‘మాయా పేటిక’ మూవీ నుంచి లవ్ సాంగ్ ‘షన్న షన్న..’ ను రిలీజ్

విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలకు సన్నద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి బుధ‌వారం ‘షన్న షన్న..’ అనే లిరికల్  సాంగ్‌ను ..హైద‌రాబాద్ బ‌షీర్ బాగ్‌లోని సెయింట్ జోసెస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. కాలేజ్ స్టూడెంట్స్ న‌డుమ ఈ ల‌వ్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. సాంగ్‌కి స్టూడెంట్స్ నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. గుణ బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్ సంగీతం అందించిన ఈ పాట‌ను శ్రీమ‌ణి రాయ‌గా.. య‌శ‌స్వి కొండెపూడి, ప్ర‌జ్ఞ నాయ‌ని పాడారు. ఈ సంద‌ర్భంగా…

హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ‘‘‘థాంక్యూ బ్రదర్’ సినిమా తర్వాత నేను నటించిన చిత్రమిది.  ప్రేక్షకుల నుంచి మళ్లీ నేను అంతే ప్రేమను ఎదురు చూస్తున్నాను.  ప్రస్తుతం మన జీవితం మన చేతుల్లో కాకుండా.. ఎక్కువగా సెల్ ఫోన్‌లోనే ఉంటుంది. అలాంటి మొబైల్ కాన్సెప్ట్‌తో సినిమా ఇది.  నేను ఎంతో ఇష్టపడి చేసిన పాత్ర ఇది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మంచి క్యారెక్టర్ క్రియేట్ చేసి.. అందులో నాకు అవకాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు ర‌మేష్‌గారికి, నిర్మాత‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు.

డైరెక్టర్ రమేష్ రాప‌ర్తి మాట్లాడుతూ ‘‘మాయ పేటిక’ సినిమా స్కిప్ట్ సరికొత్తగా ఉంటుంది. సెల్ ఫోన్ ఆధారంగా ఈ స్క్రిప్ట్ రూపొందించాం. మీ సెల్ ఫోన్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయో ఈ సినిమాలోనూ మంచి విజువల్స్, మంచి సాంగ్స్, మంచి కామెడీ ఉన్నాయి. ఫుల్ ప్యాకేజీ సినిమా ఇది.  నన్ను నమ్మిన నిర్మాతలు శరత్, తారక్‌లకు..సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ అందరికీ థ్యాంక్స్’’  అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘రొటీన్‌కి భిన్నంగా సినిమా తీయాలని అనుకున్నాం. కరోనా సమయంలో థ్యాంక్ యూ బ్రదర్ మూవీ ద్వారా కొత్త కథను, కొత్త సినిమాను మీ ముందుకు తీసుకువచ్చాం. మీరిచ్చిన ధైర్యంతో రెండో సినిమా మాయ పేటికను నిర్మించాం. ఇదొక సెల్‌ఫోన్ బేస్ ఆధారంగా తీశాం. ఈ సినిమాకు సహకరించిన నటీనటులు, డైరెక్టర్ రమేష్ అందరికీ థ్యాంక్స్. త్వరలోనే రిలీజ్ అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

న‌టీన‌టులు:

విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్, సునీల్, పృథ్వీరాజ్‌, శ్రీనివాస్ రెడ్డి, హిమ‌జ‌, శ్యామ‌ల త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

స‌మ‌ర్ప‌ణ‌:  మాగుంట వెంక‌ట నారాయ‌ణ రెడ్డి
బ్యాన‌ర్‌: జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్మెంట్స్
నిర్మాత‌లు: మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి
ద‌ర్శ‌క‌త్వం:  ర‌మేష్ రాపర్తి
సినిమాటోగ్ర‌ఫీ:  సురేష్ ర‌గుతు
ఎడిట‌ర్‌:  డి.వెంక‌టేష్ ప్ర‌భు, న‌వ్ క‌ట్స్‌
సంగీతం:  గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌
ఆర్ట్‌:  పురుషోత్త‌మ్‌

TFJA

Recent Posts

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…

2 weeks ago

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

2 weeks ago

నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ‘రక్త చరిత్ర’-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ

"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…

2 weeks ago

యతిరాజు పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శివాజీ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…

2 weeks ago

సావిత్రి గారంటే తెలుగుతనం, అమ్మతనం ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో జయప్రద

సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…

2 weeks ago

‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్*

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…

2 weeks ago