నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ ప్రతినిధి 2, ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్, థియేట్రికల్ ట్రైలర్తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. మరో రెండు రోజుల్లో మే 10న సినిమా విడుదల కానుంది. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు.
ముఖ్యమంత్రిని ఎందుకు చంపాలని అనుకున్నావ్ ? నీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అని హీరోని విచారించడంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. బాంబు పేలుడులో సీఎం చనిపోగా, ఆయన కుమారుడే ఆ బాధ్యత తీసుకోవాలని రికమండేషన్లు వస్తాయి. ముఖ్యమంత్రి మరణానంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల డ్రామాలని చాలా గ్రిప్పింగ్ గా చూపించారని రిలీజ్ ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది.
థియేట్రికల్ ట్రైలర్ కంటే రిలీజ్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్, ఎంగేజింగ్ గా ఉంది. సినిమా కంటెంట్ గురించి మరింత రివిల్ చేసింది. నారా రోహిత్ మరో ఎజెండా ఉన్న జర్నలిస్ట్గా డాషింగ్గా కనిపించారు. దర్శకుడు మూర్తి తన అద్భుతమైన కథనంతో కట్టిపడేశారు.
ఈ చిత్రంలో సిరీ లెల్లా కథానాయికగా నటించింది. సచిన్ ఖేడేకర్, దినేష్ తేజ్, రఘు బాబు, జిషు సేన్గుప్తా, ఉదయ భాను, అజయ్ ఘోస్, శ్రీ ముఖ్య పాత్రలలో కనిపించారు.
నాని చమిడిశెట్టి కెమరా మెన్. యువ సంగీత సంచలనం మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.
తారాగణం: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని
బ్యానర్లు: వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటర్: రవితేజ గిరిజాల
డీవోపీ: నాని చమిడిశెట్టి
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: శివరాజు & పృధ్వి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల
పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: ప్రవీణ్ & హౌస్ఫుల్ డిజిటల్
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…