ప్రైమ్ వీడియో తమ కొత్త ప్రైమ్ ఒరిజినల్ సినిమా SYSTEM ట్రైలర్ను విడుదల చేసింది. కోర్ట్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవర్, న్యాయం మధ్య జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఈ చిత్రానికి అశ్విని అయ్యర్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవరికేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే 22 నుంచి ప్రైమ్ వీడియో లో మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది.
ట్రైలర్లో నేహా అనే యువ లాయర్ పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించారు. తన తండ్రిలా ఫర్మ్లో పార్ట్నర్ కావాలని ఆశపడే ఆమె, తన ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కోర్ట్ స్టెనోగ్రాఫర్ సారిక పాత్రలో నటించిన జ్యోతికతో కలిసి పని చేస్తుంది. అయితే సారికకు కొన్ని గోప్యమైన ఉద్దేశాలు కూడా ఉంటాయి. కోర్ట్ సన్నివేశాలు, భావోద్వేగాలు, ఆలోచింపజేసే డైలాగులతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
“పవర్ ముందు నిజం నిలబడగలదా? న్యాయం గెలుస్తుందా?” అనే ప్రశ్నను సినిమా ప్రధానంగా చూపించబోతోంది. దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారి మాట్లాడుతూ, నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథతో ఈ సినిమా రూపొందిందని తెలిపారు. అలాగే సోనాక్షి సిన్హా, జ్యోతిక ఈ చిత్రం తమ నటనకు కొత్త సవాల్గా నిలిచిందని చెప్పారు. ప్రేక్షకులను ఆలోచింపజేసే కథలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో ప్రైమ్ వీడియో మంచి వేదిక అని ఆమె అభిప్రాయపడ్డారు.
సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా మూవింగ్ డ్రీమ్స్ ఇండియా…
"కె ర్యాంప్" వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. సక్సెస్ ఫుల్…
ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించే తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు ఇటీవల లేథోవిస్ అనే మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడం…
హైదరాబాద్: తెలుగు తెరపైకి మరో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతొంది. ఎన్ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కనున్న నూతన చిత్రం ‘విలేజ్ స్టార్స్’…
ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో…
'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా…