టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు రమేష్ కడూరి మీటర్ విశేషాలని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు.
మీ నేపధ్యం గురించి చెప్పండి ?
మాది విజయనగరం జిల్లా గరివిడి మండలం. సినిమాలపై ఇష్టంతో దర్శకుడు కావాలని పరిశ్రమలోకి వచ్చాను. బాబీ గారు , గోపీచంద్ మలినేని గారి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాను. ఇప్పుడు మీటర్ తో దర్శకుడిగా పరిచయమౌతున్నాను.
మీటర్ ప్రాజెక్ట్ ఎలా ఓకే అయ్యింది ?
రచయిత శ్రీకాంత్ విస్సా మైత్రీ మూవీ మేకర్స్ కి రిఫర్ చేశారు. తర్వాత బాబీ గారు, గోపీచంద్ మలినేని గారి ప్రోత్సాహంతో ఈజీ అయ్యిది. కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రాజెక్ట్ ఓకే అయ్యింది.
మీటర్ టైటిల్ పెట్టడానికి కారణం
మీటర్ అంటే కొలత. ఇందులో హీరోయిజానికి సంబధించిన ఒక కొలత.. ఎమోషన్, ప్రేమకు సంబధించిన ఒక కొలత… కిరణ్ అబ్బవరం ఇంతకుముందు చేసిన సినిమాలన్నిటి కంటే ఇది డిఫరెంట్ గా వుంటుంది.
కిరణ్ సీరియస్ పోలీస్ లా కనిపిస్తారా ?
ఇందులో తన పాత్ర ఒక డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్ గా వుంటుంది. తను సీరియస్ కాప్ గా సెకండ్ హాఫ్ లో ఓ పది నిమిషాలు వుంటుంది. ఆ పది నిముషాలు థియేటర్ లో రఫ్ఫాడించేస్తాడు. మిగతా అంతా ఒక మంచి ఎంటర్ టైనర్ గా మంచి ఫన్ తో వెళుతుంది.
పక్కా కొలతలు పెట్టుకొని కమర్షియల్ ఫార్మెట్ లో చేసినట్లుగా వున్నారు ?
కావాలని పెట్టుకున్న కొలతలు కాదు. ఈ కథ అలా కుదిరింది. అలా అని రెగ్యులర్ ఒక పాట ఫైటు అన్నట్టుగా వుండదు. రెగ్యులర్ ఫార్మెట్ ని బ్రేక్ చేస్తుంది. డిఫరెంట్ గా ఉంటూనే కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వుంటుంది.
కిరణ్ అబ్బవరం ఇంత మాస్ పాత్రకు ఎలా సూట్ అవుతారనే ఆలోచన రాలేదా ?
మన దగ్గర ఏముందో దానితోనే గెలవాలి. ఈ కథ తో ఇద్దరు ముగ్గురు హీరోలని సంప్రదించాను. అయితే అప్పటికే వాళ్ళు చేయాల్సిన ప్రాజెక్ట్ లు వుండటం , ఇంకొన్ని కారణాల వలన కుదరలేదు. అలా అని వుండిపొతే నా కెరీర్ ఆగిపోతుంది. అందుకే ఎవరిని పట్టుకున్న మనం అనుకున్నట్లు చూపించాలని నిర్ణయించుకున్నాను. అప్పడే ఎస్ఆర్ కళ్యాణ మండపం తో వచ్చాడు కిరణ్. నిర్మాతలు కూడా ఆ సినిమాని చూశారు. ఈ కథ అతనికి పడితే బావుంటుందని ఫీలయ్యారు. వెళ్లి కథ చెబితే ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత ఇంక అలోచించలేదు.
అతుల్య రవిని ఎలా ఎంపిక చేశారు ?
తను తమిళ్ లో చేసిన రెండు సినిమాలు చూశాను. తన నటన బావుంటుంది. తనకి తెలుగు కూడా రావడంతో నాకు ఇంకా ప్లస్ అయ్యింది.
మీలో ఎనర్జీ సినిమాలో చూపించారా ?
మాగ్జిమమ్ ప్రయత్నించాం(నవ్వుతూ) నాకు మంచి ఊపు, ఎంటర్టైమెంట్ వున్న కమర్షియల్ సినిమాలు ఇష్టం. నా మనస్త్వం కూడా అదే.
సాయి కార్తిక్ మ్యూజిక్ గురించి ?
కమర్షియల్ టోన్ తెలిసిన సంగీత దర్శకుడు సాయి కార్తిక్. తన చేసిన పటాస్ సినిమా నాకు చాలా ఇష్టం. ఈ కథకు మా పరిధిలో సరైన ఎంపిక సాయి కార్తిక్. నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చాడు.
మీటర్ లో మెసేజ్ ఉంటుందా ?
లేదండీ. నేను ఎప్పుడూ మెసేజ్ ఇవ్వను. మీటర్ చాలా మంచి ఎంటర్ టైనర్. తండ్రి కొడుకుల మధ్య మంచి ఎమోషన్ వుండే కథ. సినిమా అంతా చాలా ఎంటర్ టైనర్ గా వుంటుంది.
అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ అయ్యిందని విన్నాం ?
సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే బడ్జెట్ కి వెనుకడుగు వేయని నిర్మాతలు దొరకడం నా అదృష్టం. సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే మనం అడగకముందే ఇస్తారు. చెర్రీగారికి, రవి గారికి, నవీన్ గారి లైఫ్ లాంగ్ రుణపడి వుంటాను.
కొత్త చేయబోతున్న సినిమాలు గురించి ?
కొన్ని కథలు వున్నాయి. అయితే ఏదీ ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం మీటర్ విడుదలపైనే నా దృష్టంతా వుంది.
ఆల్ ది బెస్ట్
థాంక్స్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…