వరుణ్ తేజ్ పాత్రను భారతీయ వైమానిక దళ పైలట్గా మేకర్స్ ఒక ఆసక్తికరమైన వీడియోతో పరిచయం చేసినప్పుడు ఈ తెలుగు-హిందీ యాక్షన్ డ్రామా సినీ ప్రేక్షకులలో క్యురియాసిటీని క్రియేట్ చేసింది. సినిమాపై అంచనాలని మరింత పైకి తీసుకువెళుతూ..సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ఇప్పుడు మరో ప్రత్యేకమైన అనౌన్స్ మెంట్ వీడియోతో మానుషి చిల్లర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలియజేసింది.
మానుషి చిల్లర్ (మిస్ యూనివర్స్ 2017, సామ్రాట్ పృథ్వీరాజ్) ఇందులో రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పాత్ర గురించి మానుషి మాట్లాడుతూ, “యాక్షన్తో నిండిన ఈ అద్భుతమైన సినిమా భాగమైనందుకు, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్తో కలిసి పని చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నాపై నమ్మకం వుంచిన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడాకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వరుణ్ తేజ్తో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం ఎక్సయిటింగా వుంది’’ అన్నారు
ఇంకా టైటిల్ ఖరారు కాని చిత్రం దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్టైనర్. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వైమానిక దళం ఎదుర్కొనే సవాళ్లను చూపనుంది.
అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, VFX లోదిట్ట అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రం ఈరోజు సెట్స్పైకి వెళ్లి తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతుంది.
VT13ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నాను. ఈ చిత్రానికి నందకుమార్ అబ్బినేని సహ నిర్మాత.
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…