నేడు మే డే సందర్భంగా ఎఫ్ ఎన్ సి సి ఎంప్లాయిస్ వారి ఫ్యామిలీస్ అందర్నీ ఘనంగా సత్కరించిన కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ మాగంటి మురళీమోహన్ గారు, శ్రీ నారాయణ మూర్తి గారు, శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు, హీరో శ్రీ శ్రీకాంత్ గారు, FNCC ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ గారు, నిర్మాత శ్రీ కె. ఎస్. రామారావు గారు, FNCC ప్రెసిడెంట్ శ్రీ ఆదిశేషగిరిరావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ టి. రంగారావు గారు, సెక్రటరీ శ్రీ ముళ్లపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు గారు, ట్రెజరర్ శ్రీ బి. రాజశేఖర్ రెడ్డి గారు, కమిటీ మెంబర్స్ శ్రీ ఏడిద సతీష్ గారు, బాలరాజు గారు, మరియు కల్చరల్ కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ శ్రీ ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ : FNCC సంస్థ 1993 జూన్ లో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు పనిచేస్తున్న ఎంప్లాయిస్ ఉన్నారు. అదేవిధంగా మధ్యలో జాయిన్ అయ్యే నమ్మకంగా ఈరోజు వరకు ఎంప్లాయిస్ కూడా ఉన్నారు. ఈ రోజున FNCC లో ఇన్ని కార్యక్రమాలు జరిగి ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయ్. కావున ఈరోజు మే డే సందర్భంగా ఎంప్లాయిస్ అందర్నీ సత్కరించుకోవాలని కమిటీ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయిస్ నుంచి ఇదే సపోర్ట్ రానున్న సంవత్సరాల్లో కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము అని అన్నారు.
సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి గారు మాట్లాడుతూ : మే డే అంటే కార్మికుల దినోత్సవం. ఎప్పటినుంచో పనిచేస్తున్న ఎంప్లాయిస్ అందరిని సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మే డే అంటే హాలిడే ఇవ్వడమే కాకుండా ఎంప్లాయిస్ ని మరియు వాళ్ళ ఫ్యామిలీస్ ని పిలిచి మంచి హాస్పిటాలిటీ తో సత్కరించాలని కమిటీ అనుకోవడం దానికి తగినట్టుగా అందరిని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. శ్రీ మురళీమోహన్ గారు, శ్రీ ఆర్.నారాయణమూర్తి గారు, మిమిక్రీ ఆర్టిస్ట్ శ్రీ శివారెడ్డి గారు ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ ని సత్కరించుకోవడం వాళ్ళందరూ సపోర్ట్ చేయడం చాలా మంచి విషయం. ఇలా ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఎంప్లాయిస్ ని సత్కరించుకోవడం ఇదే మొదటిసారి. ఎంప్లాయిస్ అందరూ ఫ్యామిలీతో వచ్చి ఈవెంట్ ని సక్సెస్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన ముఖ్య అతిథులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.
ఆర్.నారాయణమూర్తి గారు మాట్లాడుతూ : మే డే అంటే కార్మికులకు హాలిడే ఇవ్వడం కాకుండా ఒక మేనేజ్మెంట్ ఇలా నమ్మకంగా పనిచేస్తున్న ఎంప్లాయిస్ ఫ్యామిలీస్ ని పిలిచి సత్కరించడం ఇండస్ట్రీకి చాలా మంచి విషయం. మంచి భోజనం అలాగే సెలబ్రిటీతో సత్కరించుకోవడం ఇలా ఫ్యామిలీస్ కి ఊరట ఇవ్వడం శుభ సూచకంగా భావించవచ్చు. ఇంక ముందు ముందు కూడా ఇండస్ట్రీలో మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. 1993లో స్థాపించిన ఈ ఈ కమిటీ నుంచి ఇలా ఎంప్లాయిస్ ని వారి ఫ్యామిలీస్ని సత్కరించుకోవడం అదేవిధంగా ఎన్నో ఆక్టివిటీస్ ని నిర్వహిస్తూ ముందుకెళ్లడం FNCC సక్సెస్ కి నిదర్శనం అని అన్నారు.
మురళీమోహన్ గారు మాట్లాడుతూ : FNCC కమిటీ ఇలా ఎంప్లాయిస్ ని సత్కరించుకోవడం వాళ్ళ ఫ్యామిలీస్ని పిలిచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసి అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు యాక్టివిటీస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.
శివారెడ్డి గారు మాట్లాడుతూ : నా మిమిక్రీని ఇంతగా ఆదరించిన ఎంజాయ్ చేసిన ఫ్యామిలీస్ కి ధన్యవాదాలు. ఇలా ఈవెంట్ కి నన్ను పిలవడం, అందరితో కలిసి భోజనం చేయడం, అందరితో కలిసి ఈవెంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా FNCC ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…