ఫిబ్రవరి 7 థియేటర్స్ లో దుల్లకొట్టేద్దాం హీరో అక్కినేని నాగచైతన్య

-తండేల్ టీజర్ ట్రైలర్ సాంగ్స్ లో ఎమోషనల్ కనెక్ట్ కనిపిస్తోంది. సినిమా బిగ్ హిట్ కావాలని కోరుకుంటున్నాను: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ రోజు ‘తండేల్’ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

‘తండేల్’ జాతర ఈవెంట్ లో హీరో అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ..అతిధులకు. ప్రేక్షకులకు,అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన సందీప్ రెడ్డి వంగా గారికి థాంక్. అరవింద్ గారు వాసు లేకుండా నెక్స్ట్ సినిమా ఎలా ఫినిష్ చెస్తాననే భయం పట్టుకుంది. వారు సినిమాలో అంతలా కాంట్రిబ్యుట్ చేస్తారు. గీత ఆర్ట్స్ పేరు నా కెరీర్ లో టాప్ లో వుంటుంది. తండేల్ నా కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ.తండేల్ రాజు కి నాకు రియల్ లైఫ్ లో చాలా డిఫరెన్స్ వుంటుంది. ఈ క్యారెక్టర్ నేను చేయగలనని నమ్మిన వాసు, చందుకి థాంక్ యూ. క్యారెక్టర్ లోకి ట్రాన్స్ ఫర్మేషన్ అవ్వడానికి చాలా టైం ఇచ్చారు. చందు తో ఇది మూడో సినిమా. నన్ను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తాడు. సాయి పల్లవి అద్భుతమైన నటి. తనని అందరూ ఇష్టపడతారు. తను చాలా పాజిటివ్ పర్శన్. ఈ సినిమాకి ట్రూ రాక్ స్టార్ దేవి. చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు. డీవోపీ శాం గారు ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు లిరిక్ రైటర్స్ టీం అందరికీ థాంక్ యూ. శ్రీకాకులం వచ్చిన మత్సకారుల కుటుంబాలకి ధన్యవాదాలు. వారి వలనే నా క్యారెక్టర్ కి ఒక ఐడియా వచ్చింది. వారికి సముద్రం తప్పితే మరొకటి తెలీదు. వారు లేకపోతే ఈ సినిమా లేదు. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఫిబ్రవరి 7 థియేటర్స్ లో దుల్లకొట్టేద్దాం’అన్నారు

హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన డ్యాన్స్ చేస్తూనే సాంగ్స్ కంపోజ్ చేస్తారు. అందుకే పాటల్లో అంత ఎనర్జీ వుంటుంది. ఇందులో బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. శ్యాం దత్ గారు విజువల్స్ ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. నాగేంద్ర గారు ప్రతి సెట్ కి లైఫ్ తీసుకొచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. అరవింద్ గారు నాకు తండ్రిలాంటి వారు. బన్నీవాసు గారు చాలా పాషన్ తో సినిమాని చేశారు. వారి నిర్మాణంలో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. సందీప్ రెడ్డి వంగా గారు ఫిల్టర్ లేకుండా మాట్లాడతారు. ఫిలిం మేకర్ కి ఆ వాయిస్ వుండాలి. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. చైతన్య గారు ఈ సినిమా కోసం చాలా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. ఈ సినిమా కోసం ఆయనలో ఓ ఆకలి కనిపించింది. చాలా హార్డ్ వర్క్ చేశారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన అందరికీ థాంక్ యూ. మేము మీ సినిమానే తీశాం. చాలా మంచి సినిమా ఇది. మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘తండేల్’ ట్రైలర్ టీజర్ సాంగ్స్ ఏది చూసి సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ కనిపిస్తోంది. సాయి పల్లవి చైతన్య గారి కెమిస్ట్రీ చాలా రియల్ గా అనిపిస్తోంది. బన్నీ వాసు గారి ఆల్ ది వెరీ బెస్ట్. కేడీ సినిమాకి వర్క్ చేసినప్పుడు చైతన్య గారు సెట్స్ కి వచ్చేవారు. అప్పుడే ఆయన నాకు చాలా నచ్చారు. ఆయన బయట వేసుకునే కాస్ట్యుమ్స్ నా సినిమాలకి రిఫరెన్స్ గా చూపిస్తాను. దేవిశ్రీ సర్ మ్యూజిక్ కి హ్యాట్సప్. ప్రేమమ్ సినిమా నుంచి సాయి పల్లవి గారి నటన అంటే ఇష్టం. తను అప్పటికీ ఇప్పటికీ ఒకేలా వున్నారు. చందు నాకు ఆరేళ్ళుగా తెలుసు. ఈ కథ నాకు తెలుసు. అక్కినేని ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా వుంటుంది. సూపర్ హిట్ ఫిల్మ్ అనే ఫీలింగ్ వుంది. చైతన్య గారి మజిలీ సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చాను. అది పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 7 థియేటర్స్ లో దుల్లకొట్టేద్దాం.. మీరంతా రావాలి. చాలా కాన్ఫిడెన్స్ చెబుతున్నా, సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడతాను’ అన్నారు.

దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. చందు గారు సినిమాని అద్భుతంగా తీశారు. వాసు సినిమాని చాలా ఉన్నతంగా నిర్మించారు. చైతన్య ట్రాన్స్ఫర్ మేషన్ చాలా ఫెంటాస్టిక్ వుంది. ఇది ఆయన కెరీర్ చాలా డిఫరెంట్ మూవీ. సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ అమేజింగ్. వీరి కెమిస్ట్రీ అద్భుతంగా వుంటుంది. టెక్నిషియన్స్ అందరూ వండర్ ఫుల్ గా వర్క్ చేశారు. అందుకే బీజీఎం ఇంత గొప్పగా వచ్చింది. లిరిక్ రైటర్స్ శ్రీమణి జొన్న విత్తుల గారికి, సింగర్స్ కి థాంక్ యూ. ఫెబ్రవరి 7న సినిమా చూసి సూపర్ హిట్ చేయండి’ అన్నారు

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మంచి కథ. ఆ కథని ప్రేక్షకులు దగ్గరికి తీసుకెళ్ళే దర్శకుడు చందు. మంచి టీం. బన్నీ వాసు లాంటి మంచి నిర్మాత. ఆయన వెనుక అరవింద్ గారి సపోర్ట్. సాయి పల్లవి పాజిటివ్ ఎనర్జీ. చైతన్య కథని క్యారెక్టర్ ని పట్టుకొని కష్టపడ్డారు. ఇంతమంది కష్టపడిన తర్వాత సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది. జనవరిలో మేము కొట్టాం. ఫెబ్రవరి లో మీరు కొడుతున్నారు. ఆల్ ది బెస్ట్ హోల్ టీం’ అన్నారు.

నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. సందీప్ గారికి దిల్ రాజు గారికి థాంక్ యూ సో మచ్. ఇది నా కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ సినిమా. దిల్ రాజు గారు సందీప్ గారు లాంటి పాజిటివ్ సక్సెస్ ఫుల్ పీపుల్ ఈవెంట్ కి విష్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా యూనిట్ అందరికీ థాంక్ యూ. దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికీ మూడు సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరో సాంగ్ రాబోతోంది. డైరెక్టర్ చందు చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు. నా ఫస్ట్ సినిమా చైతన్య గారితో స్టార్ట్ చేశాను. నా హయ్యస్ట్ బడ్జెట్ సినిమా ఆయన చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా చైతన్య గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఈ సినిమా ఆయనకి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. సినిమా చూసి ఆయన నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. సాయి పల్లవి గారు మెస్మరైజింగ్ యాక్టర్. ఇంత మందికి లైఫ్ ఇచ్చిన అరవింద్ గారికి థాంక్ యూ’ అన్నారు.

ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మాట్లాడుతూ.. అరవింద్ గారు చేసే సినిమాలన్నీ మాకు ఎంతో ఇన్స్ ప్రెషన్ ఇస్తూ వుంటాయి. ఈ సినిమా ఏడాదిగా సౌండ్ చేస్తుంది. ఫెబ్రవరి 7 నుంచి రీసౌండ్ చేస్తుంది. సాయి పల్లవిగారికి పెద్ద ఫ్యాన్. దేవిశ్రీ గారు గత ఏడాది ఓ జాతర చేశారు. దానికి పాన్ ఇండియా షేక్ అయ్యింది. ఇప్పుడు మరో జాతర చేయబోతున్నారు. వాసు చాలా మంచి అభిరుచి వున్న నిర్మాత. తను చేసే సినిమా హిట్ అవ్వాలి. చైతు గారు క్లాస్ మాసు కలిపి చితకొట్టేయబోతున్నారు. ఈ సినిమా చైతు గారి కెరీర్ లో త్రీ డిజిట్. ఈ సినిమా అమలాపురం నుంచి అమెరికా వరకూ రికార్డ్ ఓపెనింగ్స్ తో షేక్ చేయబోతుంది. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్’ అన్నారు.

కో ప్రొడ్యూసర్ భాను ప్రతాప్ మాట్లాడుతూ.. ఈ కథ నా మనసుకి చాలా దగ్గరైయింది. మత్సకారుల సపోర్ట్ ని మర్చిపోలేను. వారి కథనే సినిమాగా తీశాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చందు గారు ఈ కథని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. బన్నీ వాస్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. అల్లు అరవింద్ గారు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. చైతన్య గారితో జర్నీ మర్చిపోలేను. సాయి పల్లవి గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ. దేవిశ్రీ ట్రెండింగ్ సాంగ్స్ ఇచ్చారు. సినిమా పెద్ద విజయం సాధించబోతుంది’అన్నారు

కో ప్రొడ్యూసర్ రియాజ్ చౌదరి మాట్లాడుతూ.. గీత ఆర్ట్స్ తో ఇది నా థర్డ్ కొలాబరేషన్. అరవింద్ గారికి థాంక్ యూ. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ నాగ్రేంద్ర మాట్లాడుతూ.. దర్శకుడు ఈ కథ చెప్పినపుడు ఒక మత్సకారుడిలో సైనికుడి కనిపించాడు. ఈ కథతో అందరం కనెక్ట్ అయ్యాం. ఈ సినిమా అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నా టీం అందరికీ థాంక్ యూ. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’ అన్నారు.

సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ మాట్లాడుతూ.. దర్శక నిర్మాతలకు థాంక్ యూ. నాగ చైతన్య గారి సినిమాకి పని చేయాలనే కోరిక వుండేది. అది ఈ సినిమాతో తీరింది. సాయి పల్లవి గారు అద్భుతమైన నటి. ఇది బ్యూటీఫుల్ మూవీ. నా విజువల్స్ ని అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది సూపర్ డూపర్ హిట్ మూవీ.

లిరిక్ రైటర్ శ్రీమణి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇందులో మొత్తం మూడు పాటలు రాశాను. బుజ్జి తల్లి హైలెస్సో పాటలకు చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీప్రసాద్ గారు అన్ని పాటలను చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. డైరెక్టర్ గారు కథలోని ఆత్మని పట్టుకుని లిరిక్స్ రాయించారు. మొట్టమొదట నేను పాటలు రాసిన సినిమా 100% లవ్. నాగచైతన్య గారితో అప్పటినుంచి జర్నీ ఉంది .గీత ఆర్ట్స్ బన్నీ వాసు గారు నా హోం బ్యానర్ గా భావిస్తాను. ప్రతి సినిమాకి పిలిచి పాట రాయిస్తారు. నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు థాంక్యూ సో మచ్. టీమ్ అందరికీ శుభాకాంక్షలు. ఫిబ్రవరి 7న థియేటర్స్ లో కలుద్దాం’అన్నారు

లిరిక్ రైటర్ జొన్నవిత్తులు మాట్లాడుతూ.. ఈ సినిమాలో పరమేశ్వరుని మీద ఒక పాట రాశాను. ఈ పాట ఒక పరమాద్భుతం. పదివేల సినిమా పాటల్లో ఇలాంటి పాట ఒకటి ఉంటుంది. వందల సంవత్సరాలు ఉండిపోయే పాట ఇది. ఈ పాటకు పరమాద్భుతంగా సంగీతం సమకూర్చారు దేవిశ్రీప్రసాద్. ఈ సినిమాలో ఒక రెండు సీన్లు చూశాను. నాగచైతన్య ఇంతక ముందుండే సినిమాలకి దీనికి చాలా తేడా ఉంది. చాలా అద్భుతమైనటువంటి నటన కనబరిచారు. చైతన్య మూర్తిభవించినట్లుగా ఉన్నారు. ఖచ్చితంగా అద్భుతమైన సినిమా అవుతుంది. ఇప్పటివరకు వచ్చిన అద్భుతమైన పది ప్రేమ కథలో ఈ సినిమా కూడా ఉంటుంది. అంత అద్భుతంగా దర్శకుడు చందు ఈ సినిమాని తీర్చిదిద్దారు. దైవభక్తి దేశభక్తి ప్రేమ అన్ని కలగలిసిన సినిమా ఇది. ఇలాంటి అద్భుతమైన సినిమాలలో ఈ పాట రాయడం నాకు చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లో అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు

యాక్టర్ మహేష్ మాట్లాడుతూ..నాకు ఈ సినిమాలో మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరో గారికి అందరికీ థాంక్ యూ. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’ అన్నారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

14 hours ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

2 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago