పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ “జిన్”

అమిత్ రావ్ హీరోగా నటిస్తున్న సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ “జిన్”. ఈ చిత్రాన్ని సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్స్ పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందిస్తూ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. చిన్మయ్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలను పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్రాజ్ వాడి పోషిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో పూజా కార్యక్రమాలతో జిన్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా…ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. రాజ్ కందుకూరి, రామజోగయ్య శాస్త్రి స్క్రిప్ట్ ను అందచేశారు. ఈ సందర్భంగా

లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ – ఈ చిత్రానికి డైలాగ్స్ రాసిన వరదరాజ్ నాకు మంచి మిత్రుడు. పాన్ ఇండియా చిత్రాలు కన్నడలో రిలీజైతే ఆయనే రైటర్ గా వర్క్ చేస్తుంటారు. జిన్ సినిమాకు వరదరాజ్ గారు కో ప్రొడ్యూసర్ గా చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాను కన్నడ తెలుగు బైలింగ్వల్ మూవీగా రూపొందిస్తున్నారు. రెండు భాషల్లో సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. జిన్ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – జిన్ సినిమా టైటిల్ బాగుంది. సస్పెన్ హారర్ థ్రిల్లర్ జానర్స్ కు పోటీ తక్కువగా ఉంటుంది. మంచి కంటెంట్ ఉంటే ఈ సినిమాలతో సులువుగా ప్రేక్షకులకు రీచ్ కావొచ్చు. అలాంటి స్ట్రాంగ్ కంటెంట్ ఈ మూవీలో ఉందని నమ్ముతున్నా. వరదరాజ్ గారు మంచి రైటర్. అమిత్ రావ్ హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలి. డైరెక్టర్ చిన్మయ్ రామ్ తో పాటు టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు.

డైలాగ్ రైటర్, కో ప్రొడ్యూసర్ వరదరాజ్ చిక్కబళ్లాపుర మాట్లాడుతూ – మేము పిలవగానే మా జిన్ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి, గురువు లాంటి రామజోగయ్య గారికి థ్యాంక్స్. సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ మూవీస్ ఎన్నో చూసి ఉంటాం. కానీ జిన్ కథ విన్నప్పుడు ఇది కొత్తగా ఉంది అనిపించింది. ఈ సినిమాకు డైలాగ్స్ రాయడంతో పాటు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించాను. అమిత్ రావ్ మంచి పర్ ఫార్మర్. డైరెక్టర్ చిన్మయ్ రామ్ టాలెంటెడ్ టెక్నీషియన్. త్వరలోనే జిన్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాం. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. అన్నారు.

నిర్మాత నిఖిల్ ఎమ్ గౌడ మాట్లాడుతూ – జిన్ సినిమాను తెలుగు, కన్నడ బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నాం. వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం.

నటుడు అమ్రిత్ సాగర్ మాట్లాడుతూ – జిన్ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు రాజ్ కందుకూరి గారికి, రామజోగయ్య శాస్త్రి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఒక మంచి సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ కథతో మూవీ చేస్తున్నాం. నేను గతంలో చిన్న రోల్స్ చేశాను. ఈ చిత్రంలో లీడ్ రోల్ తో మీ ముందుకు రాబోతున్నాను. ప్రేక్షకులందరికీ నచ్చేలా జిన్ సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అన్నారు.

డైరెక్టర్ చిన్మయ్ రామ్ మాట్లాడుతూ – జిన్ సినిమా డైరెక్టర్ గా నాకు ఫస్ట్ మూవీ. నా స్నేహితుడు పర్వీజ్ తో కలిసి స్క్రిప్ట్ రెడీ చేశాను. ఇదొక మంచి కథ. స్క్రిప్ట్ పర్పెక్ట్ గా వచ్చేందుకు చాలా టైమ్ తీసుకున్నాం. ఇక్కడే హైదారాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, నాకు సపోర్ట్ చేస్తున్న టీమ్ అందరికీ థ్యాంక్స్. మీ సహకారం మా టీమ్ కు ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరో అమిత్ రావ్ మాట్లాడుతూ – ఈ రోజు మా జిన్ మూవీ లాంఛ్ కు గెస్ట్ లుగా వచ్చిన రామజోగయ్య గారికి, రాజ్ కందుకూరి గారికి థ్యాంక్స్. జిన్ సినిమా స్క్రీన్ ప్లే కాంప్లికేటెడ్ గా ఉంటుంది. మంచి విజువల్స్ తో సినిమా చేయబోతున్నాం. డైరెక్టర్ చిన్మయ్ రామ్ గారి మీద మాకు బాగా నమ్మకం ఉంది. ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్ తో హీరోగా మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. అన్నారు.

నటీనటులు – అమిత్ రావ్, పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్రాజ్ వాడి, భార్గవ రామ్, భగీరథ్, అప్పన్న, ప్రకైత్, సందీప్, అభిజీత్, రాజ్ ఉదయ్, అమ్రిత్ సాగర్, తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – కీర్తి రాజ్ డి
సినిమాటోగ్రఫీ – సునీల్ హొన్నాళి
సంగీతం – అలెక్స్
డైలాగ్స్, కో ప్రొడ్యూసర్ – వరదరాజ్ చిక్కబళ్లాపుర
పీఆర్ఓ – ఎస్ఆర్ ప్రమోషన్స్ ( సాయి సతీష్, పర్వతనేని రాంబాబు )
కథ స్క్రీన్ ప్లే – పర్వీజ్ సింభ
నిర్మాత – నిఖిల్ ఎమ్ గౌడ
దర్శకత్వం – చిన్మయ్ రామ్

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

16 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago