డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ధీరన్ అధిగారం ఒండ్రు, అరువి, ఖైదీ, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి ప్రతిష్టాత్మక సినిమాలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అద్భుతమైన కథలతో, ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న హీరో కార్తి. ఇప్పుడు, కార్తీ, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ #కార్తీ 29కి డైరెక్టర్ చేయడానికి కి టాలెంటెడ్ డైరెక్టర్ తమిళ్ని ఎంచుకున్నారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన తానాఅక్కరన్తో మూవీతో తమిళ్ అందరినీ ఆకట్టుకున్నారు.
ఎస్ఆర్ ప్రకాష్బాబు, ఎస్ఆర్ ప్రభు నేతృత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, కార్తీ కలిసి తీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్ వంటి క్లాసిక్ బ్లాక్బస్టర్లను అందించడంతో పాటు కాష్మోరా, జపాన్ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో అలరించారు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
మాగ్నమ్ ఓపస్ #కార్తీ29ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్తో పాటు, ఇషాన్ సక్సేనా, సునీల్ షా, రాజా సుబ్రమణియన్ నేతృత్వంలోని ఐవీ ఎంటర్టైన్మెంట్, B4U మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తాయి.
ఈ సినిమాను 2025లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. #కార్తీ29 ఇతర తారాగణం, టెక్నికల్ టీం అప్డేట్లను ప్రొడక్షన్ హౌస్ త్వరలో తెలియజేస్తుంది.
తారాగణం: కార్తీ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: తమిళ్
నిర్మాతలు: SR ప్రకాష్ బాబు, SR ప్రభు, ఇషాన్ సక్సేనా, సునీల్ షా , రాజా సుబ్రమణియన్
బ్యానర్లు: డ్రీమ్ వారియర్ పిక్చర్స్, ఐవీ ఎంటర్టైన్మెంట్, B4U మోషన్ పిక్చర్స్
పీఆర్వో: వంశీ-శేఖర్
‘ఒక్కడు’ సినిమాకి మహేష్ బాబు కరెక్ట్, ‘వర్షం’కి ప్రభాస్ కరెక్ట్, 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'కి సిద్ధార్థ్ కరెక్ట్, ‘మనసంతా నువ్వే’కి ఉదయ్…
-ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు కొండల్ "కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, "సిద్ధార్థ్ రాయ్"…
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…
-త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న మూవీ ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో…
విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్ 'కాళాంకి భైరవుడు' ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ…
ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ పై ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది.…