా నిలచిపోయేటట్లు సెలబ్రేట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సదరన్ హెమీస్పియర్లో జరిగే అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్స్లో IFFM ఒకటి.
రీసెంట్గా ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ను రామ్ చరణ్ పూర్తి చేశారు. శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయిక. త్వరలోనే RC16ను ప్రారంభించనున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. అలాగే RC17 సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…