ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘మాయా పేటిక’ టీం

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాల‌ను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి ఓ కొత్త కథతో ‘మాయా పేటిక’ అనే చిత్రం రాబోతోంది. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ ‘మాయా పేటిక’. రమేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 30న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ మాట్లాడుతూ..

నిర్మాత శరత్‌ చంద్ర మాట్లాడుతూ.. ‘థాంక్యూ బ్రదర్ సినిమాను అందరూ ఆదరించారు. ఇది మా రెండో సినిమా. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉంటాయి. రెగ్యులర్ రొటీన్ సినిమాలా ఉండదు. థియేటర్లో రాబోతోన్న మా ఈ మొదటి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’ అని అన్నారు.

డైరెక్టర్ రమేష్ రాపర్తి మాట్లాడుతూ.. ‘జస్ట్ ఆర్డినరీ బ్యానర్ నుంచి థాంక్యూ బ్రదర్ అనే సినిమాను మొదటగా తీశాం. మళ్లీ ఓ కొత్త కథ చెప్పాలని అనుకున్నాం. కానీ కొత్తగా ఉండాలని అనుకున్నాం. సెల్‌ ఫోన్‌ కథ చెప్పాలని ఫిక్స్ అయ్యాం. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ సినిమా. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. పాటలు, కామెడీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. పాయల్‌ అందరి గుండెల్ని కొల్లగొడుతుంది. జూన్ 30న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘విరాజ్‌లో ఓ నటుడు ఉన్నాడని చెప్పిన బ్యానర్ ఇది. శరత్ చంద్ర గారికి ఓ మంచి నిర్మాతకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. థాంక్యూ బ్రదర్ సినిమా తరువాత ఓ బయోపిక్ చేద్దామని డైరెక్టర్ రమేష్‌ గారు పిలిచారు. ఫోన్ బయోపిక్ అని చెప్పడంతో షాక్ అయ్యాను. ఇందులో ఎన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయి. నా మనసుకు నచ్చిన పాత్ర ఇది. ఆడియెన్స్‌కు నచ్చుతుందని ఆశిస్తున్నాను. గుణ బాలసుబ్రహ్మణ్యం సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. సురేష్‌ గారి కెమెరా వర్క్ బాగుంటుంది. శ్యామల, సునీల్ గారి కాంబినేషన్ అందరినీ నవ్విస్తుంది. పాయల్ అందరినీ ఆకట్టుకుంటుంది. పాయల్ ఈ సినిమాలో పాయల్‌గానే కనిపిస్తుంది. జూన్ 30న ఈ సినిమాను రిలీజ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

పాయల్ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో ఈ సినిమా చాలా ముఖ్యమైంది. ఇదొక డిఫరెంట్ సినిమా. ఈ మూవీ మొత్తం కూడా ఫోన్ చుట్టూనే తిరుగుతుంది. ఆడియెన్స్‌ను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడింది. డైరెక్టర్ రమేష్ గారు కథ చెప్పడంతోనే వెంటనే ఓకే చెప్పాను. ఇందులో నేను హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ పాత్రలోనే కనిపిస్తాను. ఈ టీంతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. జూన్ 30న ఈ సినిమాను థియేటర్లో చూడండి’ అని అన్నారు.

రజత్ రాఘవ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూసిన ప్రతీసారి ఒక మంచి సినిమా తీశామనిపిస్తుంటుంది. జూన్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంత మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన రానా గారికి థాంక్స్. ఈ సినిమాను చూసి అందరూ థ్రిల్‌ ఫీల్ అవుతారు’ అని అన్నారు.

సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నేను అస్రా అనే పాత్రలో కనిపిస్తాను. ఇందులో కామెడీ అద్భుతంగా ఉంటుంది. పాటలు చాలా బాగుంటాయి. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన టీంకు థాంక్స్’ అని అన్నారు.

యాంకర్ శ్యామల మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్కరి దగ్గర ఉండే ఫోన్‌కు ఒక్కో కథ ఉంటుంది. ఆ ఫోన్‌ ఏమేం చేస్తుంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఫోన్ జర్నీని ఈ మూవీలో చక్కగా చూపించారు. నాది, సునీల్ గారి పాత్ర చాలా బాగుంటుంది. ఒకప్పుడు సునీల్ గారు ఎలా నవ్వించేవారో ఇప్పుడు మళ్లీ నవ్విస్తారు. టిక్ టాక్ కపుల్స్‌లా మేం చాలా ఫేమస్ అవుతాం. జూన్ 30న మా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

11 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago