నితిన్, రష్మిక మందన, వెంకీ కుడుముల,కొత్త సినిమా అనౌన్స్

Must Read

#VNRTrio- వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ‘భీష్మ’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం పూర్తిగా వినోదాల్ని అందించడంతో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబధించిన మంచి సందేశం ఇచ్చింది. ఉగాది శుభ సందర్భంగా #VNRTrio కాంబినేషన్లో కొత్త చిత్రం ఒక ఫన్నీ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.

వీడియోలో నితిన్, రష్మిక మందన, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ దర్శకుడి కోసం ఎదురు చూస్తారు. వెంకీ కుడుముల వచ్చి లేట్ అయ్యానా? అని అడుగుతాడు.. ముగ్గురు కలసి బాగా..అని చెప్పారు. స్క్రిప్ట్ కూడా బాగా వచ్చిందని చెప్తాడు వెంకీ. ఛలో, భీష్మ లాగా ఈ చిత్రం కూడా వినోదాత్మకంగా ఉంటుందా అని అడిగినప్పుడు.. ఇది వేరేగా ఉంటుందని చెప్పడం ఆసక్తికరంగా వుంది.

#VNRTrio మరింత వినోదాత్మకంగా, అడ్వంచరస్ గా ఉంటుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మైత్రీ మూవీస్ ఈ ప్రాజెక్ట్ లో చేరడంతో సినిమా స్కేల్ పెరిగింది. అంతేకాదు సినిమా క్రేజ్ ట్రిపుల్ అయ్యింది.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు కాగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: నితిన్, రష్మిక మందన
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

Raghavendra Rao unveiled the glimpses of the movie Abhimani

Film journalist and producer Suresh Kondeti has become very popular on social media. Having already entertained audiences with several...

More News