విశ్వక్ సేన్ యాంకర్ గా,’ఫామిలీ ధమాకా’ అను సరికొత్త గేమ్ షో

విశ్వక్ సేన్ యాంకర్ గా,’ఫామిలీ ధమాకా’ అను సరికొత్త ఫామిలీ గేమ్ షో తో సెప్టెంబర్ 8 న వస్తున్న ఆహ*

– ఈ షో తోటి ఓటిటి లో డెబ్యూ చేయనున విశ్వక్ సేన్ – 

*ఆగ‌స్ట్ 28, హైద‌రాబాద్‌*: తెలుగు ఆడియెన్స్‌కి తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌టంలో ఆహా ఎప్పుడూ ముందుంటుంది. ఈ మాధ్య‌మం నుంచి మ‌రో అద్భుత‌మైన రియాలిటీ షో ‘ఫ్యామిలీ ధ‌మాకా’ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబ‌ర్ 8 నుంచి ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ అవుతుంది. ప్ర‌తీ శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల‌కు ఈ షో నుంచి కొత్త ఎపిసోడ్ అంద‌రినీ ఆక‌ట్టుకోనుంది. ఈ షోను వీక్షించే ప్రేక్ష‌కుల్లో ఉత్తేజాన్ని పెంచేలా ఎన్నో భావోద్వేగాలు, స‌వాళ్ల క‌ల‌యిక‌గా ఈ షో ఓ రోల‌ర్ కోస్ట‌ర్‌లా మ‌న ముందుకు రానుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు మీరు చూసిన షోస్‌కు ఇదెంతో భిన్న‌మైనది. కుటుంబాల మ‌ధ్య అనుబంధాలను తెలియ‌జేస్తూనే అంద‌రినీ ఈ షో ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఈ షోతో టాలీవుడ్ వెర్స‌టైల్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ హోస్ట్‌గా మారుతుండ‌టం విశేషం. ఆయ‌న త‌న‌దైన హోస్టింగ్‌తో న‌వ్వుల ప్ర‌యాణంలో ప్రేక్ష‌కుల‌ను కూడా భాగం చేయ‌బోతున్నారు. ఈ షోను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఫ్రిమాంటిల్ ఇండియా నిర్మిస్తోంది. 

వెర్స‌టైల్ యంగ్ హీరో *విశ్వ‌క్ సేన్* మాట్లాడుతూ *‘‘ఆహా’వారి ఫ్యామిలీ ధమాకా షోతో నేను హోస్ట్‌గా మార‌టం మ‌ర‌చిపోలేని అనుభూతి. ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ షో ద్వారా ఎన్నో కుటుంబాలను కలిసాను. చాల ఆనందంగా ఉంది. ఈ తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి నేను ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’’* అన్నారు.

*సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నాన్ సబ్ స్క్రిప్ష‌న్ రెవెన్యూ బిజినెస్‌, కంటెండ్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ ‘‘ప్రేక్ష‌కులు కు  ఉహించ‌ని కొత్త‌ద‌నంతో కూడిన ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందించ‌టంలో ఆహా వాళ్లు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి వాటిలో ఫ్యామిలీ ధ‌మాకా ఒక‌టి. విశ్వ‌క్ సేన్ ఈ షోను హోస్ట్ చేయ‌టం అనేది అందరిలోనూ ఆస‌క్తిని పెంచుతోంది. క‌చ్చితంగా ఈ షో అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది’’* అన్నారు.

*ఫ్రిమాంట‌ల్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆరాధ‌న బోలా మాట్లాడుతూ ‘‘ఆహాతో మా జ‌ర్నీ ఎప్ప‌టి నుంచో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న ఐడ‌ల్ రెండు సీజ‌న్స్‌లో మేం క‌లిసి ప్రేక్ష‌కులను ఎంట‌ర్‌టైన్ చేశాం. ఇప్పుడు ఫ్యామిలీ ధ‌మాకాతో మీ ముందుకు రాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఫ్రిమాంటిల్‌లో అతి పెద్ద‌దైన గేమ్ షో ఫ్యామిలీ ఫ్యూడ్ ను ఆధారంగా చేసుకుని ఫ్యామిలీ ధ‌మాకాను రూపొందించాం. ఈ ఫ్యామిలీ ప్ర‌పంచ వ్యాప్తంగా 63 ప్రాంతాల్లో రూపొందిస్తున్నారు. ఓ దేశంగా చూస్తే మ‌నది వ‌సుదైక కుటుంబం అనాలి. అందులోని ప‌లు కోణాలు,హాస్యం, భావోద్వేగాలు వీట‌న్నింటినీ క‌ల‌గ‌లిపి ప్ర‌శ్న‌లుగా చేసి విశ్వ‌క్ సేన్ ప్రేక్ష‌కుల‌ను అడుగుతారు. అది కూడా ఎంట‌ర్‌టైన్‌మెంట్ పంథాలో. ఇది ప్ర‌తీ ఒక‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు.*

ఫ్యామిలీ ధ‌మాకా… ఎంట‌ర్‌టైన్మెంట్‌, ఉత్సాహాన్ని పెంచే స‌వాళ్ల క‌ల‌యిక‌. సెప్టెంబ‌ర్ 8 న ప్రారంభం కానున్న ఈ షో కోసం ఆహాను ట్యూన్ చేయండి

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

12 hours ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

2 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago