తెలుగు చలన చిత్ర పైరిశ్రమ లో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం గా మెగాస్టార్ చిరంజీవి గారికి ,బ్లాక్బస్టర్ ‘చూడాలని ఉంది’ మేకర్స్ కు కృతజ్ఞతలు తెలిపిన హీరో తేజ సజ్జ
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్బస్టర్ మూవీ ‘చూడాలని ఉంది’. నిర్మాతా అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంతోనే బాలనటుడిగా అరంగేట్రం చేశారు హీరో తేజ సజ్జ. ఈ సినిమా విడుదలై నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు గుణశేఖర్, నిర్మాత అశ్వినీ దత్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఓ నోట్ రాశారు తేజసజ్జ.
‘’25 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు. ఏమి జరుగుతుందనే అవగాహన లేకుండా పరిశ్రమలో అడుగు పెట్టాను. నా జీవితం మారిపోయింది.
ఎంతో దయకలిగిన లెజెండ్తో తెరపై నా మొదటి పెర్ఫార్మెన్స్ మొదలైయింది. ఇప్పుడు హనుమాన్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇదంతా కలలా అనిపిస్తుంది. ఈ కల మీ అందరివలనే జీవం పోసుకుంది.
మీరంతా నా కుటుంబం. ఈ రోజు నేను ఈ స్థానంలో ఉండటానికి కారణం మీ ప్రేమ, ఆదరణ.
గుణశేఖర్ గారు, చిరంజీవి గారు, అశ్వినీదత్ గారు మీరంతా ఒక్కసారిగా నా జీవితాన్ని మార్చేశారు
ఎప్పటికీ మీకు కృతజ్ఞతతో వుంటాను.
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…