వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఈ సినిమా దసరా సందర్భంగా ‘జనక అయితే గనక’ అక్టోబర్ 12న విడుదల కానుంది. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్లు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్లో మంచి బజ్ను క్రియేట్ చేశాయి. రీసెంట్గా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. గురువారం నాడు ఏర్పాటు చేసిన ఈవెంట్లో..
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఇప్పటికే మా సినిమాను చాలా మందికి షో వేశాం. ఆ రియాక్షన్సే ఇప్పుడు మీడియాకు చూపించాను. త్వరలోనే మీడియాకి కూడా షో వేస్తాను. మీడియా ముందుగా షో వేయాలంటే కాస్త భయంగానే ఉంటుంది. కానీ మంచి సినిమాను తీశాం కాబట్టి.. మీడియాకు ముందుగానే షో వేస్తాను. సినిమా హిట్ అయితే అందరికీ సంతోషంగా ఉంటుంది. అక్టోబర్ 6న విజయవాడలో పబ్లిక్ షో వేస్తున్నాం. 8వ తేదీని తిరుపతిలో షో వేస్తున్నాం. హ్యాపీ డేస్, శతమానం భవతి చిత్రాలు ఓవర్సీస్లో ముందుగా రిలీజ్ చేశాను. ఆ సెంటిమెంట్తోనే ఇప్పుడు కూడా ఈ మూవీని ముందుగా అంటే అక్టోబర్ 10న ఓవర్సీస్లో రిలీజ్ చేస్తున్నాను. 11న ఇక్కడ ప్రీమియర్లు వేసి.. 12న గ్రాండ్గా రిలీజ్ చేయనున్నాం. నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తయింది. డిజిటల్, హిందీ డబ్బింగ్, ఓటీటీ ఇలా అన్నీ కూడా పూర్తయ్యాయి. మా సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. అందరినీ అలరించేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘మా చిత్రం అక్టోబర్ 12న రాబోతోంది. అందరూ చూడండి. ఏ ఒక్కర్నీ కూడా నిరాశ పర్చదు. ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్లంతా కూడా బాగుందని చెబుతున్నారు. ఆడియెన్స్ ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారా? అని అక్టోబర్ 12 కోసం వెయిట్ చేస్తున్నాను. ఓవర్సీస్లో మా చిత్రం అక్టోబర్ 10న విడుదల కాబోతోంది’ అని అన్నారు.
హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సందీప్ రెడ్డి ఈ కథను కరోనా టైంలో చెప్పాడు. ఇలాంటి పాయింట్తో అంటే దిల్ రాజు గారు ఒప్పుకుంటారా? లేదా? అని సందీప్ అనుకున్నారు. కానీ దిల్ రాజు గారెకి ఓ ఐదు నిమిషాలు చెప్పడం, ఆ పాయింట్ నచ్చడంతో ముందుకు జరిగింది. ఈ చిత్రం మాకు చాలా స్పెషల్. సందీప్తో ఆరేళ్లుగా ప్రయాణం చేస్తూ వస్తున్నాను. ఐడియాలజీని నమ్మి ముందుకు వెళ్లండని సాయి దుర్గ తేజ్ చెబుతుంటారు. మా సినిమా అంతా కూడా ఐడియాలజీల మీదే ప్రయాణం ఉంటుంది. ఫాదర్, గ్రాండ్ మదర్, వైఫ్, హజ్బెండ్ ఇలా అందరి కోణంలోనూ ఈ చిత్రం ఉంటుంది. రైటర్ పద్మభూషణ్ తరువాత ఈ చిత్రానికి దిల్ రాజు గారే సుహాస్ పేరు చెప్పారు. ఈ మూవీతో డిస్ట్రిబ్యూటర్ కూడా కాబోతోన్నాడు. ఆయనకు ఆల్ ది బెస్ట్. సంకీర్తన బాగా నటించిందని సినిమా చూసిన వాళ్లంతా చెబుతున్నారు. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల మాట్లాడుతూ.. ‘దిల్ రాజు, హర్షిత్ గారికి, సుహాస్ గారికి థాంక్స్. మా టీజర్ను లాంచ్ చేసిన ప్రభాస్ గారికి థాంక్స్. నా ఫేవరేట్ నా పెళ్లాం పాట బాగా వైరల్ అయింది. సుమ, రాజీవ్ కనకాల, ఆట సందీప్ రీల్స్ చేశాక మరింత వైరల్ అయింది. సినిమా కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
హీరోయిన్ సంగీర్తన మాట్లాడుతూ.. ‘మా చిత్రం అక్టోబర్ 12న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి. మా టీజర్, ట్రైలర్లకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కూడా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…