హాలీవుడ్ చిత్రం “ది డిజర్వింగ్” పోస్టర్ విడుదల

వెంకట సాయి గుండ ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ చిత్రం “ది డిజర్వింగ్” చిత్రం నుంచి అధికారిక పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రం ముఖ్యంగా చిన్నతనంలో జరిగే పరిస్థితులు, గృహహింస, సైకాలజికల్ సమస్యల వంటి సమాజ సమస్యలపై వినుత్నంగా తెరకెక్కించిన సైకాలజికల్ హారర్ థ్రిల్లర్. కేవలం థ్రిల్లర్ మాత్రమే కాకుండా, గాఢమైన సందేశాన్ని కలిగి ఉంది. ప్రత్యేకమైన జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రజాదరణ పొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ చిత్రంలో లీడ్ రోల్ మూగవాడు కావడం ప్రత్యేక అంశం. దీంతో చిత్రం కథ, కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. “ది డిజర్వింగ్” చిత్రం ఇప్పటికే ఫ్రాన్స్, టొరంటో, స్వీడన్, నేపాల్, లండన్, నైజీరియా, బెర్లిన్, స్పెయిన్, న్యూయార్క్, కేన్స్, రోమ్ వంటి దేశాల్లో అనేక అవార్డులను గెలుచుకుని అంతర్జాతీయ గుర్తింపును పొందింది. ఈ చిత్రం బార్సిలోనా, స్పెయిన్‌లో జరగబోయే ఒక ప్రధానమైన ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడుతుంది, దానిద్వారా అంతర్జాతీయంగా మరింత గుర్తింపు పొందుతోంది.

ఈ చిత్రంలో నటించిన వెంకట్ సాయి గుండ నటనకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై అనేక బెస్ట్ యాక్టర్ అవార్డులను అందుకున్నారు. ఈ చిత్రం 14వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. దీంతో ఈ చిత్రంపై అందరికీ మరింత ఆసక్తి నెలకొంది. విడుదలకి ముందుగానే ఎన్నో ప్రశంసలను అందుకోవడం, ఒక తెలుగు వ్యక్తి చిత్రీకరించి, నటించిన
హాలీవుడ్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం చాలా గర్వకారణం.

వెంకట సాయి గుండకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణం నుంచి ఈ స్థాయికి ఎదగడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది కేవలం ఆయనకు ఉన్న క్రమశిక్షణ, కథను ప్రపంచానికి చెప్పాలనే పట్టుదల, ఆసక్తి ఇంతవరకు తీసుకొచ్చాయి. అంతేకాదు ఆయన ఆలోచనలకు మద్దతు ఇస్తూ ఆయన వెన్నంటి నడిచే స్నేహితులు విస్మయ్ కుమార్ కోతోపల్లి, తిరుమలేశ్ గుండ్రత్ సాహకారంతో ఈ హాలీవుడ్ చిత్రాన్ని నిర్మించారు.

“ది డిజర్వింగ్” చిత్రం అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. “ది డిజర్వింగ్” చిత్రం కోసం వెంకట్ సాయి గుండ ఎంత శ్రమించారో అతి త్వరలో యావత్తు ప్రపంచం చూస్తుంది. ఈ చిత్రం ఎందరికో స్పూర్తిగా నిలుస్తుంది. కచ్చితంగా కఠోర కృషి, అభిరుచి ఉంటే, గ్లోబల్ స్థాయిలో విజయాన్ని సాధించవచ్చు అని ఈ చిత్రం నిరూపిస్తుంది. వెంకట సాయ గుండ ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో నిర్మించి, ఎంతోమంది ఆర్టిస్టులను హాలీవుడ్ పరిశ్రమలో పని చేయడానికి కొత్త మార్గాన్ని వేశారు.

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

4 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

5 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago