ముత్యాల సుబ్బయ్య కొత్త చిత్రం

Must Read

సమాజాన్ని జాగృతం చేసే కథలు, చక్కటి కుటుంబ ఇతివృత్తంతో యాభైకి పైగా సినిమాలను తీసిన ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి తీస్తున్న చిత్రమిది. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రంలో రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు ప్రధాన పాత్రధారులు. వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వం వహించనున్నారు.

హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోలో ఆగష్టు 9న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకుంటుందని చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య వెల్లడించగా, దర్శకుడిగా ఎప్పటికీ గుర్తుంచుకునే అద్భుత చిత్రాలను అందించిన నాన్న సమర్పణలో ఈ చిత్రం ద్వారా నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తుండటం ఆనందంగా ఉందని ముత్యాల అనంత కిషోర్ తెలిపారు. ఇతర విషయాలను చిత్రం ప్రారంభం రోజున వివరిస్తామని ఆయన చెప్పారు.

దర్శకుడు వి.శ్రీనివాస్ (సిప్పీ) మాట్లాడుతూ, ఓ వైవిధ్య భరిత , ఫామిలీ ఎంటర్ టైనర్ గా ప్రతీ ఒక్కరూ చూసి తీరాల్సిన చిత్రంగా దీనిని మలచనున్నామని చెప్పారు.

ఈ చిత్రంలో రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు తదితరులు నటీనటులు.

ఈ చిత్రానికి మూల కథ: శరవణన్, కదా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, మరుదూరి రాజా, మాటలు: నివాస్, పాటలు: భువనచంద్ర, సంగీతం: కోటి, డి.ఓ.పి: ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, ఆర్ట్: వెంకటేశ్వరరావు, సమర్పణ: ముత్యాల సుబ్బయ్య, నిర్మాత: ముత్యాల అనంత కిషోర్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్ (సిప్పీ

Latest News

బాలయ్య బెస్ట్ విషష్ తో పైలం పిలగా సెప్టెంబర్ 20న థియేటర్స్ లో

'పైలం పిలగా' ఈ వారం సెప్టెంబర్ 20న థియేటర్ లో సందడి చేయబోతున్న సినిమా. 'పిల్ల పిలగాడు' వెబ్ సిరీస్ తో యూత్ లో మంచి...

More News