మీ నేపథ్యం ఏమిటి:
నాకు చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే చాలా ఆసక్తి. మా నాన్న స్టేజీ షోలకు రైటర్. అమ్మ కూడా కవితలు రాస్తుంటేవారు. మా ఇంటి వాతావరణం నుంచే నాకు సినిమాలపై ఆస్తక్తి పెరిగింది. చిన్నప్పటి నుంచే నేను దర్శకుడవుతాను అని ఇంట్లో చెప్పేవాడిని.కానీ అమెరికా వెళ్లి ఎం.ఎస్ చేశాను. ఇక నా గురించి నేను రియలైజ్ అయిన తరువాత ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆ తరువాత చాలా షార్ట్ ఫిలింస్ చేశాను. చాలా అవార్డులు కూడా దక్కాయి. ఇక సినిమా తీయగలను అనే కాన్పిడెన్స్ వచ్చిన తరువాత రహస్యం ఇదం జగత్ సినిమా చేశాను. బ్యూటిఫుల్ కంటెంట్, వండర్ఫుల్ విజువల్స్ టెక్నికల్గా చాలా సౌండ్తో ఈ సినిమా చేశాను.
సైన్స్ అండ్ మైథలాజికల్గా కాన్సెప్ట్తో ఈ సినిమా తీయాలని ఎందుకనిపించింది?
దర్శకుడిగా ఒక వైవిధ్యమైన కొత్త కథలో రావాలని అనుకున్నాను. ఆ సమయంలోనే ఈ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇండియాకు చెందిన శ్రీ చక్రం గురించి అమెరికాలో అన్వేషణ జరిగింది. శ్రీ చక్రం గురించి తవ్వకాలు జరిగిన ప్రదేశం నేను వుండే ప్లేస్కు చాలా దగ్గరగా వుంటుంది. శ్రీ చక్రం కోసం జరిగిన అన్వేషణ. నన్ను బాగా ఇన్స్పయిర్ చేసింది. ఈ కథను ఇంట్రెస్టింగ్ చెప్పొచ్చు అనిపించింది. మన కథను, మన పురాణాల కథను తీసుకుని ఫిక్షన్ను యాడ్ చేసి లార్జన్దేన్ లైఫ్ కథ చెప్పాలి అనుకోని చెప్పాను.వామ్ హోల్ కాన్సెప్ట్తో ఇతర లోకాలకు ట్రావెల్ కావొచ్చు. సైన్స్ ప్రకారం వామ్హోల్స్తో ట్రావెల్ చేస్తే ఇంకో టైమ్లోకి వెళతాం అని చెప్పే కథ ఇది.
ఈ కథలో వున్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటి?
ఈ కథలో ఆడియన్స్ బాగా థ్రిల్ల్గా ఫీలయ్యే అంశాలు చాలా వున్నాయి. మన కథలు, మన పురాణాలు గురించి మన పూర్వీకులు గురించి ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వున్నాయి. సైన్స్, వామ్హోల్స్ గురించి ముందే పురాణాల్లో రాశారు. ఈ సినిమా చూసిన వాళ్లు చాలా మంచి ఎక్స్పీరియన్స్ను పొందుతారు.
ఇలాంటి కాంప్లికేట్ కథను ఎంత వరకు సరళంగా చెప్పారు?
ఇలాంటి హెవీ కథను.. పోర్స్ఫుల్ కాకుండా.. సింపుల్ఫైగా చెప్పాను. ఈ కథలో సందర్భ, కథకు తగ్గట్టుగా క్యారెక్టర్స్ , ఎలిమెంట్స్ వుంటాయి. క్యారెక్టర్ ట్రావెల్స్లో ఈ కథలన్నీ బయటికొస్తాయి. చాలా సింపుల్ఫై చేశాం.
యూఎస్లో సాఫ్టవేర్ రంగంలో సెటిలైన మీరు దర్శకత్వం వైపుకు రావడం రిస్క్ అనిపించలేదా?
రిస్క్ వుంది. కానీ దర్శకత్వం అనేది నా యాంబిషన్ పాషన్తో వున్న వాళ్లు అందరూ రిస్క్ తీసుకుని ఎదిగిన వాళ్లే. మణిరత్నం రాజమౌళి, నాగఅశ్విన్ ఈ రోజు వాళ్లు మంచి పొజిషన్లో వున్నారంటే వాళ్ల కెరీర్లో వాళ్ల కూడా ఎంతో రిస్క్ తీసుకున్నారు. నేను కూడా నా కథను , నా పొటెన్షియల్ నమ్మి ఈసినిమ చేశాను. లైఫ్లో సాధించాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే.
చాలా మంది అప్రిషియేట్ చేశారు. అందరికి ఇంట్రస్టింగ్ స్టోరీ.
ఈ సినిమాలో అందరిని కొత్తవాళ్లను ఎందుకు తీసుకున్నారు?
ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినా ఆర్టిస్టులు నటులుగా ప్రూవ్ అయిన వాళ్లే. .కొత్తవాళ్లు..ఈ కథను తెలియని వాళ్లతో ఈ సినిమా బెటర్గా వుంటుందనేది నా ఫీలింగ్. ఎందుకుంటే ఇందులో వున్న సస్పెన్స్ ఎలిమెంట్స్కు వాళ్లే ప్లస్గా వుంటారు. ఇలాంటి కథలకే కొత్తవాళ్లే కరెక్ట్. అప్పుడే ఈ కథ ఈసినిమాతో ఎలివేట్ వుంటుంది ఎక్కువ థ్రిల్ల్ వుంటుంది. కొత్తవాళ్లైనా చాలా బాగా నటించారు.
రహస్యం ఇదం జగత్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి:
యూనివర్శ్ ఈజ్ మిస్టరీ. . పురాణాల్లో లోకాల మధ్య తిరిగిన వాళ్లు వామ్హోల్, కాన్సెప్ట్కు సంబంధ వుంది. లోకల మధ్య తిరిగారు అంటారు. కానీ వాళ్లు ఎలా తిరిగారు. 14 లోకాలు వుంటే వీటిలో ఎన్నో కథలు వున్నాయి. ఈ జగతే ఒక రహస్యం, అందులో మేము టచ్ చేసింది చిన్న పాయింట్,
మీ తదుపరి సినిమాలు ఏమిటి?
నా దగ్గర మంచి కథలు వున్నాయి. బేసికల్గా బడ్జెట్తో రెడీగా వున్నాయి. ఈ ఎక్స్పీరియన్స్తో నా లోపాలు సరిదిద్దుకుని. నేను ఏ సినిమా తీసిన ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథలతోనే సినిమా చేస్తాను.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…