రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియ జస్పర్, దీప్తి శ్రీరంగం హీరో హీరోయిన్స్ గా జి సినిమా బ్యానర్ పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న సినిమా “రుక్మిణి”. ఈ చిత్రానికి శ్రీమతి నేలబల్లి కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త హారర్ కామెడీ కథతో దర్శకుడు సింహాచలం గుడుపూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా “రుక్మిణి” మూవీ టీజర్ విడుదల చేశారు. అనంతరం

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ – రుక్మిణి సినిమా టీజర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో నిరంజన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా అతనికి మంచి సక్సెస్ ఇవ్వాలి. టీజర్ చూస్తుంటే డైరెక్షన్, డీవోపీ వర్క్, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నట్లు తెలుస్తోంది. “రుక్మిణి” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా అన్నారు.

హీరో నిరంజన్ మాట్లాడుతూ – మా “రుక్మిణి” మూవీ టీజర్ లాంఛ్ చేసిన మనోజ్ గారికి చాలా థ్యాంక్స్. ఆయన మా సినిమా టీజర్ బాగుందని చెప్పడం సంతోషంగా ఉంది. నాకు ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఒక డిఫరెంట్ హారర్ కామెడీ మూవీగా రుక్మిణి మీ అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు

హీరోయిన్ గ్రీష్మ నేత్రికా మాట్లాడుతూ – మేమంతా ఎంతో ప్యాషనేట్ గా చేస్తున్న చిత్రమిది. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి మూవీస్ చేస్తాం. మా మూవీ టీజర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ అందించిన మనోజ్ గారికి థ్యాంక్స్ అన్నారు.

హీరోయిన్ ప్రియ జాస్పర్ మాట్లాడుతూ – రుక్మిణి మూవీ టీజర్ లాంఛ్ చేసిన మనోజ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ మా మూవీకి ఉండాలి. వీలైనంత త్వరలో మీ ముందుకు రుక్మిణి చిత్రంతో రాబోతున్నాం అన్నారు.

యాక్టర్ విఖ్యాత్ మాట్లాడుతూ– ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. నటుడిగా నాకు మంచి పేరు తెచ్చే మూవీ అవుతుందని నమ్ముతున్నాం. రుక్మిణి మూవీ భయపెడుతూనే మీ అందరినీ నవ్విస్తుంది అన్నారు.

యాక్టర్ జయంత్ మాట్లాడుతూ– రుక్మిణి టీజర్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఈ సినిమాలోని స్ట్రాంగ్ కంటెంట్ మిమ్మల్ని ఆద్యంతం ఎంగేజ్ చేసేలా ఉంటుంది. కథా బలమున్న మా సినిమాను మీరు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ – రుక్మిణి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా సాంగ్స్, బీజీఎం మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. టీజర్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది అన్నారు.

నిర్మాత కట్టా గంగాధర్ రావు మాట్లాడుతూ – మా రుక్మిణి మూవీ టీజర్ ను మంచు మనోజ్ గారు రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. మోహన్ బాబుగారి సినిమాలకు అప్రెంటిస్ గా వర్క్ చేయడంతో నా కెరీర్ మొదలైంది. ఈ మూవీ కథను దర్శకుడు సింహాచలం చాలా బాగా చెప్పారు. అంతే బాగా రూపొందిస్తున్నారు. మా మూవీకి డీవోపీ వర్క్, అలాగే మ్యూజిక్ చాలా బాగుంటాయి. బీజీఎం మిమ్మల్ని ఆకట్టుకుంటంది. నిరంజన్, గ్రీష్మ నేత్రిక, ప్రియ జాస్పర్, విఖ్యాత్, జయంత్..ఇలా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మెప్పిస్తారు. త్వరలోనే రుక్మిణి సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు.

డైరెక్టర్ సింహాచలం గుడుపూరి మాట్లాడుతూ – కొత్త వారిని ఎంకరేజ్ చేయడంలో మంచు మనోజ్ గారు ఎప్పుడూ ముందుంటారు. మా మూవీ టీజర్ రిలీజ్ చేసి సపోర్ట్ చేసినందుకు ఆయనకు మా టీమ్ అందరి తరుపున థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ సినిమాతో హీరోగా నిరంజన్ కు మంచి పేరొస్తుంది. మా మూవీ ఇంత బాగా వచ్చిందంటే కారణం మా ప్రొడ్యూసర్స్. వారు ఎంతో ప్యాషనేట్ గా సినిమాను రాజీ పడకుండా నిర్మించారు. త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ తో మీ ముందుకు వస్తాం అన్నారు.

నటీనటులు – నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియ జస్పర్ , దీప్తి శ్రీరంగం, సింహ, విఖ్యాత్, జయంత్, తదితరులు

టెక్నికల్ టీమ్:
ఎడిటర్ – శ్రీకృష్ణ అట్టలూరి
డీవోపీ – తరుణ్ రావుల
మ్యూజిక్ డైరెక్టర్ – సుభాష్ ఆనంద్
సమ్పరణ – శ్రీమతి నేలబల్లి కుమారి సమర్పించు
బ్యానర్ – G సినిమా
ప్రొడ్యూసర్స్ – నేలబల్లి సుబ్రమణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు
రచన, దర్శకత్వం – సింహాచలం గుడుపూరి పీఆర్ఓ – చందు రమేష్

TFJA

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

2 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

7 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago