‘మళ్ళీ పెళ్లి’ లో ఎంటర్ టైన్మెంట్ & ఎమోషన్స్ ఉంటాయి


నవరసరాయ డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ లో పవిత్ర లోకేష్ కథానాయికగా నటిస్తున్నారు. మెగా మేకర్ ఎం ఎస్ రాజు రచన, దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌ పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మళ్లీ పెళ్లి మే 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేష్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

చాలా విరామం తర్వాత ‘మళ్ళీ పెళ్లి’ లో మళ్ళీ హీరోయిన్ గా చేయడం ఎలా అనిపించింది ?

నా కెరీర్ ప్రారంభం నుంచి పాత్రలపై దృష్టి పెట్టాను గానీ హీరోయిన్ గానే చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నా కెరీర్ మొదట్లోనే సుప్రసిద్ధ దర్శకులు గిరీష్ కాసరవెల్లి గారు నన్ను కథానాయికగా చేసి రెండు సినిమాలు చేయడం నా అదృష్టం. తర్వాత నాకు వచ్చిన, నచ్చిన పాత్రలు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ పెళ్లి లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. నరేష్ గారు చెప్పినట్లు .. హీరో హీరోయిన్ అనుకుంటే హీరో హీరోయిన్ అనుకోవచ్చు. ఎలా కన్సిడర్ చేస్తారనేది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను.

మళ్ళీ పెళ్లి బయోపిక్ అనుకోవచ్చా ?
బయోపిక్ అనేది చాలా పెద్ద వర్డ్. మళ్ళీ పెళ్లి కథ సమాజానికి అద్దం పడుతుంది. ఇలాంటి పరిస్థితులు, ఆలోచనలు సమాజంలో వున్నాయి. ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారు.

‘మళ్ళీ పెళ్లి’ సినిమా మీరు చేయడానికి కారణం ?
ఎంఎస్ రాజు గారు ఈ కథ చెప్పినప్పుడు నచ్చింది. నరేష్ గారు, నేను కలసి చేస్తేనే ఇది బాగుంటుందని అన్నారు. మా ఇద్దరికీ నచ్చి ఈ సినిమా చేశాం.

ఎంఎస్ రాజు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?  
ఇది చాలా అందమైన ప్రయాణం. రాజు గారి నిర్మాణంలో హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేశాను. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో చేయడం ఆనందంగా వుంది. ఆయన చాలా యూత్ ఫుల్,  ట్రెండీగా ఆలోచిస్తారు. ఈ కథని కూడా ట్రెండీగా ప్రజెంట్ చేశారు.

ఇందులో చాలా బోల్డ్ కంటెంట్ ఉంటుందని రాజు గారు చెప్పారు కదా ?
మనం సమాజంలో కొన్ని కండీషన్ పెట్టుకొని వుంటాం. దాన్ని దాటితే బోల్డ్ అంటాం. ఈ రకంగా చూసుకుంటే ఇందులో చాలా బోల్డ్ వుంటుంది.

ఇది నిజమైన కథ?  ఫిక్షనా ?
ఇది కల్పితమా? యాదార్ధమా? అనేది ఇప్పుడు చెప్పలేను. సినిమా చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది.

జీవితంలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బావుండాలనే సందేశం లాంటిది ఇస్తున్నారా ?
అలాంటి సందేశం అయితే వుంది. ఎవరైనా అదే కోరుకుంటారు కదా.

ఇది ఎవరికైనా టార్గెట్ చేయడానికి తీసిన సినిమానా ?
లేదండీ. ఒకరిని టార్గెట్ చేయడానికి సినిమా తీయాల్సిన అవసరం లేదు.

నరేష్ గారిలో మీకు నచ్చిన లక్షణాలు ?
నరేష్ గారు ఎంత సీరియస్ విషయాన్ని అయినా చాలా లైట్ తీసుకొని దానికి ఏం కావాలో చాలా సీరియస్ గా చేస్తారు. ఆ క్వాలిటీ నాలో లేదు. నేను చిన్న చిన్న విషయాలని కూడా సీరియస్ గా తీసుకుంటాను. నరేష్ గారు ఈ రోజు గురించే ఆలోచిస్తారు. ఈ రోజు తమకి ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. రేపు అనేది రాని చూసుకుందామంటారు. ఈ క్యాలిటీ ఆయనలో నేర్చుకున్నాను. అన్నిటికన్నా ఆయన నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దీని కంటే కావాల్సింది ఏముంది. ఈ విషయంలో చాలా ఆనందంగా వుంది.

మళ్ళీ పెళ్లి అనే పదాన్ని సమాజం ఇప్పటికీ తక్కువగానే చూస్తుంది ? దీనిపై మీ అభిప్రాయం?
ఇదొక్కటే కాదు సమాజంలో చాలా నిబంధనలు ఉంటాయి. అయితే సమాజంలో ఎవరు ఎవరిని సరిచేయలేరు. ఎవరి ఆలోచన, అభిప్రాయాలతో వాళ్ళు ఉంటారు. మా విషయంలో కొన్ని సంఘటనలు జరిగాయి. నా విషయానికే వస్తే .. కొందరు పరిస్థితులని అడ్డుపెట్టుకొని చాలా తప్పుగా చూపారు. నా వ్యక్తిత్వ హననం చేసి, నా కెరీర్ పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశారు. దీని నుంచి బయటికి రావడం చాలా కష్టం.  నేను ఒంటరిగా వుంటే ఆత్మహత్య చేసుకోవాలి లేదా ఇంట్లో కూర్చోవాలి. నేను బయటికివచ్చానంటే కారణం నరేష్ గారు..నా వెనుక బలంగా నిల్చున్నారు. నేను ఉన్నానని చెప్పారు. దేనికీ  భయపడలేదు. నేను ఒక్క అడుగు వెనకి వేసినా పరిస్థితి దారుణంగా వుండేది. నరేష్ గారు చాలా సపోర్ట్ గా వున్నారు.

విజయ నిర్మల గారిని కలిశారా?
విజయ నిర్మల గారిని కలిశాను. కానీ మేము కలిసినప్పుడు విజయ నిర్మల గారి ఆరోగ్యం అంతగా బాలేదు. ఆమెతో  ఎక్కువ సమయం గడిపే అవకాశం రాలేదు. కానీ కృష్ణ గారితో చాలా సమయం గడిపాం. ఆయనతో మాట్లాడటం, ఎన్నో విషయాలని పంచుకోవడం జరిగింది. ఈ విషయంలో అదృష్టంగా భావిస్తున్నాను. మహేష్ బాబు గారిని కూడా కలిశాను. ఫ్యామిలీ మమ్మల్ని యాక్సప్ట్ చేసింది.

మళ్ళీ పెళ్లి సినిమా గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు ?
చాలా మంచి మ్యూజిక్ వుంది. సినిమాని చాలా అద్భుతంగా ప్రజంట్ చేశాం. కథ పరంగా సమాజంలోని పరిస్థితులని డీల్ చేశారు. కామెడీ, ఎంటర్ టైన్మెంట్, హై ఎమోషన్ వున్న చిత్రం మళ్ళీ పెళ్లి. ప్రేక్షకులు చాలా ఆసక్తికరంగా చూసి ఎంజాయ్ చేస్తారు.

విజయ కృష్ణ మూవీస్  లో మీ పాత్ర ఎలా వుంటుంది ?
ఇందులో వర్క్ చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా నా భాగస్వామ్యం వుంటుంది.

మళ్ళీ ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఎలా అనిపించింది ?
ఇది వరకు చాలా సార్లు చూశాను. కానీ ఫైనల్ కాపీ చూసినప్పుడు అసలు సెకండ్ హాఫ్ ఎలా వెళ్ళిపోయిందో తెలియనే తెలీదు. అంత అద్భుతంగా వచ్చింది.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. అలాగే నితిన్ సినిమా చేస్తున్నాను. ఇంకొన్ని కథలు వింటున్నాను.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

4 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

5 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago