“లగ్గం మూవీ జెన్యూన్ హిట్, ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు”

రమేశ్ చెప్పాల దర్శకత్వంలో సాయి రోనాక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం లగ్గం. మంచి కుటుంబ కథా చిత్రంగా పెళ్లి నేపథ్యంలో దర్శకుడు రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుబిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 25న థియేటర్లలో విడుదలైన లగ్గం చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ చిత్రంతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు,ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, రోహిణి , ఎల్బీ శ్రీరామ్ కీలక పాత్రల్లో నటించారు. 

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…
లగ్గం చిత్రం జెన్యూన్ హిట్. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ ని రెండు రోజుల నుంచి గమనిస్తున్నా. ఈ క్రెడిట్ మొత్తాన్ని తన సోదరుడు లాంటి దర్శకుడు రమేష్ చెప్పాలకి ఇస్తాను.” అన్నారు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ ఇంజనీర్ అల్లుడుగా కావాలని కోరుకోవడం అనేది సమకాలీన సమస్య! ప్రజెంట్ జనరేషన్ ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్ని ఆదరిస్తున్నారు” అని తెలిపారు. మీడియా మిత్రులు,క్రిటిక్స్ అంతా ఫోన్ చేసి మెసేజ్ పెట్టి _మంచి ఫీల్ గుడ్ మూవీ’ అని చెబుతుంటే సంతోషంగా ఉంది.” అని రాజేంద్ర ప్రసాద్ గారు తెలిపారు. 

దర్శకుడు రమేశ్ చెప్పాల మాట్లాడుతూ లగ్గం చిత్రం కోసం తాను తొమ్మిది నెలల పాటు ప్రతి రోజు పద్దెనిమిది గంటలు కష్టపడ్డాను. ఈ ప్రయాణంలో నాకు ఎంతో మద్దతుగా నిలిచిన చిత్ర యూనిట్, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. చాలా చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంది. అంటున్నారు ప్రేక్షక దేవుళ్లకు నా కృతజ్ఞతలు.

నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ
“లగ్గం సినిమాకు వస్తోన్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఎలాంటి అశ్లీలత లేకుండా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు వచ్చింది, ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన నటీనటులకు ముఖ్యంగా డైరెక్టర్ రమేష్ చెప్పాల గారికి అభినందనలు.. ఒక మంచి సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి, లగ్గం సినిమాను ప్రతి ఫ్యామిలీ తప్పకుండా చూడాలి, ఎమోషన్స్, బంధాలు, అనుబంధాలు ఈ సినిమాలో చక్కగా చూపించడం జరిగిందని” అన్నారు.

హీరో సాయిరోనక్ మాట్లాడుతూ “ఈ లగ్గం చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నా కెరీర్ లో ఇది ఫస్ట్ మైల్ స్టోన్ మూవీ. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు రమేశ్ చెప్పాల నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు.” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రచ్చ రవి కృష్ణుడు కిరీటి మాణిక్ రెడ్డి చరణ అర్జున్, బొంతల నాగేశ్వర్ రెడ్డి, సంధ్య గంధం, వీవారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ చిత్రం విజయోత్సవ వేడుక లగ్గంలాగే ఘనంగా జరిగింది.

ఈ చిత్రానికి కథ – మాటలు – స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి, నేపధ్య సంగీతం: మణిశర్మ, కెమెరామెన్: బాల్ రెడ్డి. సంగీతం:చరణ్ అర్జున్. ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి. కొరియోగ్రఫీ: అజయ్ శివశంకర్.

Tfja Team

Recent Posts

ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్‌ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

3 hours ago

ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’,…

17 hours ago

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన హీరో సత్యదేవ్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నూతన చిత్రం

హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ…

21 hours ago

మే 1న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నెక్ట్స్ మూవీ “సమ్మర్ హాలిడేస్”

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…

22 hours ago

పాన్‌ సౌత్ స్టార్‌తో సైకాలజికల్ థ్రిల్లర్.. అనుపమ పరమేశ్వరన్ కొత్త మూవీ అనౌన్స్!

పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో కొత్త ఫీచర్ ఫిల్మ్‌ను ఎస్ కే…

22 hours ago

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ ఫిబ్రవరి 27న థియేటర్స్ లో విడుదల !!!

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

24 hours ago