యంగ్ హీరోస్ విశ్వక్ సేన్, సందీప్ కిషన్ చేతుల మీదుగా విడుదలైన హిలేరియస్ ఎంటర్టనర్ ‘మెన్ టూ’ ట్రైలర్
* నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన తారాగణం.. మే 26న రిలీజ్
నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, కౌశిక్ ఘంటశాల రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న చిత్రం ‘#మెన్ టూ’. లాన్థ్రెన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 26న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. కొన్నాళ్లు ముందు విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ అందరిలో ఆసక్తిని పెంచింది.
తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ను యంగ్ హీరోస్ విశ్వక్ సేన్, సందీప్ కిషన్ విడుదల చేసి చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. ‘మెన్ టూ’ అనేది మన ఇండియా పెద్ద ఎత్తున జరిగిన సామాజిక ఉద్యమం. ఇది మీ టూ ఉద్యమంలో తప్పుడు లైంగిక ఆరోపణలకు వ్యతిరేకంగా ప్రారంభించబడ్డ ఉద్యమం.
ట్రైలర్ విషయానికి వస్తే.. ఫెమినిజమ్ కొటేషన్తో స్టార్ట్ అయ్యింది. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం అనే పాయింట్ మీద డిస్కషన్ జరగటాన్ని చూపించారు. ఆడవాళ్లు లేని చోటనే మగవాళ్లు హ్యాపీగా ఉంటారనే విషయాన్ని బ్రహ్మాజీ వివరించారు. మగవాళ్లు తమ జీవితాల్లో ఆడవారి వల్ల పడే బాధలను ఎంటర్టైనింగ్ యాంగిల్లో వివరించే ప్రయత్నం చేశారు. ఇలాంటి సమస్యలను మగవాళ్లు ఎలా హ్యండిల్ చేస్తారనే దాన్ని కూడా చూపించారు. హిలేరియల్ ఎంటర్టైనర్గా ‘మెన్ టూ’ సినిమా ఉంటుందని స్పష్టమవుతుంది. డైలాగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్గా నిలుస్తున్నాయి. హక్కులు స్త్రీలకే కాదు.. పురుషులకు ఉంటుందని తెలియజేసే సినిమా అని తెలుస్తుంది. కామెడీ, లవ్, ఎమోషన్స్ ఇలా అన్నీ అంశాల కలయికగా ‘మెన్ టూ’ మూవీని రూపొందించారు. యూత్ను టార్గెట్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తుంది. మే 26న సినిమా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు.
నటీనటులు:
నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, కౌశిక్ ఘంటశాల రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: లాన్థ్రెన్ క్రియేటివ్ వర్క్స్
నిర్మాత: మౌర్య సిద్ధవరం
కో ప్రొడ్యూసర్: శ్రీమంత్ పాటూరి
దర్శకత్వం: శ్రీకాంత్ జి.రెడ్డి
మ్యూజిక్: ఎలిషా ప్రవీణ్, ఓషో వెంకట్
సినిమాటోగ్రఫీ: పి.సి.మౌళి
ఎడిటర్: కార్తీక్ ఉన్నవ
పాటలు, మాటలు: రాకేందు మౌళి
ఆర్ట్: చంద్రమౌళి.ఇ
కో డైరెక్టర్: సుధీర్ కుమార్ కుర్రు
పి.ఆర్.ఓ: వంశీ కాకా
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…