కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం ‘క’. తన్వీరామ్, నయన సారిక హీరోయిన్స్గా నటించిన ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకులు. చింతా గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న బన్నీవాస్ ‘క’ టీమ్ను అభినందించారు. ఆయన మాట్లాడుతూ ”నాకు మనస్పూర్తిగా అనిపిస్తే తప్ప నేను ఇలాంటి వేడుకలకు రాను. ఈసినిమా గురించి మనస్పూర్తిగా మాట్లాడాలి అని అనుకున్నాను. అందుకే వచ్చాను. నాకు ఈ సినిమా నిజంగా బాగా నచ్చింది. నేను ఎన్నో కథలు విన్నాను. ఎన్నో వందల కథలు వినడం వల్ల సినిమా గురించి ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ సినిమా క్లైమాక్స్ నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఇలాంటి పతాక సన్నివేశాలు వస్తాయని నేను గెస్ చేయలేదు. ఈ మధ్య కాలంలో గ్రేట్ స్క్రీన్ప్లే ఇది. స్క్రీన్ప్లేలో చిన్న తప్పు కూడా లేదు.. ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ స్క్రీన్ప్లే ఇది. పతాక సన్నివేశాల్లో ఈ సినిమా స్క్రీన్ప్లే విషయంలో క్లాప్స్ పడ్డాయి. మీరు ఎంత గొప్ప రచయిత అయినా ఈ సినిమా క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మీరు దేవుళ్లతో సమానం.ఈ సినిమాలో పనిచేసిన అందరికి శుభాకాంక్షలు. అందరికి మంచి భవిష్యత్ వుండాలని కోరుకుంటున్నాను.ఈ నిర్మాత గట్స్ అభినందనీయం. ఈ సినిమా బడ్జెట్ విని షాక్ అయ్యాను. కిరణ్, వంశీ నాకు నా మనసుకు దగ్గరయిన వ్యక్తులు. వంశీ నందిపాటి నాకు రేట్ చెప్పకుండా కొన్నాడు.
రేట్ తెలిసి షాక్ అయ్యాను. నాకు కూడా ఈ నెంబర్ తెలిసి కంగారు పడ్డాను. సినిమా చూసిన తరువాత వీళ్ల క్యాలికేలేషన్స్ వంశీ నమ్మకం నిజమైంది. వంశీ సినిమాను నమ్మాడు కాబట్టే ఈ రోజు డబ్బులు వచ్చాయి. సినీ పరిశ్రమలో ఛాన్స్ క్రియేట్ చేసుకున్న వ్యక్తులు ఎదుగుతారు. కిరణ్ అవకాశం క్రియేట్ చేసుకున్నాడు.కిరణ్ చాలా కషపడ్డాడు. చాలా మంది కిరణ్ పడిపోయాడు. ఇక పని అయిపోయింది అన్నారు. కానీ అతను ఫైట్ ఆపలేదు. ఆట ఓడిపోవడం అంటే ఆ ఆటగాడు ఆటను వదిలేసినప్పుడే కిరణ్ ఎప్పుడు సినిమాను వదల్లేదు. అందుకే కిరణ్ గెలిచాడు. కిరణ్ ను చూస్తే ఇన్స్పిరేషన్ వస్తుంది. సక్సెస్ పాయింట్ వద్దకు వెళ్లే వరకు ఫైట్ చేయాలి. ఈ టీమ్ మరిన్ని విజయాలు అందుకోవాలి అన్నారు.
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…